వ్యాసాలు

భారతి సాహిత్య ధమ్మం

సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో  చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో  సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్  మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు  తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా
వ్యాసాలు

గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్  సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం
వ్యాసాలు

అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు

ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.
వ్యాసాలు

విద్రోహాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెలరేగిన యుద్ధ కాలంలో చారిత్రక సత్య ప్రకటన

*భార‌త విప్ల‌వ పంథా - స‌మ‌కాలీన సందర్బం* పుస్త‌కం ముందుమాట.  డిసెంబ‌ర్ 7న హైద‌రాబాదులో జ‌రిగే స‌ద‌స్సులో ఆవిష్క‌ర‌ణ... వ‌సంత‌మేఘం టీం ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు.  మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల
వ్యాసాలు

దిగజారుతున్న ఎన్నికల వ్యవస్థ

ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన  సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, భారత ఎన్నికల సంఘం తీరుతెన్నులు,  ఎన్డీఏ కూటమి ప్రభుత్వ  "ఓటు చోరీ"   పైన. రెండవది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ పైన జరుగుతున్న సైనిక,  భావజాల పరమైన దాడుల నేపథ్యంలో.  వారు సాయిధ పోరాట విరమణ చేసి ఎన్నికలలో పాల్గొనాలని. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందించి, ప్రకటించిన తీరు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలకు గురికాబడింది. చివరకు ఈ వివాదం
వ్యాసాలు

తీవ్ర పేదరికం లేని రాష్ట్రంగా కేరళ ప్రకటించుకోవడం అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచాడమే

2025 అక్టోబర్ 31 ఆశా కార్యకర్తల తర్వాత, ఆదివాసీ సంఘాలు కూడా కేరళ ప్రభుత్వం నిర్వహించబోయే "తీవ్ర పేదరికం లేని రాష్ట్రం" ప్రకటన కార్యక్రమంలో సినీ నటులను పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశాయి. ఈ ప్రకటనను అవి "తప్పుదారి పట్టించే ఎన్నికల ఎత్తుగడ"గా అభివర్ణించాయి. ఆదివాసీ గోత్ర మహాసభ, ఆదిశక్తి సమ్మర్ స్కూల్‌లు చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, నవంబర్ 1 (కేరళ ఆవిర్భావ దినం) రోజున చేయబోయే ఈ ప్రకటన ఆదివాసీలు, దళితులు, మత్స్యకారులతో సహా అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను దాచిపెడుతోందని పేర్కొన్నాయి. అధికారిక కార్యక్రమానికి సినీ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్‌లను ఆహ్వానించడం
వ్యాసాలు

ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు స్వభావం దాని సిద్ధాంత రాజకీయాల లోగుట్టు…

(*విప్ల‌వోద్య‌మంపై విషం క‌క్కుతున్న విద్యార్థి ప‌రిష‌త్ ప్ర‌చారాన్ని ఎండ‌గ‌ట్టండి* అనే పేరుతో రాడిక‌ల్ విద్యార్థి సంఘం 1984లో ప్ర‌చురించిన పుస్త‌కంలోని ఒక వ్యాసం ఇది- వ‌సంత‌మేఘం టీం) తరతరాల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటాలపై తీవ్రమైన దమనకాండను ప్రయోగించి అణిచి వేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం సి.ఆర్.పి బలగాలను దింపగా మరో వంక ఆరెస్సెస్ ,బిజెపి, ఎబివిపిలు ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలిచి విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ రైతుకూలీలపై, విద్యార్థి యువజనులపై పాశవికమైన దాడులకు పాల్పడుతున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలలో ఈ ఫాసిస్టు మూకల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది.
వ్యాసాలు

అటవీహక్కుల చట్టాన్ని అపహాస్యం చేసిన హైకోర్టు 

25 అక్టోబర్ 2025ఛత్తీస్‌గఢ్‌లోని ఘట్‌బర్రా గ్రామానికి మంజూరు చేసిన సాముదాయిక అటవీ హక్కుల  పట్టాను రద్దు చేయడాన్ని హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి సవాలు చేస్తూ, దానిని 'ఆందోళనకర'మైనదిగానూ 'తీవ్రంగా నిరాశపరిచేది'గానూ అభివర్ణించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్-జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు భారతదేశంలో ఒక సాముదాయిక అటవీ హక్కుల  పట్టా ను రద్దు చేయటం బహుశా ఇదే మొదటి సందర్భం అని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అక్టోబర్ 23న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కోర్టు తన అక్టోబర్ 8 నాటి ఉత్తర్వులో, హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి లేవనెత్తిన
వ్యాసాలు

 ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు  తీర్పుః   బొగ్గు పారిశ్రామికుల విజయం

హస్‌దేవ్ అరణ్య అటవీ ప్రాంతంలోని ఘట్‌బర్రా గ్రామ ప్రజలకు ఉన్న అటవీ హక్కులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2025 అక్టోబర్ 8న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక న్యాయ అవహేళన. ఇది కేవలం ఒక తీర్పు కాదు; ఆదివాసులను మాట్లాడనీయకుండా చేసి, బొగ్గు మాఫియాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. ఈ తీర్పు అటవీ హక్కుల చట్టం-2006 కింద ఇచ్చిన హక్కులను రద్దు చేయడమే కాకుండా, తరతరాలుగా ఈ అటవీ ప్రాంతాలను సంరక్షిస్తున్న ఆదివాసుల జీవనాధారాన్ని, గౌరవాన్ని కూడా ఆటపట్టిస్తోంది. అంతేకాదు, దీనివల్ల “అభివృద్ధి” అనే పేరుతో అడ్డూ అదుపూ లేకుండా  పరిశ్రమల విస్తరణకు అనుమతినిస్తోంది. భారతదేశ