ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

వ‌ర్త‌మాన క‌థా ప్రయాణం బహుముఖీనం

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? అవును. కథా
సాహిత్యం కవిత్వం

ఒక ప్రజాస్వామ్యంలో

కొన్ని మాటలకు నరం ఉండదు గురిపెట్టి వదిలాకచిల్లం కల్లమైన ఒక నెత్తుటి నేల విలవిలలాడుతూ ఉంటుంది  గుండె నిండా విషం నింపుకున్నప్రేమ ఒలకబోయడం నెత్తుటి మైలురాళ్ళకు తెలియదనుకుంటావు  ఒక సంకుచిత రాజకీయ ఆవరణంలోఅజ్ఞాతం వీడిన నేల సంబరంనీ కళ్ళకు దృశ్యం కాకపోవచ్చు  ఒకరో ఇద్దరో పార్లమెంటుభవనమోమొలకెత్తలేదు పన్నెండు వందల ప్రాణాలు పోసినిర్మించుకున్న కల  కోట్ల హృదయ ధ్వనుల సంగమ స్థలి ఈ రోజులు పరిమళించకపోవచ్చుఈ కాలం వేదనై మిగలవచ్చుఈ ఉదయం నిరాశై వెలగవొచ్చుఈ నేల దుఃఖ రాసిగా ఉండవొచ్చు ఒకరోజునుమండే నెత్తురు పరిమళిస్తుందిఒక కాలాన్నిఆనందంగాపొలం నుండి రైతులు భుజం మీద మోసుకు వస్తారుప్రజలు ఒక ఉదయంఊహ కందని ఆశలు ఉదయిస్తారు  ఒక ఆకుపచ్చని సందేశమైతెలంగాణ దుఃఖ భూమిని
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

బాధిత స‌మూహాల విముక్తే క‌థ ల‌క్ష్యం కావాలి

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  ఈ సంచిక‌లో కొంద‌రి సాహిత్య‌కారుల అభిప్రాయాలు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1.కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి చేరాల్సిన తీరం ఏదైనా ఉన్నదా? కథ ఒక జీవన
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఈ మోహన్రావున్నాడు చూడండీ..!

అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు
సాహిత్యం కవిత్వం

వీరగాధ

యాది వెన్నెల కాస్తుందివన భూమంతపురా కాల మ్రానుకోటలోజ్ఞాపకాల జాతర ఒక కుంకుమ్భరినివీర మరణాల మీంచినడిచి వస్తున్న కాలాన్ని కథలు చెబుతుంది కరువు గెల్చిన నేల మీదకడుపు పగుళ్ళు బడిఆకలికన్నీళ్లతోకొండలు కోనలు తడిసిపోయినాఓరుగల్లు మట్టికోట చెమ్మగిల్ల లేదు నిలువెల్లా గాయల్తో ఆత్మాభిమానంఆదివాసీ యుద్ధ మైంది శక్తి వంత ఆయుధాల్నిసవాల్ చేసినసంప్రదాయబాణం చెల్లా చెదురైన మోసం గెలిచాకతుది శ్వాస చిలుకలగుట్టందుకుందిఆగిపోకుండా- ప్రాణాల్ని దాచుకోలేనిఒక నిష్కల్మష కాలంప్రాణం పోస్కోని మానవాళికిఆకుపచ్చ తోరణాల అడివి కడుతుంది ఒక వీరోచిత త్యాగాలసంస్మరణప్రకృతోత్సవంఒక చేదు నిజాలతియ్యనిబంగారి జాతర పాలకుల కుటుంబ కణకణంప్రజల సొమ్మని ప్రకటించినబతుకుపోరు వెదురుచెట్లషామియనాలుపెద్ద పెద్ద చెట్లపందిళ్ళుప్రకృతి పిలిచిన ధ్వని ఇప్పపువ్వై గుప్పుమంటూఒక ఆదిమ జీవనవాసనేదోమనసును
సాహిత్యం వ్యాసాలు

అస్తిత్వ కవితా ప‌తాక  

‘‘అప్పుడప్పుడూ చావు చింత చీకట్లో కుక్కలా వెంటాడుతుంటుంది’’ ఎండ్లూరి సుధాక‌ర్ మస్తిష్కం బద్దలై ఉబికి వచ్చిన కవిత *చావును చంపండి*.  తన జీవితానికిలా ఈ రకంగా  ముగింపు పలుకుతాడని ఊహించినవాళ్లెవ‌రూ ఉండ‌కపోవచ్చు. అస్తిత్వజెండాని గుండెలనిండా బతుకు పోరాటం చేసిన నిఖార్సైన కవి ఎండ్లూరి సుధాకర్‌. బతుకంటే అతడికి ముమ్మాటకీ యుద్దమే.  ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించినవాడు. తన జీవితమంతా ఉద్యమయ్యే సాగింది. కవిత్వాన్ని ఉద్యమానికి ఆయుధంగా వాడినవాడు. బహుశా ఈ కాలపు మహోజ్వలిత దళిత ఉద్యమకారుడు. అతడి కవిత్వం నిండా ఆర్తి,
సాహిత్యం కవిత్వం

అదే వర్షం

వేకువల్లేవేయి కలలు వెలిగించుకునితూరుపు కాంతులు పూసుకునిచూపులులు మార్చుకున్న రోజులుకళ్లపై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటేకళ్ళలో వెలిగే దీపాలుదారిచూపటం .మనసున ఊగే భావాలుఊరించటంఅలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లోఅలా ఊగిపోవటంబంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలావెన్నెల ఆకాశాన్ని వొంచితల నిమురుతూంటేనూ… లోలోపలజ్ఞాపకాలు తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలివొలికి చిలికినీ ప్రపంచాన్నితెరలు తీసి ప్రదర్శిస్తుంటేనూ అదే వర్షం …. నాపై వాలే చినుకుల్లోనీ జ్ఞాపకాలు తడుపుతున్నాయి . వాస్తవానికి జ్ఞాపకానికిఒక తీయని ఊహా లోకం లోకొత్త ప్రపంచాన్నికళ్ళలో నిర్మిస్తాను అర్ధమౌతోందాజీవితమంటే కన్నీళ్లే కాదుకొన్ని కౌగిలించే జ్ఞాపకాలు కూడా .
సాహిత్యం వ్యాసాలు

కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం

ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన  కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.
సాహిత్యం వ్యాసాలు

సంస్కృతి కోసం పోరాటాలు-వర్గపోరాటం

మాట తీరు సంస్కృతి. ఆలోచనా తీరు సంస్కృతి. బతుకు తీరు సంస్కృతి. ఒక్కమాటలో చెప్పాలంటే- మనుషులు పరస్పరం సంబంధాలు నెరపుకునే ప్రాథమిక తలాన్నే సంస్కృతి అనవచ్చు. ఈ సంస్కృతీ మాధ్యమం ద్వారానే మనుషులు సంపర్కంలోనూ, సంఘర్షణలోనూ ఉంటారు. అయితే సంస్కృతిని అర్థం చేసుకోవడంలో గాని, విశ్లేషించడంలో గాని విభిన్నత ఉండడానికి ప్రధాన కారణం ఆర్థిక కోణంలోనే గాక పలు రకాలుగా భారత సమాజం విభజితమై ఉండడమే. ఇలాంటి విభజితమైన సంక్షుభిత సమాజంలో సంస్కృతిని ఒకే ముద్దగా చూడలేం. అందుకే మార్క్సిస్టులుగా మనం భారత ఉపఖండంలో భిన్న సమాజాలు, భిన్న సంస్కృతులు ఉన్నాయని అంటాం. కనుక సంస్కృతిని కేవలం సానుకూలమైన
సాహిత్యం కవిత్వం

ఆకలి జోలె

జోలెకుఅటు అతడుఇటు నేను.. మా ఇద్దరి మధ్యజోలె పెరు ఆకలి.. అల్యూమినియం బిళ్ళ కోసంఇద్దరిని దేహీ అంటూ అడిగిందిదేశ భవిష్యత్తు.. జోలెకు అటువైపు వ్యక్తి..ప్రభువు దుఃఖంతో నిండినదరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..ఇటు వైపు నేను..వస్తే ఛిద్రమైతూమనమద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను.. రాం, రహీం,జీసస్ఎవరచ్చిన అంగట్లోఅర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్నభవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?అంతటి ధైర్యం చేస్తారా..? (కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)21/01/2022