సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని  కొందరు హితవు పలికారు.   వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్‌ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన  రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని  ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం.
సంపాదకీయం

అమరావతి ఎప్పటికీ వర్తమానమే…

వర్షం కురుస్తున్నప్పుడు ఆంధ్రుల రాజధాని ఎలా ఉంది అనే సందేహం దూరంగా ఉన్న తెలుగువారికి రావచ్చు. అమరావతి మునకలో ఉందా, లేదా వర్షపు నీటి వెలుపల ఉందా! ఇవి రెండు పాక్షిక సత్యాలు. 'నీరు పల్ల మెరుగు ' అనే సామెత తెలుగువారిదే. ఇరవై  ఎనిమిది   గ్రామాలు పూర్తిగా నీటిలో ఉండవు. కొన్ని గ్రామాలు ఉండవచ్చు. ముప్పై రెండువేల ఎకరాల లో రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు భోరున కురిసే వర్షానికి నీరు చేరడం సహజం. దానిని ఒక కాలపు రివాజుగా చూడాలి. వర్షం కురిస్తే భారతీయ నగరాలు జీవనదిలో ఉన్నట్లు ఉన్న దృశ్యాలు  సహజం. అమరావతి కూడా దీనికి
సంపాదకీయం

విప్లవం తీర్చిదిద్దిన మనిషి

ఆగస్టు 13న చత్తీస్ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు కూడా చనిపోయినట్లు సమాచారం. వాళ్ల గ్రామస్థులు కావచ్చని, అందుకే వాళ్ల వివరాలు ప్రకటించడం లేదని అనుమానం. ఇప్పటికి పోలీసులు ప్రకటించిన ఇద్దరు మావోయిస్టులలో ఒకరు స్థానిక ఆదివాసీ, మరొకరు కర్నూలు జిల్లాకు చెందిన సుగులూరు చిన్నన్న అలియాస్ విజయ్. విప్లవం ఎన్ని అద్భుతాలు చేస్తుందో. ఎందరిని అసాధారణ మానవులుగా తీర్చిదిద్దుతుందో .. చరిత్రను నిర్మించే ఎన్ని సామాజిక సాంస్కృతిక నైతిక పరివర్తనా క్రమాలను ముందుకు నడుపుతుందో. ఇందులో పాల్గొనే కోటానుకోట్ల మందికి ప్రతినిధులనదగిన లక్షలాది మందిని ఉదాహరణలు
సంపాదకీయం

శాంతి, సమానత్వం కోసం..

మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదన లక్ష్యం సాధారణ ప్రజల ప్రాణ రక్షణేనా? అంతకంటే విశాలమైన ఉద్దేశం మరేదైనా ఉన్నదా? హింస లేని సమాజం కావాలనే వాళ్ల కోరికను ఎలా అర్థం చేసుకోవాలి? అనే చర్చ జరుగుతున్నది. గతంలో మవోయిస్టులకు-ప్రభుత్వానికి మధ్య జరిగిన శాంతి చర్చల్లో అనుకూల, ప్రతికూల ఫలితాలను చూసిన సమాజం అలిసిపోకుండా, నిరాశకు గురికాకుండా మళ్లీ అట్లాంటి ప్రయత్నానికి మానసికంగా సిద్ధమవుతున్నది. ఇది మన సమాజ స్థితిని ఎత్తిపట్టే బలమైన సూచిక. సమాజం చాలా చెడిపోయిందని, ఎవ్వరి గురించి ఎవ్వరికీ పట్టని చైతన్యరహిత దశకు చేరుకున్నదనీ కొందరు అంటూ ఉంటారు. ఇదేమీ దురభిప్రాయం కాదు. అవాస్తవం కానే
సంపాదకీయం

కాల్పుల విరమణ ఒప్పందాలు- విప్లవోద్యమ పంథా: మార్క్సిస్టు దృక్పథం

(విరసం ఆవిర్భావ దినం సందర్భంగా జులై 6 న హైదరాబాదులో నిర్వహిస్తున్న సదస్సు సందర్భంగా విడుదల చేసిన కరపత్రం నుంచి ...) సాయుధ పోరాట సంస్థలకు, ప్రభుత్వాలకు మధ్య కాల్పుల విరమణ ఒప్పందాలు రాజ్యాంగపరిధిలోనే జరుగుతాయి. ఈ కారణం వల్లనే మావోయిస్టు పార్టీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాలకు రావాలని వివిధ ప్రజాస్వామిక శక్తులు ఆకాంక్షిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ డిమాండ్‌ ప్రజా ఉద్యమ రూపం తీసుకున్నది. శాంతి చర్చల ఆవశ్యకతను వివరిస్తూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి. వీటితోపాటు కాల్పుల విరమణ ఒప్పందాలు`శాంతి చర్చల మీద మార్క్సిస్టు విశ్లేషణ కూడా
సంపాదకీయం

ప్రజా యుద్ధ శాంతి దూతలు

ఒక్కరొక్కరే ఒరిగిపోతూ కన్నీటి చుక్కలవుతున్నారు. కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోబోతే అవి రక్తాశ్రువులని గుండెలు బరువెక్కుతున్నాయి. కానీ రెండు నెలలకు పైగా శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో యోధుల పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న స్పందన ఆ యోధులిచ్చిన శాంతి సందేశపు ప్రదర్శనలుగా తెలుగు నేల అన్ని చెరగులలోనే కాదు ఇవాళ దేశమంతా నలు దిశలా విస్తరిస్తున్నది. ఇది మృతదేహాల స్వాధీన ఉద్యమం ఎన్కౌంటర్లు జరిగి ఆ శవాలనుంచే ఆసుపత్రి శవాగారాల నుంచి, రిపోస్టుమార్టం కోసం న్యాయపోరాటం జరిగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి, రిపోస్టుమార్టం జరిగే ఆసుపత్రుల నుంచి, అమరుల గ్రామాల దాకా ప్రదర్శన లైనట్లుగా మారుమూల గ్రామాలలో కూడా అంతిమయాత్రలుగా
సంపాదకీయం

ఆయన మరణానంతర జీవితం

కా. బసవరాజు అమరుడయ్యాక,  అర కన్నులతో ఆయన మృతదేహం ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అదిగాక, ఆయన నవ్వ యవ్వనంలో ఉన్నప్పటి మరో ఫొటోను డెవలప్‌ చేసి  అభిమానులు ప్రచారంలోకి తెచ్చారు. దాన్ని ఒక మిత్రుడు  చూసి  ‘ఇది ఆయనకు సరిపోలినది కాద’ని అన్నారు. ఈ పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన నివాళి సందర్భాల్లో అదే కనిపిస్తున్నది. యాభై ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపిన నంబళ్ల కేశవరావుకు ఉద్యమంలో ఉండిన  పేర్లు బైటికి వచ్చాయేగాని, ఇంకో ఫొటో ఏదీ ఎవ్వరి దగ్గరా ఉన్నట్లు లేదు.   ఆయన కుటుంబసభ్యులు కూడా పాతికేళ్ల వయసులోని ఆ ఫొటోకే పూల దండలు వేసి
సంపాదకీయం

కర్రెగుట్టలపై మీరు ఎగరేసింది కార్పొరేట్‌ జెండా కదూ

ప్రతీకలకు చాలా అర్థాలు ఉంటాయి. జెండాల్లో, రంగుల్లో, చిహ్నాల్లో అసలైన భావాలు ఉంటాయి.   మనుషులు చేసే పనుల్లో బైటికి కనిపించని లక్ష్యాలు సహితం అవి ప్రతిబింబిస్తుంటాయి. చత్తీస్‌ఘడ్‌`తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను భారత ప్రభుత్వ బలగాలు  ఏప్రిల్‌ 22వ తేదీన చుట్టుముట్టాయి. సరిగ్గా ఆ రోజే దిగ్బంధం మొదలైందా?  అంతక ముందు ఎంత సన్నాహం జరిగి ఉంటుంది? ఎంత ప్రణాళిక అమలయి ఉంటుంది? గుట్టలకు, గూడేలకు, రోడ్లకు యుద్ధం ఎంతగా భీతానుభవంలోకి వచ్చి ఉంటుంది? అడవి యుద్ధరంగం కావడం, ప్రకృతి తర్కం అటుపోట్లకు గురికావడం, మనుషులు గుండెలవిసేలా ఆందోళనపడటం పత్రికలకు అందేదేనా? టీవీలకు కనిపించేదానా? దేశమంతా కలవరపడి, కలతచెంది, యుద్ధం
సంపాదకీయం

శాంతి చర్చలు – హింసపై వైఖరులు

శాంతి కోసం ప్రయత్నించవలసి వచ్చిందంటేనే  సమాజంలో అశాంతి నెలకొని ఉన్నట్టు. ఈ ప్రయత్నం ఎందాక నడుస్తుందో ఇప్పటికిప్పుడు  చెప్పలేకపోవచ్చు. శాంతి సాధనకు ఉండగల మార్గాలన్నీ వాడుకోలేకపోయినా సరే,  అశాంతి గురించి ఆలోచించే అరుదైన సందర్భం వచ్చిందని భావించవచ్చు. అశాంతికి కారణాలను లోతుగా వెతకవచ్చు. అయితే ఈ పని చాలా ఓపికగా  జరగాలి. వీలైనంత ఓపెన్‌ మైండ్‌తో వ్యవహరించాలి. దానికి సిద్ధమైతే మామూలప్పుడు గ్రహించిన విషయాలనే మరోసారి సూక్ష్మస్థాయిలో చూడ్డానికి వీలవుతుంది. అప్పుడు కొత్త కోణాలు కనిపిస్తాయి. అది ఎట్లా ఉంటుందంటే, సమాజమే తన అనుభవాలను, విశ్వాసాలను, వైఖరులను తరచి చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇదంతా సమాజాన్నంతా తీవ్ర అశాంతికి లోను