వ్యాసాలు

తిజిమాలి: అప్రకటిత ఘర్షణ ప్రాంతం

తిజ్మాలి ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాలు, ముఖ్యంగా సగాబరి, బంతేజ్, బొండెల్, కంటమాల్, తాలాంపదర్ పరిసరాల్లో సాయుధ పోలీసులు, వాహనాల మోహరింపు విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో డ్రోన్లు ఎగురుతున్నాయి. గత మూడేళ్లుగా వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న "మా మాటి మాలి సురక్ష మంచ్" నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో, సుమారు 200 మంది పోలీసులు, పారామిలిటరీ దళాలు వరుసగా మూడు గ్రామాల్లోకి ప్రవేశించి, రాయగడ SDM, కాశీపూర్ JMFC జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను సురక్షా మంచ్ నాయకుల ఇళ్ల గోడలకు అంటించారు. ఫిబ్రవరి 26న వారు
వ్యాసాలు

ఒడిశాలోని రూర్కెలాలో రైల్వే విస్తరణనువ్యతిరేకించిన ఆదివాసీ హత్య: నిర్వాసిత్వ ముప్పు

2026 ఫిబ్రవరి 20 ఒడిశాలోని పశ్చిమ జిల్లా అయినసుందర్‌గఢ్‌లోని రూర్కెలా మున్సిపాలిటీ గుండా వెళుతుంటే... మనకు భారీ పరిశ్రమలు, భవనాలు, మాల్స్, అందమైన ఫుట్‌పాత్‌లతో కూడిన రహదారులు మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటికి ఆవల దశాబ్దాలుగా ఒక పోరాటం సాగుతోంది, కానీ అది ప్రధాన స్రవంతిలో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎస్‌ఎఐఎల్) నడుపుతున్న భారీ రూర్కెలా స్టీల్ ప్లాంట్  కారణంగా రూర్కెలాను ఒడిశా "ఉక్కు నగరం" (ఇస్పాత్ నగర్) గా పిలుస్తారు. భారతదేశ పారిశ్రామిక "అభివృద్ధి"కి, అపారమైన ఖనిజ నిక్షేపాలకు రూర్కెలా ఒక కేంద్రంగా గుర్తింపు పొందింది.
Uncategorized వ్యాసాలు

ఒడిశాలోని లాంజిబెర్నా గ్రామంలో దాల్మియా గనితవ్వకాల విస్తరణ : గ్రామస్తుల నిరసన

2026 మార్చి 5  (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.) మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు... వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న 'లంజీబెర్నా' అనే చిన్న
సంభాషణ

కశ్మీర్ పై భారత పాలనను నిరాకరించినందుకు మా అమ్మకు శిక్ష

2026 మార్చ్ 26 కొద్ది రోజుల క్రితం, నా తల్లి ఆసియా అంద్రాబీ (64) కి ఒక న్యాయమూర్తి మూడు జీవితకాల శిక్షలను విధించడాన్ని నేను స్వయంగా చూసాను. భారతదేశం అమలు చేసిన అత్యంత కఠినమైన చట్టాలలో ఒకటైన నిబంధనల కింద ఇది వాస్తవానికి మరణశిక్షతో సమానం. కశ్మీర్ స్వయం నిర్ణయాధికార పోరాటంలో పాల్గొన్నందుకు గాను, జీవిత ఖైదు విధించబడిన మొదటి కశ్మీరీ మహిళ నా తల్లి. నా తల్లితో పాటు, ఆమె సహచరులు నహిదా నస్రీన్, సోఫీ ఫెహ్మీదాలకు ముప్పై ఏళ్ల జైలు శిక్షను వేసారు. వీరి ముగ్గురినీ 2018లో అరెస్టు చేసారు;  విచారణ ఎనిమిదేళ్ల పాటు
వ్యాసాలు

పుస్తకం ఇచ్చిన కానుక ఈ జీవితం – సుంకోజి దేవేంద్రాచారి

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సుంకోజి దేవేంద్రాచారి వృత్తి రీత్యా పాత్రికేయులు. వందకు పైగా కథలు, ఏడు నవలలు రాశారు. 'అన్నంగుడ్డ, ఒకమేఘం కథ, దృశ్యాలు మూడు ఒక ఆవిష్కరణ' కథల సంపుటాలు, 'నీరు నేల మనిషి, రెక్కాడినంత కాలం' నవలలు పుస్తకాలుగా తెచ్చారు. వీరు గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలు 'మనమంచి ఆటలు' పుస్తకంగా వచ్చింది. "ఇప్పుడున్న నేను పుస్తకం చెక్కిన మనిషిని" అంటూ మాట్లాడే పుస్తకాల గురించి సుంకోజి దేవేంద్రాచారి   ఇలా అంటున్నారు... 1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయమయ్యాయి? ఈ ప్రశ్న చాలా సంక్లిష్టమైనది. పుస్తకాలు అంటే.. ఏరకమైన
నివాళి

సాహిత్య విమర్శలో కెవిఆర్ చారిత్రక దృక్పథం

ఇది కెవిఆర్ శతజయంతి సంవత్సరం. ఆయ‌న మార్చి 23, 1927న జన్మించారు. 1948లో తన 21వ ఏట అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. 1998 జనవరి 15న తన 71వ ఏట విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా కన్నుమూశారు. సరిగ్గా యాభై ఏళ్లు సాహిత్య సాంస్కృతిక మేధో ఉద్యమాల్లో తలమునకలుగా ఉన్నారు. ఆ ఉద్యమాల ప్రధాన నాయకుడిగా, వ్యాఖ్యాతగా, పెద్ద దిక్కుగా కొనసాగారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో యాభై ఏళ్లు పార్టీతో కలిసి నడిచారు.  సిపిఐ దగ్గరి నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ దాకా ఆయన ప్రయాణం సాగింది. కేవలం పార్టీ  అభిమానిగా, శ్రేయోభిలాషిగా కాదు.
కవిత్వం

ఏప్రిల్ 1, 2026

ఏ మట్టి పొత్తిళ్ళలోంచి కన్ను తెరుస్తుందో విత్తనం మళ్ళీ ఆ మట్టిలోకే చేరుతోంది ఏదన్నా మట్టిలోకి ఒరిగిపోవడమంటే మాయమైపోవడం కాదు పోటెత్తే అశ్రుధారా సముద్రమంతా పైకి కనబడని గాయాలనుండి తొణికే కన్నీటి బొట్లే అమ్మ గుండెల్లోంచి పట్టిన పాలవలే కన్నీళ్ళన్నీ కూడా చిక్కటి రక్తమేకన్నీళ్ళతో మట్టి, చిత్తడి మత్తడిగా తడిచిన తర్వాతే తురాయిపూలు ఎర్ర రంగు పులుముకున్నాయి ఆకలేసినవాడికి అన్నం మెతుకులు పండాయి ఆశలకి ఆధారం దొరికిందిచెట్లను కూల్చేయడమంటే అడవి మాయమైపోవడం కాదు కొమ్మల వేల చేతుల్నెత్తి పిల్లల్ని చంకనెత్తుకునే తల్లులందరూ మట్టిలోంచే మళ్ళీ మళ్లీ పుడతారు గుట్టల్ని లోయల్ని జల్లెడపట్టిన డ్రోన్లకి ధాన్యపు కంకుల్లా పుట్టే మట్టి
ఆర్థికం

ఇరాన్ యుద్ధ ప్రభావం – ఆర్థిక సంక్షోభం

పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతులం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్లుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు
ఇంటర్వ్యూ

నన్ను టెర్రరిస్ట్ అన్నారు

గోర‌ఖ్‌పూర్ జైల్లో ఆవిరైన నా *పరదేశీ స్వప్నం*: వాలెంటిన్ హెనాల్ట్ ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతతో మజీద్ మఖ్బూల్ ఇంట‌ర్వ్యూ (ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాలెంటిన్ హెనాల్ట్ తన భారత పర్యటన, తాను పాల్గొన్న అంబేద్కరిస్ట్ ప్రజా పాదయాత్ర ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ సెంట్రల్ జైలులో నెలరోజుల జైలు శిక్షకు దారితీస్తుందని ఊహించలేదు. దళిత భూ హక్కుల కోసం జరిగిన ఆ యాత్రలో పాల్గొన్నందుకు, అతను ఉంటున్న హోటల్ నుండి అరెస్ట్ చేసి, ఫారినర్స్ యాక్ట్ కింద వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. 2023 అక్టోబర్‌లో జైలులో గడిపిన కాలం—కిక్కిరిసిన బ్యారక్‌లు, వ్యవస్థీకృత హింస, వివక్ష—ఆయన
నివేదిక

పచ్చని గోవా బూడిద రంగులోకి మారబోతోందా?

(గోవా పట్టణ-గ్రామీణ ప్రణాళిక (సవరణ) చట్టం, 2024లోని వివాదాస్పద సెక్షన్ 39A స్థానికుల నుండి తీవ్ర నిరసనలకు దారితీసింది. ఈ చట్టం వరి పొలాలు, పండ్ల తోటలు, అడవులు గల విశాల భూభాగాలను కాంక్రీట్ వనాలుగా మారుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. స్థానిక సమాజాలపై దీని ప్రభావం పడుతుంది. నీరు, విద్యుత్ కొరత, మురుగునీటి శుద్ధి సమస్యలు తలెత్తుతాయి. స్నేహల్ ముథా దీనిపై కొన్ని పరిశీలనలు చేశారు. ది హిందూలో వచ్చిన ఆమె రిపోర్ట్ వసంత మేఘం పాఠకుల కోసం తెలుగులో ఇస్తున్నాం.) రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న