సంభాషణ

నిషేధంపై విరసం అభ్యంతర పత్రం

5.5. 2021టు సోమేష్ కుమార్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు.ఫ్రంఅరసవెల్లి క్రిష్ణఅధ్యక్షుడువిప్లవ రచయితల సంఘం6-1-\16-7ఎ\1పెద్దిరాజు స్ట్రీట్ పైజర్ పేటవిజయవాడ-1520001విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం. రెఫరెన్స్: 1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73. 2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3. 3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే
సంభాషణ కారా స్మృతిలో

అవుట్ బరస్ట్!

ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది. మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

చదువు!

‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని
ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా
సంభాషణ

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు. వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు
ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు
సంభాషణ

ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు
సంభాషణ

అంతిమ వీడ్కోలుపై నిషేధమా ?

తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌.   ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి