సాహిత్యం సమీక్షలు

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే
సాహిత్యం సమీక్షలు

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

 బ్రెస్ట్ టాక్…

'హస్బెండ్ స్టిచ్' 3 చిన్నారి తల్లీ... నన్ను క్షమించు. ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ? నిన్నూ... నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు. అదీ అసహజంగా... ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు... నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు! ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు... ఎంత దురదృష్టం నీకు...? పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు మరెవరో కాదు తల్లీ... మీ నాన్న! అవును మీ నాన్నే... బాధగా వుందా పాపా? నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట నువ్వు పాలు తాగితే... నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని మీ నాన్నకు తెలీదు!
సాహిత్యం సంభాషణ

అమ్మల దినం తల్లుల గుండెకోత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం. అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా
సాహిత్యం

అలిశెట్టి  జీవన దృశ్యం

ఏయే విలువల ఆధారంగా ఒక కవిని అంచనా వేయాలన్న ప్రశ్నలు విమర్శకులకు ఎదురవుతాయి. మానవ విలువలకు ప్రతినిధిగా చూడాలా? సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తిగా చూడాలా? వంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ‘‘మానవ  విలువలు’’, ‘‘ఉద్యమం’’ వేర్వేరే కావు. అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో గొప్ప కవితలెన్ని రాసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘‘ఏకైక మహాకవి’’గా  శ్రీశ్రీ గారు గుర్తింపు పొందారు. వివాద రహితమైన అరుదైన కవుల్లో ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ స్థానం సమున్నతమైంది. అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరంలో నిష్కలమైన నిజాయితీ కనిపిస్తుంది. ‘‘బీదరికం  అనారోగ్యం ఒక గొప్ప కవిని మనకు కాకుండా చేశాయి’’. ‘‘ఓడ్‌  టు పోయెట్స్‌’’
కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"
కథలు

రాంకో

ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు. వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.  రణితను దూరం నుండే
సాహిత్యం వ్యాసాలు

ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు -ఒక సమీక్ష  

                                           రచయిత్రి నిత్య రాసిన "ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు "పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని "మహిళా మార్గం "పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు "ప్రజా రచయిత ప్రేమ్ చంద్ "అన్న పేరుతో ముందు మాట రాస్తూ "భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ "అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సాహిత్యం కాలమ్స్ నా క‌థ‌తో నేను

కథతో నేను

పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి. ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి