ప్రజా కళాకారుడు జహంగీర్కు జోహార్లు
ప్రజా కళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్కపల్లి జహంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మరణించారు. పీడిత ప్రజల గుండె చప్పుడును సుదీర్ఘకాలం తన గొంతులో ఆయన పలికించారు. జహంగీర్ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యంలో పేదరికం వలన ప్రాథమిక దశలోనే చదువుకు దూరమయ్యారు. జీవిక కోసం వివిధ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. తెలుగు నేలను ఆవరించిన ప్రపంచీకరణతో పేద ప్రజల జీవితాలను 90ల దశకంలో మరింతగా సంక్షోభంలోకి నెట్టడం మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పతనమవుతున్న జీవితాలను కళ్ళారా చూసిన జహంగీర్










