మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.
సమకాలీనం

పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన  కార్యకర్తలు 

‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే
మీరీ పుస్తకం చదివారా ?

బాధితులంతా ఐక్యమవుదాం

ముమ్మాటికీ నిజమే. ప్రపంచమంతా వేధనతో నెత్తుటిధారల్లో తడిసిపోయింది. పీడితులకు అండగా నిలిచేరాజ్యం  ఈ భూగ్రహంమీద మొలవలేదనిపిస్తోంది. నూతనప్రపంచావిష్కరణకు ఇంకెన్నాళ్లో..సామ్రాజ్యవాదకాంక్షలో దేశాలకు దేశాలు  నాశనమౌవుతున్నాయి. దుర్నీతి దురంహంకార పాలకులు రాజ్యాలనేలేందుకొస్తున్నారు. పసిపిల్లలు, వృద్దులు, ఎవ్వరూ వీళ్ళకడ్డులేదు. కాజీనజ్రుల్‌ ఇస్లాం కలలు కన్న రాజ్యం ఇంకా ఉద్భవించలేదు. ఆయన కలలు కన్న పాలకులింతవరకూ రాలేదనే చెప్పవచ్చు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎర్రపూలు పూస్తున్నాయి..ఆ ఆశతోనే సామాన్యుడు, పీడితుడు, బాధితుడు బతుకుతున్నాడు. ఐనా కాజీనజ్రుల్‌ ఇస్లాం యుద్దం ద్వారా మా హక్కులన్నీ సాధించుకుంటామన్నారు. ఆయన రాసిన గొప్పకవిత్వం మనకిటీవల అందుబాటులోకి వచ్చింది. ముస్లింలు దానికంటి ముత్యాలు/హిందువులు దాని జీవితం/ఆకాశమాత ఒడిలో సూర్య చంద్రుల వలె/వాళ్ళ
లోచూపు

మానవాకాశంలో వానవిల్లులా  సప్త వైవిధ్యాలు

మనం మనుషులతో సహా దేన్నైనా మామూలుగా దంద్వాలలో విలువ కట్టడం చేస్తూ ఉంటాం. మంచి, చెడు, తప్పు, ఒప్పు లాంటి తీర్పులు చెబుతూ ఉంటాం. అలాగే లింగపరంగా మనుషులను ఆడ, మగ అనే ద్వంద్వంలో వర్గీకరించడం కూడా పరిపాటిగా వస్తోంది. కానీ మొదట ఒకే ముద్దగా ఉన్న చిన్న మానవ సమూహం సుదీర్ఘకాల చరిత్ర గతిలో ఎంతెంత విస్తరించి, ఎన్నెన్ని శకలాలుగా విభజితమైపోయిందో ఇదివరకెప్పుడో మనకు తెలిసి వచ్చింది. ఇటీవల కాలంలోనైతే అది మరింత వైవిధ్యపూరితంగానూ, వైరుధ్య పూరితంగానూ మన అనుభవంలోకి వస్తోంది.మరి ఈనాటి సామాజిక సందర్భంలో మనుషులను సామాజికంగా గాని, లింగపరంగా గాని కేవలం ద్వంద్వాలలో విలువ
సమకాలీనం

చేయని నేరానికి ..

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో విషాదకర స్థితి ఏర్పడింది . ఇక్కడి ఆదివాసీలు తమ హక్కులు, గౌరవం, మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో బెదిరింపులు, పేదరికం, పోలీసు క్రూరత్వాలు వారి జీవితాలను అనిశ్చితిలోకి నెట్టాయి; ఇక్కడ ప్రతి రోజు వారికి ఒక కొత్త సవాలును తెస్తుంది. వారు తమ స్వరాన్ని పెంచే ప్రయత్నాలకు పోలీసుల నుండి నిరాశ, ఉదాసీనత మాత్రమే ఎదురౌతాయి. సోన్‌భద్ర ఆదివాసుల పట్ల పోలీసుల ప్రవర్తన వారి వాస్తవికతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భూమిపై శాశ్వత యాజమాన్యం లేదా ఆర్థిక శక్తి లేని పేద ఆదివాసీలు శక్తివంతమైన పోలీసుల నుండి అణచివేతను ఎదుర్కొంటున్నారు.
మీరీ పుస్తకం చదివారా ?

“గాయాలు ఈనాటివి కావు…”

జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి  డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో,  వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన "వెన్నెల కురవని రాత్రి". ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ.
మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త