ఆర్ధికం

అసమానతలు పెంచుతున్నఉపాధి రహిత వృద్ధి

తొమ్మిదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పాలనలో రాజ్యాంగం అమలు కావడం లేదు.  సమానత్వాన్ని, లౌకిక  తత్వాన్ని తృణీకరించే మనువాద భావజాల పాలన కొనసాగుతోంది. ఈ కాలంలో ఆర్థిక అసమానతలు, సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. సామాజిక, ఆర్థిక సమానత్వ ఆదర్శం బిజెపి- కార్పొరేట్‌ ఫాసిస్టు పెట్టుబడిదారీ విధానం వల్ల బీటలు బారింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఉంటూ దేశ సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రభుత్వరంగ అభివృద్ధి, పౌరస్వేచ్ఛ, మానవ హక్కులను తుడిచివేసే ఫాసిస్టు పాలన కొనసాగుతోంది. ఫలితంగా
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

            మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థికం

ఫిబ్రవరి 24వ తేదీ న్యూఢిల్లీలో జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్‍ బ్యాకుంకు గవర్నర్ల సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది! ‘‘భారత ఆర్థిక వ్యవస్థ అద్బుతంగా పురోగమిస్తోంది.భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీని నుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పథాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం’’. ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకవ•ందే వాల్‍స్ట్రీట్‍ జర్నల్‍ తాజాగా దానికి పూర్తి భిన్నమైన
ఆర్ధికం

ప్రజా వ్యతిరేక బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌  దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు, పేదరికం వంటి పేద ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్‌ శక్తులను ఊతమిచ్చే విధంగా ఉంది. బడ్జెట్‌ అంటే ప్రభుత్వ ఆదాయ-వ్యయాల చిట్టా మాత్రమే కాదు. దానికి ఒక తాత్విక చింతన ఉండాలి. ఆదాయం ఎవరి నుంచి వస్తుంది, వ్యయం ఎవరి కోసం చేస్తున్నారనేది బడ్జెట్‌లో కీలకాంశం. ప్రధానంగా దేశ ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు ఏలా అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన ఉండాలి. కాని మన పాలకులకు ప్రజలు కనిపించడం
కాలమ్స్ ఆర్ధికం

అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్‌

ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్‌ వ్యాపారి గౌతమ్‌ అదానీ ఇప్పుడు ఆయన  సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన  సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్‌ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్‌ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల
కాలమ్స్ ఆర్ధికం

వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్‌ బిల్లు – 2022

మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ఇప్పుడున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1985, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్‌ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ
ఆర్ధికం

భారత్‌ను ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్‌ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం
ఆర్ధికం

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మాంద్యం

కొవిడ్‌ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో  పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి.  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్‌ దెబ్బకు  ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్‌ డామినేషన్‌ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం,  మాంద్యం ఒకపక్క,  ఇంధన కొరతలు,  ఆకలికేకలు,  ఎంతకీ వీడని కొవిడ్‌ వైరస్‌,  యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే.
కాలమ్స్ ఆర్ధికం

కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం

''వట్టిమాటలు కట్టిపెట్టవోయ్‌ గట్టిమేలు తలపెట్టవోయ్‌'' అన్నారు మహాకవి గురజాడ. కానీ, దీనికి విరుద్ధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో గత ఎనిమిదేళ్లుగా వ్యవహారిస్తోంది. మోడీ అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో సుపరిపాలన అందించానని, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకున్నానని, బయో-ఎకానమీ 8 రెట్లు వృద్ధి చెందినట్లు మోడీ స్వయంగా ప్రకటించాడు. మరోవైపు పర్యావరణ నిబంధనలు 'అభివృద్ధికి ఆటంకం' అని మోడీ చెబుతున్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఇది డొంక తిరుగుడుగా మద్దతు పలుకడమే అవుతుంది. నిజానికి బయో-ఎకానమీ అంటే పర్యావరణానికి హానిచేసే శిలాజ ఇంధనాల వాడకం నుండి
ఆర్ధికం

అసమానతలు చంపేస్తున్నాయి… ఆక్స్ ఫామ్

 ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ‘ఇన్‌ ఇక్వాలిటి కిల్స్‌’ను ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రోజుకు వేలమంది మరణాలకు కారణమైన హింసాత్మక ఆర్థిక విధాన ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. అత్యంత సంపన్నులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. పెరుగుతున్న అసమానత వల్ల మహిళలు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొవిడ్‌ విపత్తుకు ప్రతిస్పందనగా అసమానతలు పెరగడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అంచనాలపై, పరిశోధనలపై ఆధారపడి ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను రూపొందించింది.  నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని