తొలికెరటాలు

జీవిత అనుభవాల కేరాఫ్ బావర్చి

కథ రాయడం ఒక కళ, కానీ అందరికి సులభం కాదు. ప్రతి మనిషి రాయగలడు, కానీ ఆ కథలు పాఠకుడి హృదయానికి తాకేలా, వారి జీవిత అనుభవాలతో అనుసంధానం అయ్యేలా రాయడం కష్టమే. రాయడం అంటే ఆలోచించే, భావించే మనసు ఉండాలి. చరణ్ పరిమి గారి కథలు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన కథలలోని ప్రతి సంఘటన, ప్రతి మాట పాఠకుడి హృదయానికి చేరి, జీవిత అనుభూతులను పంచేలా ఉంటాయి. కాలింగ్ సప్తవర్ణం - కథలో మనసును పునరుజ్జీవనంగా చూపించారు. ప్రతి రోజు కొత్తగా ప్రేమించడం, జీవితం పట్ల ఆశ కలిగి ఉండడం ప్రధాన అంశాలు. 40
కవిత్వం

సర్రియల్‌ క్లౌడ్‌ బర్స్‌ట్స్‌  వర్సెస్‌ వసంతమేఘం

ఇట్లా వాణిజ్య రాజధాని మీదికి జనం ఎప్పుడొస్తారు వానవలెవలస కూలీలుగా కాదుకోలీలు1గా కార్మికులుగాకోస్టల్ కారిడార్ కోసం నిర్వాసితులై కాదుఈ సముద్రమూ సముద్రంలోని సరుకులూ మావే అని స్వాధీనం చేసుకోవడానికికార్పొరేట్ కాలుష్య మబ్బులు అనిక్లౌడ్ బర్స్ట్స్ కాదని హెచ్చరిస్తూమీ అక్రమ నిర్మాణాల వలన మావాళ్లే చావడానికి కాదు చెట్లు కూలిపోవడానికీ కాదుఆదివాసులను చంపివాళ్లు కళ్లల్లో పెట్టుకున్న మనుషుల్ని చంపిఅడవితల్లి గర్భం నుంచి పుట్టుకొచ్చి ఇంకా పేగుబంధం తెగనిలక్షలాది చెట్లను నరికే గఢ్ చోరీలుఉక్కుచెట్లను నాటితే అడవెక్కడికి పోవాలి మరినదులై మహానగర రోడ్లనే ముంచెత్తుతున్నది.పల్లెల్లోని రైతాంగమంతా ఢల్లీలో ఒక బహదూర్షాను పెట్టుకొని కంపెనీ మీద యుద్ధానికి తమ బిడ్డల్ని పంపింది మోషా(సా)ల
మీరీ పుస్తకం చదివారా ?

సాహిత్య మూలాలను పట్టిచూపిన విమర్శ

సాహిత్యవిమర్శ జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియ      -రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వర్తమానసాహిత్యం విమర్శను కోరుకోవడం లేదు. సద్విమర్శను మాత్రమే కోరుకుంటున్నది. అందుకే తెలుగుసాహిత్యం విమర్శలో బలహీనమైందని బలంగా నమ్ముతున్నాను. ఏ పుస్తకమొచ్చినా అందులో వస్తువైఫల్యం, శిల్పవైఫల్యం లేదా ఇతర నిర్మాణపద్దతులు లోపించినపుడు విమర్శకులు ఇలా ఉంటే బాగుండేదని చెబితే సదరు కవులు ఓర్చుకునే స్థితిలోలేరు. ఇది తిరోగమనదిశకు సంకేతం. మన ద్రావిడ భాషలైన తమిళ,కన్నడ, మళయాళ కవులు విమర్శకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ పుస్తకం గూర్చి పొగడటం కంటే నాల్గు విమర్శనాత్మక సూచనలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి వైఖరి తెలుగు కవులలోనూ, వారు సృష్టించే సాహిత్యంలోనూ వృద్ది చెందాలి.
ఆర్ధికం

భారత్‌లో నిప్పుల కొలిమిలా నిరుద్యోగం

భారతదేశ ఆర్థిక రంగాన్ని సవాలు చేస్తున్న ఒక క్లిష్టమైన సమస్య నిరుద్యోగం. అత్యంత కీలకమైన సూచికలలో ఒకటి. ఇది దేశంలోని నిరుద్యోగిత రేటు ఉద్యోగాల లభ్యతను మాత్రమే కాకుండా వివిధ రంగాలలో(వ్యవసాయ, పారిశ్రామిక, సేవా) శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అధిక జనాభా కలిగిన వ్యవసాయక దేశాలలో ఒకటిగా, విభిన్న శ్రామిక శక్తి కలిగిన దేశంగా, నిరుద్యోగ రేట్‌ ఆర్థిక వృద్ధి, దేశ అభివృద్ధిపై విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోంది. పిరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం భారతదేశ నిరుద్యోగం రేటు ఏప్రిల్‌లో 5.1 శాతం ఉండగా జూన్‌ 2025 నాటికి 5.6 శాతానికి పెరిగింది. మన
వ్యాసాలు

గాడ్లింగ్ కేసులో తీర్పుగా మారుతున్న వాయిదా

సురేంద్ర గాడ్లింగ్ బెయిల్ దరఖాస్తు సుప్రీంకోర్టులో కాఫ్కేస్క్ ఫైల్‌గా (సర్రియల్-అధివాస్తవికత- ఒక పీడకల అనుకోవచ్చు. కాఫ్కేస్క్ అనేది ఫ్రాంజ్ కాఫ్కా అనే ప్రసిద్ధ రచయిత ఇంటిపేరు నుండి వచ్చింది, అతను సర్రియలిజం, దిక్కుతోచని పాత్రలతో కూడిన కథలకు ప్రసిద్ధి) ఇది కనిపిస్తుంది, కానీ మాయమైపోవడానికే కాజ్‌ లిస్ట్‌ లోకి వస్తుంది. (కోర్టులో ప్రతిరోజూ వచ్చే కేసుల జాబితా). వాయిదా వేయడానికే ప్రస్తావిస్తారు. ఈ కేసును చేసే  న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, విచారణ జరపకపోవడం అనే చర్యను తీర్పు రూపంలోకి మార్చారు. 2023 ఆగస్టు లో బెయిల్ పిటిషన్ మొదటిసారి దాఖలు చేసినప్పటి నుండి 17 సార్లు జాబితా
నివేదిక

అటవీ నిర్మూలనలో 5 లక్షల మంది బలి

ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం, అటవీ నిర్మూలన కారణంగా ఎక్కువ మరణాలు (50 శాతానికి పైగా) ఆగ్నేయాసియాలో సంభవించాయి. గత కొన్ని సంవత్సరాలుగా, వాతావరణంలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న వేడి మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ ఇటీవల ఒక అంతర్జాతీయ పరిశోధన మరొక తీవ్రమైన అంశాన్ని వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, గత 20 ఏళ్లలో ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో అటవీ నిర్మూలన కారణంగా ఐదు లక్షలకు పైగా ప్రజలు మరణించారు. ఈ మరణాలు నేరుగా పెరుగుతున్న ఉష్ణోగ్రత, దాని వల్ల కలిగే వ్యాధుల వల్ల సంభవించాయి. ఈ నివేదిక అటవీ నిర్మూలన ప్రభావం మొక్కలు, జంతువులకే
కవిత్వం

మరో ఉదయం కోసం

ఈ నిషాద విషాద కాలంలో ఒంటరిగా మిగిలి వున్నామన్న ఊహ గుండెల్లో మెలిపెడుతుంది మాటాడుకోవడానికి నీ పక్కన ఒకమనిషి లేరన్నది భయపెడుతుంది కలిసి నడిచినపాదాలన్ని దూరంగా జరిగిదారిలో నేనొక్కడినే మిగిలి వున్న ఊహ నిలువనీయదు కలిసి సాధించిన విజయాలు మరల మరలగుర్తుకు వచ్చి భుజం తడుతూనే వుంటాయి కానీ ఇన్ని మరణాలు కళ్ళలో కదలాడి నెత్తురు చిమ్ముతున్నాయి ప్రతీ దేహంతో వీడ్కోలు చెప్పే జన సందోహం నినదించిన నినాదాలు మరల ఆశను కల్పిస్తున్నాయి శిశిరం వెళ్లిన మరుక్షణం చిగురించే వసంత కాలమొకటి హామీగా వస్తుంది అయిన ఈకాలాన్ని జయించే విస్పోటనమేదొ మరల జరిగిపిడికిళ్లు బిగిసే సమయం ఉదయించే ఆ
వ్యాసాలు

యువరాజు పాలనలో  విద్యాశాఖ  దుస్థితి

 కూటమి ప్రభుత్వ యువరాజు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యా రంగంలో చాలా మార్పులు జరుగుతాయని, ఉపాధ్యాయుల సర్వీస్ పరమైన సమస్యలుపరిష్కరింపబడతాయని, విద్యాభిమానులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు అంతా ఆశించారు. కానీ గత 15 నెలల కాలంలో యువరాజు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అత్యంత ప్రతిష్టంభనకు గురి కావడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 117 విషయంలో విద్యావేత్తలు, ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేయకుండానే,దాని సవరణల పేరుతో జీవో  20, 21 లను తీసుకొచ్చి ఆరు రకాల
సంపాదకీయం

అమరావతి ఎప్పటికీ వర్తమానమే…

వర్షం కురుస్తున్నప్పుడు ఆంధ్రుల రాజధాని ఎలా ఉంది అనే సందేహం దూరంగా ఉన్న తెలుగువారికి రావచ్చు. అమరావతి మునకలో ఉందా, లేదా వర్షపు నీటి వెలుపల ఉందా! ఇవి రెండు పాక్షిక సత్యాలు. 'నీరు పల్ల మెరుగు ' అనే సామెత తెలుగువారిదే. ఇరవై  ఎనిమిది   గ్రామాలు పూర్తిగా నీటిలో ఉండవు. కొన్ని గ్రామాలు ఉండవచ్చు. ముప్పై రెండువేల ఎకరాల లో రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు భోరున కురిసే వర్షానికి నీరు చేరడం సహజం. దానిని ఒక కాలపు రివాజుగా చూడాలి. వర్షం కురిస్తే భారతీయ నగరాలు జీవనదిలో ఉన్నట్లు ఉన్న దృశ్యాలు  సహజం. అమరావతి కూడా దీనికి
సమకాలీనం

ఇది  నైపుణ్య శిక్షణా? నిర్బంధమా? లొంగిపోయిన మావోయిస్టుల పేరుతో హింస

ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు. జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ  భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది. కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి. బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు - అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక