వ్యక్తి స్వేచ్ఛలేని చోట లిబరల్ డెమోక్రసీకి అవకాశమే లేదు
ప్రొ. పద్మజా షా (ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాబోయే రాజకీయ పరిస్థితులను తీవ్రంగానే ప్రభావితం చేస్తాయని ప్రొ. పద్మజాషా(జర్నలిజం విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం) అంటున్నారు. ఇండియాలో లిబరల్ డెమోక్రసీ పాదుకొనడానికి అవకాశం లేని సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛ లేని చోట లిబరల్ డెమోక్రసీ ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆమె ఇంటర్వ్యూ పాఠకుల కోసం..వసంతమేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా










