సంపాదకీయం

రాజ్యాంగమూ రాజదండమూ

మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో,  భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది.  కళ్ల ముందు కనిపించే  వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది.  అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం  ఘర్షణ పడినప్పుడు అది  పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్‌ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న
వ్యాసాలు

సాహిత్య విమర్శలో కేతు

1980`81 విద్యా సంవత్సరంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు పాఠశాల క్లాస్మేట్‌, డిగ్రీలో సీనియర్‌ అయిన పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలో అడుగుపెడుతున్న సందర్భం. ఆ సమయంలో సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటి అనే చర్చ వచ్చింది. దానికి సమాధానంగా కొకు సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంకలనం మాకు బాగా పనికి వచ్చింది.  దాన్ని చదువుకున్న తర్వాత ప్రాథమికంగా సాహిత్యం రాజకీయాలు కలిసే ఉంటాయని స్పష్టతకు వచ్చాం.  ఆ వ్యాసాల సంకలనకర్త కేతు విశ్వనాథ రెడ్డి గారు. అప్పుడు మొట్టమొదట ఆయన పేరు విన్నాం. ఆ తర్వాత కొకు సాహిత్య
సమీక్షలు

రైతు ఆత్మహత్యల  బాధాతప్త  నవల

గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ
కవిత్వం

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఇప్పుడు జరిగే వైమానిక యుద్ధాలు మాకు కొత్తవి కావచ్చు మా తాతలు,ముత్తాతలు చెప్పిన కథలు, చేసిన యుద్ధాలు మా మస్తిష్కంలో ఇంకా భద్రంగానే ఉన్నాయి మీరు చేసిన అన్యాయాల, అక్రమాల తడి ఆరనేలేదు నివురు కప్పిన నిప్పులా మాకు తెలిసిన యుద్ధాన్ని దాచుకొని మా హక్కుల కోసం అందరి సహజ సంపద కోసం రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడమే మా నేరం అయితే యుద్ధం మాకు కొత్తేమీ కాదు మీరు న్యాయ వ్యవస్థని కొనుక్కున్నా మా మీద అత్యాచారాలు జరిగినా కోర్టు తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చినా సహించాం... సహిస్తున్నాం భరించాం.. భరిస్తున్నాం కానీ ఇప్పుడు నీ పాడు
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఆమె… ఒక డిస్ఫోరియా

నా కథ చెబుతా వినండి... ‘‘నా పేరు మమత. ప్రతిసారీ మీరు చెప్పే సమస్యలు వింటున్నాను. వింటున్నకొద్దీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. నా కలల ప్రపంచాన్ని ఛిద్రం చేసిన నా జీవితం గుర్తుకు వచ్చి మరింతగా నొప్పి అనిపిస్తున్నది. ఈ స్నేహిత సంస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి చెప్పేటప్పుడు మీ అందరి జీవితాలకంటే నా జీవితం, కథా దుర్భరమైనవి, భిన్నమైనవి అంటూ ఉన్నారు. నేనూ అదే చెప్పబోతున్నాను. నిజానికి నా జీవితం మీ అందరికంటే భిన్నమైనది. చాలా మంది భర్తల అత్యాచారాల రూపాలు మన అందరికీ.. కొన్నిసార్లు ఒకే రకంగా మరికొన్ని సార్లు
కవిత్వం

కడుపు కోత

ఎక్కడోఒక తల్లి కన్నపేగు తెగింది..తండ్రి ఆశలు ఆవిరి అయ్యాయి..అమ్మ,నాన్న వస్తారుఏదో తెస్తారనిఎదురు చూసే చూపులువాళ్ళు రాలేరన్న వార్త వినిఎక్కి ఎక్కి ఏడ్చాయి. అవికుటుంబం కోసం కూలి పనికిదేశం మొత్తం సంచరించే వలసజీవితాలు..ఇప్పుడు మన నేతలువాటికి లెక్కలు వేస్తారు,బాగానే ఉంది.. అమ్మ కడుపు కోతకు..నాన్న కన్నీళ్లకు..పసి పిల్లల భవిష్యత్తుకు..సమాధానం చెప్పేదేవరు..?ఈ మారణఖండకు కారణం ఎవరు..?వాళ్ళ బాధలో భాగంగా..😰(ఒడిశా రైలు ప్రమాదం పై) 03.06.2023
వ్యాసాలు

మల్లయోధుల  నిరసన

భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను
ఇంటర్వ్యూ సంభాషణ

ప్రజాస్వామ్యంలోనూ ఫాసిజం వస్తుంది

- సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ  (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర
ఆర్ధికం

డాలర్‌ కోటకు బీటలు!

గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్‌ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న
కవిత్వం

ట్రాన్సజెండర్

చెక్కిళ్ళపైన గులాబీ రంగు అద్దుకొని, మెడ చుట్టూ నెక్లెస్ వేసుకుని షేవ్ చేసిన గడ్డం పై గాఢమైన మేకప్ అద్దుకొని ఆమె తనని తాను అద్దంలో చూసుకుంది ముక్కలైన అద్దంలో తన లక్షల ప్రతిబింబాలను ఒకేసారి ఆమెగా/ అతనుగా చూసుకుంది అద్దంలో ఆ బొమ్మలు ఒకదాన్ని మరొకటి వెక్కిరించుకున్నట్లు గా అనిపించింది మరొకరి దేహంలో తను ఇరుక్కు పోయి వూపిరాడనట్లు అనిపించింది తన దేహపు ఆకృతికి...కోరికలకు పొంతనే లేదు నేను ఎక్కడికి/దేనికి సంబంధించిన దాన్ని ? సరిగ్గా నేను ఎక్కడ ఇమడగలను ? లాంటి ప్రశ్నలు ఎడతెరిపిలేకుండా ఆమెని వేధిస్తాయి **** కొయ్యడానికి కూడా సాధ్యం కాని రంపపు