సాహిత్యం కవిత్వం

యుద్ధమాగదు

ఆ ఒక్క క్షణం కోసంయుగాలుగ ఎదురుజూసిందిఆ ఒక్క ఊహఆమెను పసిదాన్ని జేసింది అల్మయిరాలోపుస్తకాలు సర్దింది" మరణాన్ని తిరస్కరిస్తున్నా "వాక్యాన్నిపక్షిని జేసిభుజంమీద మోసుకుతిరిగింది.. గుండెనిండావసంతాలపొదుముకొనిగిన్నెనిండాబువ్వవొండుకొనివొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలనిమొగులుకోసం రైతుజూసినట్టుబిడ్డడి కోసం తల్లి జూసనట్టుగేటుకు కళ్ళ నతికించిఎంత ఎదురుచూసిందో అతడురాలేదుభయపడ్డట్టే జరిగిందిఊపిరి బిగబట్టే లోపుఊపిరాగినంత పనయ్యింది. ఆమెకూ అతడికీ మధ్యరాజ్యం..పూలరెక్కలమీదబుల్ డోజర్ నడిచింది మధ్య యుగాలకేసిముఖంతిప్పిన కోర్టుప్రజలకోసం కొట్టుకునే గుండెప్రమాదమన్నది****" అమ్మా..ఇక నాయినరాడా? "మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీఅంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టితెగుతున్నఆశల దారాల్ని పేనుతూమళ్ళీచౌరస్తాలో నిలబడ్దదామె.. యుద్ధ మాగదు..
సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
కథలు

చరిత్ర మునుముందుకే…

"మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”. తన టాబ్‌ లో వార్తాపత్రికల హెడ్‌ లైన్స్‌ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్‌ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బి‌ఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో ... "మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!". అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి
కథలు సాహిత్యం

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల
సాహిత్యం కవిత్వం

అక్షరాల పై నిషేధం

ఆకలి ఆక్రందనలుఅత్యాచారలు  అన్యాయపుకారు చీకట్లను చీల్చె అక్షరాలపై నిషేధమా..?అంటరాని పూరి గూడిసేలనెగడయి నిటారుగ నిలబడికందిలయి దీపమయినందుఅక్షరాలపై నిషేధమా..?నొసటి మీద చమట నేల చిందనిదేచదును కాని హలంసేద్యపు గింజల రాశులు పోసిన చొటకర్షకులు కాయకష్టంబయిన అక్షరాలపై నిషేధమా..?అణిచివేతలపై తిరుగుబావుట జెండాయైప్రజల గొంతుకల పోరు పాటలయిప్రతిధ్వనించిన నేలలో అక్షరాలపై నిషేధమా..?అసమానతల కంఠాన్ని తెగనరికితెలంగాణ ఉద్యమ రాగాన్ని పల్లవించియెల్లలు లేని ప్రపంచానికి చాటినఅక్షరాల మీద నిషేధమా..?ఆర్థిక రాజకీయ కోణాన్ని విడమర్చి చాటిహక్కులకై సల్పిన పోరులో నెగడయి మండుతున్నఅక్షరాలపై నిషేధమా..?అవునుఈఅక్షరాలు ఇప్పుడు నిషేధమెఅప్పుడు నిషేధమెరాజ్యాన్ని ప్రశించినందుకురాజ్యపు  నిషేధాలా కొలిమిలొంచికాగడాలయి అక్షరాల మంటలనుదావనంలా వ్యాపిస్తాయి... (విరసం పై నిషేధాన్ని ఖండిస్తూ....)
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
కథలు

నిర్ణయం

అమ్మను వదిలి ఒకరోజు అయిపోయింది. అయినా అమ్మ నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది. నా చుట్టూ జరుగుతున్న వాటిల్లో పడి అమ్మనూ, అమ్మ చుట్టూ తిరుగుతున్న ఆలోచనలనూ తాత్కాలికంగా దూరంపెడుతున్నానే తప్ప పూర్తిగా తనను గుర్తుచేసుకోకుండా ఒక గంట కూడా వుండలేకపోతున్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరువలో వున్నానని నన్ను రిసీవ్ చేసుకున్న అన్నయ్య మాటల్లో అర్థమయ్యింది. ఇంతలో మా జీప్ ఒక ఊరి దగ్గర ఆగింది. చూసేసరికి అటు పూరి గుడిసే కాదూ, పెంకుటిల్లూ కాదు. ఏదో డిఫరెంట్ గా వుందే అని అనుకుంటూ చూస్తుంటే నల్లగా పొడుగ్గా వున్న ఒక అతను " కామ్రేడ్ నీ కిట్టు
సాహిత్యం కవిత్వం

క‌ళ్లారా చూశాము

కామ్రేడా.... ఆర్‌కే అమరులు అస్తమయంలోనుంచే ఉదయిస్తారనే మాటను మొన్ననే మేము కళ్లారా చూశాము. ఆర్‌కే  అమడ‌య్యాడ‌న‌గానే ఎన్ని హృదయాలు అయ్యో.. ఆ మాట అబద్ధం అయితే బాగుండని తల్లడిల్లయో సరిగ్గా అప్పుడే చూశాము కామ్రేడా.. నీవు మరణిస్తూనే రెట్టింపు వెలుగుతో  ఉదయిస్తూన్నావని అస్తమయం క్షణకాలమని అది వేన వేల వెలుగుతో అరుణోదయం తప్పదని కామ్రేడా.. మేము మొన్ననే చూశాము ఉక్కు సంకల్పంతో నువ్వు హామీపడ్డ మాటని నేలకొరిగి నెరవేర్చినప్పుడు "జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం" అని నీవు హామీపడ్డ మాటను ఆలింగనం చేసుకున్నప్పుడు కామ్రేడా.... మేము మొన్ననే చూశాము  కోట్లాదిమంది
కథలు

నా కథల్లో నేనుంటాను

తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది.
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా