సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
కవిత్వం సాహిత్యం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను
సాహిత్యం కవిత్వం

అమాయకులు వాళ్ళు

అవును, వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే, కానన కారుచీకట్లో వెలుగుకై వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు పచ్చని పంట పొలాలపై కార్పొరేట్ గద్దలు వాలుతుంటే, పంటను కాపాడే రైతన్న  వడిసెల విసురు నేరమైన చోట ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన  నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో హక్కుల నేతికై దేవులాడక ,  ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై దేబరించని అజ్ఞానులు వాళ్ళు.   కులం,మతం పేరుతో మానవత్వం మంటగలుస్తున్న మహోన్నత భారతంలో, హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్ దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక, బిర్శాముండా,కొమురం భీమ్ పంథానవసరంగా పట్టిన
సాహిత్యం కవిత్వం

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల మాటునదాగే ప్రశ్నవిరుచుకుపడుతుందని వాడి వెన్నులో వణుకు నాటిన ప్రతి మొక్కఓ ఆయుధ భాండాగారమౌతుందేమోననికలవరింతకాకులే కాపలాగాఅరిచే అరుపుఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననేభావి స్వప్నం వాడ్ని నిదుర పోనీయట్లేదేమో శరదృతువు లోకాచే వెన్నెల్లోపల్లె బతుకుల్లో వెలుగులు నింపే దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు వాడ్నినిలువెత్తు గొయ్యిలోపాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనేఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనానెరవేరుతుంది లే
సాహిత్యం కవిత్వం

అలల హోరుకు సంకెళ్ళేస్తావా..!?

సుఖమయ జీవితాల్లోని సంతోషాల్ని నిషేదించుకున్నోళ్లం గాఢాంధకారంలో చిక్కిన మట్టి బిడ్డలకోసం చిమ్మ చీకట్లను ఆలింగనం చేసుకున్నోళ్లం  నెర్రెలిచ్చి డొక్కలెండిన దుఃఖ్ఖ సాగరాల కనుకొలుకుల్లో కాంతి రేఖలమై పునర్జీవించినోళ్ళం శతాబ్దాల శుష్కవాగ్దానాలనీ పురోభివృద్ధి పాదాలకింద చితికినఆకలి పేగులమన్యానికి సైనిక కవాతునేర్పినోళ్ళం  అడవిని అన్యాక్రాంతం అవనివ్వని శపథాన్ని ఎరుపెక్కిన పతాక రెపరెపల్లో                                                         నిత్యం నిగనిగలాడే                                             నిఘా
కథలు

ఆవు శాస్త్రం!

వయసు మీద పడ్డ వైస్ ఛాన్సలర్  కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళు పులుముకొని రెప్పలు ఆడించి చేతిలోని ఆర్డర్‌ని మరోసారి చూశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి వచ్చిన లెటర్ అది. మళ్ళీ చదువుకున్నారు. క్షణకాలం అలానే వుండిపోయారు. రిజిస్ట్రారూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరూ డీన్లూ డిపార్టుమెంటు హెడ్లూ సూపరింటెండెంట్లూ యింకా ప్రొఫెసర్లూ కొద్దిమంది స్టూడెంట్లూ వారి నాయకులూ అంతా అయన వంక చూశారు. ఒకరకంగా అది ఇంటర్నల్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెన్సియల్ మీటింగ్. ‘నేషనలిజమ్... జాతీయవాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యీ ప్రతిపాదనలు చేసింది...’ అన్నారు ఛాన్సలర్. ‘విద్యారంగం అందుకొక మార్గం... సో’ అని ఆగిపోయారు.
సాహిత్యం గల్పిక కథలు

ఆవు యేమనును?

మేధావులందరూ వొక్క చోట చేరారు. ‘జై శ్రీరామ్’ చెప్పుకున్నారు. వాళ్ళ మెదళ్ళ కుదుళ్ళలో దేశ భవిత దాగుందని వాళ్ళకే తెలిసిపోవడంతో మదముతో మేధో మదనమునకు సిద్ధపడ్డారు. గోడకు వేళ్ళాడదీయబడ్డ దేశ యేలికుని చిత్రపటం చూస్తూ ‘ఆ తెల్లని గడ్డంలో యేమి కనిపిస్తోంది?’ అని అడిగి, అంతలోనే ‘ఆ తెల్లని గడ్డంలో దాగిన మర్మమేమి?’ అని దిద్దుకున్నారు వృద్ధ పెద్దమనిషి. ‘స్వచ్ఛత’ అన్నారు కొందరు. ‘పాలవంటి తెల్లని స్వచ్ఛత’ అన్నారు యింకొందరు. ‘మాకు దేశ శిఖరాయమాన హిమాలయాలు కనిపిస్తున్నాయి’ అన్నారు మరికొందరు. ‘మాకయితే పాల సముద్రం కనిపిస్తోంది’ అన్నారు మిగిలిన అందరూ. ‘నాకయితే తెల్లని ఆవు కనిపిస్తున్నది’ యెంతో సౌమ్యంగా
సాహిత్యం వ్యాసాలు

ఆన్ లైన్ విద్యతో పెరిగిన డ్రాపౌట్లు

అంతర్జాతీయ కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO) ప్రకటించింది. మార్చి 20,2020 నాడు దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి.అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్ లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి.గ్రామీణ ప్రాంతాలలోని,పట్టణ ప్రాంతాలలోని యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు,కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు.వీరి చదువులు నిలిచిపోయాయి.తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల
సాహిత్యం కవిత్వం

పదునెక్కిన వేళ యిది

చిలకమ్మా! చిలకమ్మా!చైత్ర మాసపు వెన్నెలపండునుదోచుకుపోదామని వచ్చిందెవరేఉలుకమ్మా! పలుకమ్మా! బుడి వడి నడకలబుడతన్నా ఉడతన్నారాసుకొని దాచుకున్నజనరూపకాలను దండుకుపోయినదెవరే కూతలమ్మా క్రో యిలమ్మాతెలవారు చల్లని సంధ్యలోనీరెండతొడిగిన లేమావి చిగుళ్లనుపచ్చటి చెట్టుమీదేచిదిమేసే ఆ మృగమెవరే జాజిమల్లీ ప్రేమవల్లీనిండారా దాచుకున్నపూలసుగంధాన్నిమురికి కాలువలోకివొలిపిన మూర్ధుడెవరే పట్నంపాలబడ్డ పాలపిట్టాపసుల పిలగాని వకాల్తాఅడవిలిక్కుజిట్టల కేసు కట్టలుమాయం చేసిందెవరేఎవరమ్మా? ఆ బూచొోళ్ళు డమ డమా టమ టమాటముకేసే నామాల పిట్టానీతప్పేటమూగదయ్యిందిచిర్రా, చిటికెనపుల్లాఇరిచేసిందెవరే పద్మమ్మా పద్దమ్మాజిట్రేగి చెట్లపై నువు గీసినఅమరుల చిత్రాలుదొంగిలించినదెవరే!ఎవరమ్మా ఆ బూచోళ్ళు నెత్తిన తురాయినెత్తినతురక పికిలి పిట్టానీ కలలను, కాంక్షలనుకొల్లగొట్ట వచ్చిందెవరేపూలపట్టురెక్కలనువిరివజూసిందెవరే మందార ఎరుపెరుపువెదురు జీనువాయీకాలం ముంచుకొస్తోందిఆడివంచుల నుంచిఆకురాయి తేగలవా కంసాలి పిట్టనూవడ్రంగి పిట్టనూ పిలవండేకాలం ఎట్టేడుస్తుందో యేమోఇంకమనమూ