సంపాదకీయం

ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం

మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని
వ్యాసాలు

మాట్లాడే పుస్తకాలు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా..
కవిత్వం

కవిత్వం ఒక మార్గం

కవిత్వంకవిత్వం భయాన్ని ఎదిరించే ధైర్యం కవిత్వం నిజానికి, అబద్ధానికి తేడా తెలిపే అద్దం.కవిత్వం కోపం అగ్నిలా మారే క్షణం కవిత్వమే అంతరిక్ష కాంతి. కవిత్వమే చీకటి వెనుక దాగిన వెన్నెల.కవిత్వమే అనురాగ నేస్తం.మోదుగుపూలు విరజిమ్మేఎర్రని కాంతి కిరణం కవిత్వం సమాజమార్పు నా కవిత్వం.కంటికి కనిపించే మరోప్రపంచం కవిత్వంకవిత్వం ఒక మార్గం.కన్నీటి చుక్కల ప్రవాహం.
కవిత్వం

అమరుడా నిన్ను నేను పోల్చుకున్నాను

నాకు తెలిసిన పేరు ఉయికె గణేశ్పాక హనుమంతు అని ఇటీవలే వింటున్నాను.నిన్ను చూసిన జ్ఞాపకమూ లేదు మొదట నీ ఎన్కౌంటర్ అయినమృతదేహాన్ని చూసాకేనీ నిజాకృతిని చూసానేమో అప్పుడు ఒక్కసారిగాకుటుంబం ఏర్పడినప్పటి నుంచీస్త్రీ పురుష సంబంధాలుబానిస యజమాని సంబంధాలనినువ్వు పాఠం చెప్తున్నట్లుఊహించుకుంటున్నానుఒక విప్లవకారుని మొహంలో అంత స్త్రీకారుణ్యమేమిటా అనిపించిందికుహనా విప్లవ వాచాలుని నయవంచనను గర్భంలో మోస్తున్నఅపరిచితఎన్నాళ్ళ నుంచి నీ పలకరింపు కోసందుఃఖాన్ని మోసిఇవ్వాళ నీ చితిలో కురిపించిందో గదాఅమరులు, పోరాటకారులు, ఆదివాసులుదండకారణ్యంలో నిర్మించుకున్నజనతన సర్కారుమహిళా జర్నలిస్టు అక్షరాలలో మైదానాల్లో ప్రవహించేంతగుండె నెత్తురులతో వివరించిననీ కథనంఇవ్వాళ ఒక అమరస్మరణగా నిలిచిపోతుందినువ్వు జగదీశ్గా మల్కన్గిరిలో ఆదివాసుల మధ్యనవిప్లవ నిర్మాణం చేస్తున్నప్పుడుసెంట్రీ చేసిన కన్నపేగు
అలనాటి రచన

క్రిటికల్‌ రియలిజం

మనిషి బైటా లోపటా వాస్తవ ప్రపంచాలున్నాయి.  పదార్థంతో కూడింది బైటిది. భావాలతో కూడింది లోపటిది. వాస్తవికతావాదానికి ఈ రెండు ప్రపంచాలూ నిజమైనవే. నికరంగా మాట్లాడితే, వీటిని రెండుగా పేర్కొనడం సరికాదు. భౌతిక ప్రపంచం లేకుండా భావప్రపంచం వుండదు గనక, వీటిని ఒకే ప్రపంచంలో రెండు విభాగాలని అనవచ్చు. భౌతిక ప్రపంచమే మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా నాడీ కేంద్రమైన మెదటి కెక్కి, చైతన్యంగా రూపొందుతుంది. మెదడు చాలా జటిలమైన పదార్థం. భౌతిక పదార్థానికి అది అత్యున్నతమైన రూపం. దాని పనిపాటులనే బుద్ధిగా, అనుభూతిగా - మనస్సుగా - ఎన్నోపేర్లతో పిలవడం జరుగుతూంది. మెదడు నిర్మాణంలో ఒక పార్శ్వంలా మరొక పార్శ్వం
కరపత్రాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌హక్కుల సంఘం 20వ రాష్ట్ర మ‌హాస‌భ‌లకు రండి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌హక్కుల సంఘం 20వ రాష్ట్ర మ‌హాస‌భ‌లకు రండి జ‌న‌వ‌రి 10, 11 2026, తిరుప‌తి ప్ర‌జలారా!          ఎవరి హక్కుల కోసం మరెవ్వరూ గొంతెత్తరో, అలాంటి వారి హక్కుల కోసం గొంతెత్తడమే లక్ష్యంగా,  తెలుగురాష్ట్రాల్లో గత ఐదు దశాబ్దాలకు పైగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న పౌరహక్కుల సంఘం తన 20వ రాష్ట్రమహాసభల్ని తిరుపతిలో జరుపుకుంటున్నది. పౌరహక్కుల సంఘం ఆవిర్భవించిన తొలినాళ్ళల్లో రాజ్య హింసకు వ్యతిరేకంగా మాత్రమే పని చేసిన పౌరహక్కుల సంఘం, తరువాత కాలంలో తన కార్యరంగాన్ని విస్తృత‌ పరచుకుని, సమాజంలో వివిధ ఆధిపత్య వ్యవస్థల మూలంగా అణచివేతకు గురి అవుతున్న ప్రజల హక్కుల కోసం
వ్యాసాలు

సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు

( రాయ‌సీమ విద్యావంతుల వేదిక  మూడో బులిటెన్‌కు రాసిన ముందుమాట‌. జ‌న‌వ‌రి 4న క‌ర్నూలులో జ‌ర‌గ‌నున్నఆర్ వి వి రాష్ట్ర మ‌హాస‌భ‌లో ఆవిష్క‌ర‌ణ‌) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో  మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్‌ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని
కొత్త పుస్తకం

కాషాయ కార్పొరేట్ ఆక్రమణ దాడి – ప్రజల ప్రత్యామ్నాయ పోరాట పంథా

(ఇటీవ‌ల విడుద‌లైన  *క‌గార్ రిప‌బ్లిక్‌* ఫెలోట్రావెల‌ర్ పుస్త‌కానికి రాసిన ముందుమాట- వ‌సంత‌మేఘం టీం) Res publica అనే లాటిన్ పదం నుంచి వచ్చిన రిపబ్లిక్ పదానికి 'పబ్లిక్ విషయం' అనే అర్థం ఉంది. అంటే ఎవరో ఒక రాజో, రాణో కాకుండా దేశ పుత్రులు /పుత్రికలు తమ ఇచ్ఛానుసారం (వోటు రూపంలోనే కావచ్చు) తమ ప్రతినిధులను ఎన్నుకోవడం అనే ప్రజాసామిక పాలనా ప్రక్రియే రిపబ్లిక్. అటువంటి రిపబ్లిక్ ప్రభుత్వం విశాల ప్రజల ప్రయోజనం కోసం తప్ప ఎటువంటి ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనం కోసం పాలించకూడదు. ఇది 1950లో భారత రాజ్యాంగంలో ప్రజలుగా తమకు తాము పొందుపరచుకున్న పాలనా విధానం
వ్యాసాలు

వందేమాతర స్వరం మారుతున్నది

వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది.   ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.  వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం  నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. వందేమాతర గీతాన్ని
ఆర్ధికం

ఆర్థిక అసమానతలో అగ్రస్థానం భారత్‌దే!

ప్రపంచ అసమానతల నివేదిక 2026 మూడవదిగా వెలువడుతున్నది. 2018, 2022 తర్వాత కీలకమైన సిరీస్‌గా ఇది వస్తున్నది. ప్రపంచవ్యాపితంగా రెండువందల మందికి పైగా మేధావుల కృషి ఆధారంగా ఇది కూర్పు చేయబడింది. వారు ప్రపంచ అసమానతల అధ్యయన ప్రయోగశాలతో అనుబంధంగా ఉంటున్నారు. ప్రపంచ అసమానతల చారిత్రక పెరుగుదలకు సంబంధించిన అతి పెద్ద డేటా సేకరణకు వారు దోహదపడుతున్నారు. అసమానతలకు సంబంధించి ప్రపంచవ్యాపిత చర్చలకు ఈ సమిష్టి కృషి గొప్పగా సహాయపడగలదు. విధాన నిర్ణేతలు, పౌరులు, అసమానతల తీవ్రతనూ, కారణాలనూ అర్థం చేసుకునే తీరును మార్పు చేయడానికి ఈ బృందం కృషి సహాయ పడింది. అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల కన్నా