సాహిత్యం కథలు

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?
సాహిత్యం కథలు

సమరంలో సంబరాలు

విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల స‌హాయంతో నడుస్తున్నారు. గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే
సాహిత్యం వ్యాసాలు

మునికాంతపల్లి కతలు

పాఠకుడి నోట్సు ప్రవేశిక:నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై "రొయ్యలు"),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ 'జీవితమే ఒక నాటక రంగం') కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది. అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా... దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ. ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా? మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
సాహిత్యం కారా స్మృతిలో

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర
సాహిత్యం కవిత్వం

దీపాల వెలుతురు నీడలో

తాము కాలిపోతూవెలుతురిస్తాయి దీపాలు సమస్త చీకటి విషాలను మ్రింగికాంతినిస్తాయి మిణుగుర్లు మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొనిమందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొనిమైలపేరుతో మూలపడిమూతులకు కుండలు కట్టించుకునేబడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారుజ్ఞానవంతులు కార్మీక కర్షక జనావళిఊపిరికి ప్రాణం ఉందనిరుజువుచేసిసంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసినడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారునాయకులు వాళ్ళపాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపైతలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయిగడ్డిపోచలు గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుందివసంతం వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రంక్షితిజం పై ఒరుగుతుంది రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ...
సాహిత్యం కారా స్మృతిలో

మాస్టారితో నా గ్యాపకాలు కొన్ని !

మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు  జ్యోతిశ్యం  చెప్పారు నమ్మకంగా.  అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి   ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.    ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట
సాహిత్యం కవిత్వం

నేనే మీ కవిత్వం

నా పెదవులపై తేనెపట్టు లాంటి మాటలేవీ?అవి పక్షులై ఎగురుతుంటాయి హృదయమూ మాటల మధుపాత్రే ఇపుడు మనమధ్య పదాల ప్రసారంఓ అమూల్యమైన అనుభవానికి వాగ్ధానం నిజానికి నా మాటలన్నీప్రాణవాయువుతో పాటు ఆయుష్షు గానాలోకి మీ నుంచి వచ్చి చేరినవే నా ప్రాణం లోపలుందని అనుకునేరుఅది బయటే ఉందినాతో కలిసి నడుస్తున్న వాళ్ళూనా భాగానికి ఇన్ని గింజలు పండిస్తున్న వాళ్ళూనా నడక కోసం దారుల్ని పరిచినవాళ్ళూనేనేదైనా చౌరస్తాలో నిలబడి ఉద్యమాచరణలో భాగంగా నినదిస్తున్నపుడు ప్రతిధ్వనిని అందించేవాళ్ళూ మీరు మీరు మీరంతా నా ప్రాణసమానులుమీరే నా మాటలలోని బరువుకు కారణమైనవారునా పద్యపాదాల్లో జీవం నింపే బతుకుపోరాటంలో నిండా మునిగిఉన్నవాళ్ళు మీ నవ్వులు నా
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను
సాహిత్యం వ్యాసాలు

Let Oppressed Identities and Class struggles be united Against Fascism.

Over the past few years, we have been experiencing the nature of fascismin India. It has similarities and differences to fascism in history. Now we have reached some consensus that Brahminical Hindutva has become fascism in our country. The Hindutva forces have been making preparations for about a hundred years to get to the current state. This added to the crises in the post-colonial Indian political system. Based on these