తిజిమాలి: అప్రకటిత ఘర్షణ ప్రాంతం
తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న "మా మాటి మాలి సురక్ష మంచ్" నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో, సుమారు 200 మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు వరుసగా మూడు గ్రామాల్లోకి ప్రవేశించి, రాయగడ SDM, కాశీపూర్ JMFC జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సురక్షా మంచ్ నాయకుల ఇళ్ల గోడలకు అంటించారు. ఫిబ్రవరి 26న వారు










