ఒడిశాలోని రూర్కెలాలో రైల్వే విస్తరణనువ్యతిరేకించిన ఆదివాసీ హత్య: నిర్వాసిత్వ ముప్పు
2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్గఢ్లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్పాత్లతో కూడిన రహదారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటికి ఆవల దశాబ్దాలుగా ఒక పోరాటం సాగుతోంది, కానీ అది ప్రధాన స్రవంతిలో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్ఎఐఎల్) నడుపుతున్న భారీ రూర్కెలా స్టీల్ ప్లాంట్ కారణంగా రూర్కెలాను ఒడిశా "ఉక్కు నగరం" (ఇస్పాత్ నగర్) గా పిలుస్తారు. భారతదేశ పారిశ్రామిక "అభివృద్ధి"కి, అపారమైన ఖనిజ నిక్షేపాలకు రూర్కెలా ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది.










