గతాన్ని సమీక్షించుకుని సాయుధ పోరాట పథంలో పురోగమిద్దాం!
(నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల వెనుకంజ తర్వాత విప్లవోద్యమ పునర్నిర్మాణానికి పూనుకున్న కా. కొండపల్లి సీతారామయ్య 1972లో రాసిన సుప్రసిద్ధ పత్రం ఇది. దీనికి ఆత్మ విమర్శ రిపోర్టు అనే పేరు కూడా ఉంది. ప్రస్తుత విప్లవోద్యమ సంక్షోభాన్ని, తాత్కాలిక ఓటమిని విమర్శనాత్మకంగా అర్థం చేసుకోడానికి, భవిష్యత్తుపట్ల నిర్మాణాత్మక, ఆశావాదంతో వ్యవహరించడానికి స్పూర్తిని ఇస్తుందని ఈ పత్రంలోని ఉపోద్ఘాత భాగాన్ని పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాం.. వసంతమేఘం టీం) నక్సల్బరీలో 1967లో ఆరంభమైన రైతాంగ సాయుధ విప్లవం భారత విప్లవ చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. రివిజనిస్టు నాయకత్వం తెలంగాణా రైతాంగ సాయుధ విప్లవానికి ద్రోహం తలపెట్టిన తర్వాత చైతన్యపూరితంగా










