వివాదస్పదమవుతున్న న్యాయస్థానాల తీర్పులు…?
ఈ మధ్యకాలంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆయా వర్గ ప్రజలలో ఆందోళనలు రేకెత్తించాయి. ఈ తీర్పులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కేవలం సాంకేతిక అంశాలపై కాకుండా అవి సహజ న్యాయానికి అనుగుణంగానూ, హేతుబద్దంగానూ ఉండాలన్న అభిప్రాయం ఆయా వర్గ ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దళితులు మతం మారితే వారి యొక్క ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని చెప్పడం జరిగింది. ఈ తీర్పు వలన తక్షణం










