ఈ నిషేధం విరసం మీదేనా?
విప్లవ రచయితల సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెలల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాలకులకు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్పని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు