అస్తవ్యస్త ఆర్థికం – మానవాభివృద్ధి డొల్ల
భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్... దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల