పరిచయం

No women No History

Introduction to No women No History These notes on ‘History of Indian Women in Movements’ deal mainly with the movements in the 19th and 20th centuries and include the contemporary movements. When we say movements, we mean only those movements which helped the society to move forward. We should be clear about this especially since there are many retrogressive, religious chauvinistic movements in our country. Though the movements mentioned in
సమీక్షలు

ఎరుకల జీవన గాథలు, జాడలు

Literature is a part of the history and it is like  a reservoir of human experiences, emotions and struggle for development.It connects the people, brightens the behaviour and enlighten human aspirations... " పలమనేరు బాలాజీ కథలు జీవితపు అట్టడుగు పొరలనుండి తవ్వి తీసిన పాఠాలు. ఒకానొక ప్రదేశంలో జీవించిన వేర్వేరు మనుషుల పొట్ట నింపుకునే ప్రయత్నంలో ప్రాణం నిలుపుకునే ఆరాటం, వెంటాడుతున్న  బతుకు భయం. ఈ కథలు. కడుపు నిండిన వాళ్ళవి కాదు . కడుపు మండిన  వాళ్ళ వెతలు. రెక్కాడితే కాని డొక్కాడని సామాన్యల  
సమీక్షలు

“అనగనగా” సినిమా కాదు జీవితం

ఆ రోజు మే 22 సమయం ఐదు గంటల 30 నిమిషాలు. కాలేజీ నుంచి అలసిపోయి ఇంట్లోకి అడుగు పెట్టిన  నన్ను చూసిన మరుక్షణం  ఒక్కసారిగా ఎదురుగా ఉరికి వచ్చి  మాబాబు డింపు (చార్వాక) హత్తుకొని బోరున ఏడ్వటం ప్రారంభించారు.  ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. వాడి జీవితంలో అంతగా ఏడ్చింది ఇదే మొదటి సారి కావచ్చు. మొన్న నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇక బ్రతకను అని డాక్టర్ చెప్పిన సందర్భంలో కూడా వాడట్లా ఏడవలేదు. ఇంట్లో ఏం జరిగిందోనని ఆందోళన పడ్డాను. అర్థంకాక ఆలోచిస్తూ, ఎందుకు తనని అట్లా ఏడిపిస్తున్నారని మా పాప ప్రకృతి
సమీక్షలు

కమిలిన కన్నీటి చారిక మంగలిపల్లె

సంగరేణి అనగానే లోకానికి వెలుగునిచ్చే నల్లబంగారం గర్తొస్తుంది. నరేష్ కుమార్  సూఫీ దీనిని బంగారు భూమి అన్నాడు. ఆ బంగారు భూమితో తన అనుబంధం, ఆడిపాడిన బాల్యం, ఊహ తెలిసే వయసులో ఉక్కిరి బిక్కిరి చేసిన జీవిత కాఠిన్యం, తీపిని, చేదును పంచిన మనుషులు, నిలువెత్తు త్యాగమై ధగధగ మండిన వాళ్లు, బతుకుపోరాటంలో నిట్టనిలువునా కూలిపోయిన వాళ్లు, బొగ్గుట్టల కింద మాయమైన ఊరితో పాటు కనుమరుగైన వాళ్లు -అన్నిటిని సజీవ జ్ఞాపకాలుగా పరిచయం చేశాడు సూఫీ.     నరేష్ కుమార్  సూఫీ కి తాను పుట్టి పెరిగిన ఊరు ఇదని మిత్రులతో చెప్పుకోడానికి ఇప్పుడక్కడ ఊరు లేదు. ఒక మానవ
సమీక్షలు

గుండె నెత్తురులతో పదునెక్కి  సాగుతున్న విముక్తి చరిత్ర

అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి 
సమీక్షలు

అన్ని వైపులలో రాయలసీమ

ముందుగా పాఠకులకు విజ్ఞప్తి. మీరు చదవబోతున్నది పాణి నవల ‘అనేక వైపుల’పై విమర్శ  కాదు, కనీసం సమీక్ష కాదు. ఇది కేవలం ఒక సామాన్య పాఠకుని  హృదయ స్పందన మాత్రమే. ఎన్నడూ ఏ పుస్తకాన్ని పూర్తయ్యంత వరకు ఒకే మారు చదివే అలవాటు లేని నన్ను, ఈ నవల దాన్ని పూర్తి చేసేంతవరకు మరో పుస్తకాన్నే కాదు, కంప్యూటర్‌ జీవిగా బతికే నన్ను దానికీ దూరం చేసింది. అంత లావు నవల ఎలా చదువుతానా? అనుకున్న నన్ను దానికి కట్టిపడేసాడు పాణి. దానికి కేవల ఆ నవల శిల్పం కారణం కాదు. అందులోని సారమే నన్ను కట్టి పడేసింది.
పరిచయం

వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం

‘ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో’  ఆడవాళ్ళో నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో  పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు  అర్థాలు వేరులే అని  పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ  కార్టూన్లు అనేకం. కానీ  ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన  వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల  వుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా
పరిచయం

వెలుగును హత్య చేసిన చీకట్ల కథలే మార్జినోళ్లు

సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు.  ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో
పరిచయం

ఈ తరం జమీల్యా

నన్ను కట్టిపడేసి ఓ చోట కూర్చోబెట్టి ప్రేమగా నాకోసం ఓ పాట పాడి, నేను దాటొచ్చిన ప్రేమ కధ చెప్పి ఏడిపించి కళ్ళు తుడుచుకునేలోపే మాయమైంది. ఇప్పుడు ఆమె నా ప్రేయసి. జమిల్యా  అతి త్వరగా అతి తీవ్రంగా అతిగా నేను ప్రేమించిన తక్కువ పాత్రల్లో జమీల్యా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన నా ప్రియురాలు రాజేశ్వరిని మళ్ళీ చూసినట్టుంది. ఒక చిన్న పెయింటింగ్ చెప్పే కథ. అది గీసిన కుర్రాడి ప్రేమకథ. తన వదిన ప్రేమకథ. ఓ గాయపడిన ఒంటరి సైనికుడి కథ. చాలా మామూలుగా మొదట్లో వేసిన చిత్రం చూడడానికి ఎలా ఉన్నా,
సమీక్షలు

సీమ‌ కవిత్వంపై కొత్త వెలుగుల “రవ్వల సడి”

రాయలసీమ కవిత్వాన్ని పరిచయం చేస్తూ నేను ఒకానొక ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని గురించి చెప్పడం ద్వారా ఆ ప్రాంతాన్నీ, దాని వేదనలనూ,  ఆకాంక్షలనూ,  ఆశాభంగాలనూ, అక్కడే పుట్టిపెరిగిన ఆలోచనాపరుల రాతల్లో నుంచి పరిచయం చేసే పని చేశాను - జి. వెంకటకృష్ణ *** ఆధునిక రాయలసీమ కవిత్వాన్ని సమీక్షించడం చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే, కాల ప్రవాహంలో వచ్చి చేరిన కొత్త చేర్పులనూ, కొత్త మార్పులనూ, అవి కవిత్వం లో ప్రవేశింపజేసే విభిన్న వస్తు శిల్పాల పోకడలనూ డైసెక్ట్ చేస్తూ, మొత్తంగా ఆయా కవుల దృక్పధాన్ని అంచనా వేసి, పాఠకులకు చేరవేయడం శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని