విరసం 30వ మహాసభలు – భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం
2026 జనవరి 24-25, సుందరయ్య విజ్ఞానకేంద్రం,"బాగ్లింగంపల్లి, హైదరాబాద్. నక్సల్బరీ ఉద్యమం భారతదేశ ప్రజా రాజకీయాల్లోకి వర్గపోరాటాన్ని తీసుకొచ్చింది. వర్గపోరాట అత్యున్నత రూపంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను పీడిత వర్గానికి అందించింది. ఒక సమగ్ర పోరాట మార్గంగా ప్రజా జీవితంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతోంది. నక్సల్బరీ ప్రజ్వలనలో పుట్టిన విప్లవ రచయితల సంఘం భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాట రాజకీయాలను ఆచరిస్తోంది. తన సృజనాత్మక రచనతో, విశ్లేషణతో ముందుకు తీసుకపోతోంది. వర్గపోరాటం ఒక చారిత్రక నియమమే అయినా, అది నిర్దిష్ట స్థల కాల రూపాల్లో కొనసాగుతుంది. తక్షణ, దీర్ఘకాల సామాజిక పరిణామాలను వ్యక్తులు గ్రహించలేకపోయినా మానవ సమాజం వర్గపోరాటం మీదే










