ఆవు యేమనును?
మేధావులందరూ వొక్క చోట చేరారు. ‘జై శ్రీరామ్’ చెప్పుకున్నారు. వాళ్ళ మెదళ్ళ కుదుళ్ళలో దేశ భవిత దాగుందని వాళ్ళకే తెలిసిపోవడంతో మదముతో మేధో మదనమునకు సిద్ధపడ్డారు. గోడకు వేళ్ళాడదీయబడ్డ దేశ యేలికుని చిత్రపటం చూస్తూ ‘ఆ తెల్లని గడ్డంలో యేమి కనిపిస్తోంది?’ అని అడిగి, అంతలోనే ‘ఆ తెల్లని గడ్డంలో దాగిన మర్మమేమి?’ అని దిద్దుకున్నారు వృద్ధ పెద్దమనిషి. ‘స్వచ్ఛత’ అన్నారు కొందరు. ‘పాలవంటి తెల్లని స్వచ్ఛత’ అన్నారు యింకొందరు. ‘మాకు దేశ శిఖరాయమాన హిమాలయాలు కనిపిస్తున్నాయి’ అన్నారు మరికొందరు. ‘మాకయితే పాల సముద్రం కనిపిస్తోంది’ అన్నారు మిగిలిన అందరూ. ‘నాకయితే తెల్లని ఆవు కనిపిస్తున్నది’ యెంతో సౌమ్యంగా










