కవిత్వం

ఇది దుఃఖాన్ని మిగిల్చే కాలం

ఇది కార్పొరేట్, ప్రభత్వాల కలయికలోరాజ్యం కృత్రిమ శిశిరపు కాలానికి పురుడోసింది ఇది కాగర్ శిశిరపు కాలంఇప్పుడు అడవిలో యే ఆకు తనకు తానుగా చెట్టుని విడవడం లేదు యే చెట్టు తనకు తానుగా ఆకుల్ని విడవడం లేదుకొన్నిరాజ్యపు మాయ మాటలకూ లోబడుతున్నాయి కొన్ని బందీ అవుతున్నాయి కొన్ని నేల రాలినెత్తుటితో మట్టిలో కలిసిపోతున్నాయి మరి కొన్ని కాల్చి బూడిదవుతున్నాయి ఇంకా కొన్ని మాత్రం రాజ్యానితో చేతులు కలిపిద్రోహనికి మంచి ముసుగేసినేలరాలి బూడిదయ్యే వాటిని చూస్తూ చెట్ల శివారున వున్న లేలేత ఆకులని సైతంనేల రాల్చేలా చూస్తున్నాయి ప్రస్తుతం రాజ్యం కలల్ని బంధించిందిఇప్పుడు నడుస్తుంది కాగర్ శిశిరపు కాలంఇది దుఃఖాన్ని
మీరీ పుస్తకం చదివారా ?

కత్తుల వంతెనపై సమాజం

నిజమే వర్తమాన సమాజం నిలుచున్నదిక్కడే. అసమానతలు అన్యాయాలు రాజకీయ రాబందుల రాక్షస క్రీడలు నెత్తుటి మరకలు  సమాజ దేహానికి కొత్తేం కాదు. ఈ కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమగానో రాయలేదు. కవిత వాక్యాలను కన్నీటి సరస్సులో ముంచి మరీ రాశారు. ఈ ప్రపంచం పట్ల బాధ్యతగా రాశారు. కవిత్వ మనోఫలకంపై ఏర్పడే కవితా వాక్యాల ప్రతిబింబాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన కవి చం ఆధునిక తెలుగు కవిత్వంలో అరుదైన కవి. అంతే ప్రాపంచిక దృక్పథంతో సమాజాన్ని వీక్షిస్తున్న కవి. వర్తమాన సమాజంలో సంక్లిష్టంగాను తీవ్రమైన  వైరుధ్యాలతో మన ముందు పరచుకొని వుంది. ఈ సంక్లిష్టతను అధిగమించేందుకు