సమకాలీనం

తుడిచివేతపై తుడిచివేత

'ది లాస్ట్ ప్లే ఇన్ గాజా' నాటకాన్ని ప్రదర్శించడానికి భారత వీసా నిరాకరించబడిన యాంటీ-జయోనిస్ట్ ఇజ్రాయెలీ నాటకకర్త ఐనాట్ వైజ్మాన్ ఈ వ్యాసం రాశారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య, అంటే జయోనిజం - హిందుత్వ మధ్య పెరుగుతున్న బంధం వెనుక ఉన్న అసలు రూపాన్ని ఈ చర్య ఎలా బయటపెడుతుందో ఆమె వివరించారు గత వారం కేరళలో జరిగిన ITFOK ఉత్సవంలో మా నాటకం "ది లాస్ట్ ప్లే ఇన్ గాజా" (గాజాలో చివరి నాటకం) ప్రదర్శించాల్సి ఉండింది. రెండు షోలు జరగాలి. ఈ నాటకం గాజాను తుడిచిపెట్టడానికి సంబంధించిన నాటకం. నాశనమైన దానిని థియేటర్ ద్వారా తిరిగి సృష్టించడానికి
ఆర్ధికం

సవాళ్లను గుర్తించని ఆర్థిక వ్యవస్థ

మోడీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్‌తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లక్షల కంపెనీలు మూతబడ్డాయి. ఉద్యోగాలు లేక యువత తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొరంటున్న ప్రధాన సవాలు పేదరికం. దాదాపు 28 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. దీనివల్ల  జనాభాలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థలో పాల్గొనలేకపోతున్నారు. ఇది పేదరికం యొక్క విష వలయానికి దారితీస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న మరో పెద్ద
సమకాలీనం

కేసులు కొట్టేసినా, జైలు నుంచి విడుద‌లైనా దొర‌క‌ని స్వేచ్ఛ 

2022 మే లో రతీరామ్ మాంఝీ మావోయిస్టు ఆరోపణల నుండి విముక్తి పొందారు, కానీ ఆ ఆరోపణల నీడ ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. హత్య, అల్లర్లు, ఆయుధ చట్టం, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ కింద మహువాటాండ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బొకారోలోని ఒక సివిల్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం ముగిసినప్పటికీ, ఆయన జీవితం గతంలోలాగా సాధారణ స్థితికి చేరుకోలేదు. మిగిలిందల్లా పోలీసుల వేధింపులు, సామాజిక వివక్షతో కూడిన సంవత్సరాల తరబడి అవమానాలే. దీని పర్యవసానాలు ఆయనతోనే ఆగిపోలేదు, ఆయన కుటుంబాన్ని కూడా తాకాయి. ఒక పాఠశాల తన
కథనం

ఎర్ర మల్లెలు

మకాం ఖాళీ చేసి వెళ్తున్నపుడు ముందు టీములో బి.జి.ఎల్స్ తక్కువున్నాయని ఆ టీములోకి కా. సునీతను పంపించాడు కా. సురేష్ దాదా. కొంచెం ముందుకెళ్ళాక గుట్కా వాసన వచ్చింది. అది డిప్యూటీ కమాండర్ అర్జున్ కు చెప్పిన వెంటనే పోలీసులు కనిపించారు. 'ష్...ష్...'కమాండర్ కా. నందు. 'మాట్లాడకండి' హెడ్ క్వార్టర్ ఎ సెక్షన్ నుండి జమిలి. వెనుక వస్తొన్న వారితో. రెండడుగులు ముందుకేయగానే కవర్ లోకి దూకారు కా. నందు, పూలోలు. ట్రిగ్గర్ నొక్కాడు నందు. 'ఢాం...' అంటూ పేలింది. ఒకడు పడ్డాడు. షెల్ వేసింది పూలో. దద్దరిల్లింది. వెనక్కి ఉరికారు పోలీసులు. నందు, అర్జన్, పూలో, జుగిని,
ఈ తరం సాహిత్య విమర్శ

ఏదీ విమర్శ?

తెలుగు సాహిత్యంలో విమర్శ తిరోగమనదిశగా ప్రయాణం చేస్తుందనే చెప్పవచ్చు. విమర్శ పేరుతో రాస్తున్నవన్నీ విమర్శకుండే మౌలికసూత్రాలకు అనుగుణంగా రాయడం లేదనే అపవాదు ఇటీవల బలంగా వినిపిస్తున్నది. అసలు విమర్శకుని కర్తవ్యం ఏమిటి? ఒక పుస్తకాన్ని ఎలా పరీక్ష చేయాలి? కవిత్వమైతే కావ్యపరీక్ష ఎలా చేయాలి? కథ అయితే వర్తమాన సమాజంతో పోల్చి ఎలా చెప్పాలి? నవల ప్రయాణం ఎలా సాగింది? ఇలా సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఎలా మూల్యాంకనం చేయాలన్నదే విమర్శలో కీలకం. ఎవరెన్ని చెప్పినా విమర్శకు మార్క్సిజమే పునాది రాయి అనే విషయాన్ని ఎప్పుడైతే విమర్శకులు విస్మరిస్తారో విమర్శప్రయాణం తిరోగమనమే. ఈ ముగ్గుర్ని చదవకుండా విమర్శ చేస్తున్నారు! విమర్శకులకు
సమకాలీనం

భీమా కోరెగావ్ శౌర్య దివ‌స్ లో మనువాద వ్య‌తిరేక స్ఫూర్తి 

దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో
ఓపెన్ పేజీ

హద్దులు లేని ద్రోహ చింతన

అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది. విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొంద‌రు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి
అలనాటి రచన

క్రిటికల్‌ రియలిజం

మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి.  పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా - మనస్సుగా - ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం
ఆర్ధికం

ఆర్థిక అసమానతలో అగ్రస్థానం భారత్‌దే!

ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా
మీరీ పుస్తకం చదివారా ?

కత్తుల వంతెనపై సమాజం

నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు