సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
కవిత్వం సాహిత్యం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
సాహిత్యం కవిత్వం

జరూర్

గనిలో వారంచీకటిలోదీపాల వెలుతురు లోనల్ల బంగారం వెలికి తీతరెక్కలు ముక్కలు చేసుకుంటూజనానికి వెలుతురు నివ్వడానికి వారం బడలికసడలించుకుంటూకుటుంబాలతో గడపాలనే ఆనందంతోఆశతో ఊసులతో ఊహలతో కలలతో బయల్దేరాం పాటలు పాడుకుంటూఎప్పటిలాగేలేగదూడల్లా ఎగురుతూఅదే బండి అదే తోవ అదే సమయం ఏళ్ళుగా మాయదారి చట్టంచేతుల్లో పెట్టుకున్నరక్షక దళంవిరుచుకు పడిందికాల్పుల మోతగుండెల్లో రుధిరం చిమ్మిందిదేహాలను చిదిమిందిబతుకు బుగ్గి చీకటిలోనే అయ్యో విచారం వ్యక్తంపోయిన ప్రాణం ఖరీదు కట్టేచట్టం మాత్రం అలాగేఎన్ని నిరాహార దీక్షలు చేస్తేనేందున్నపోతు పై వాన కురిసినట్టే గా ఆపరేషన్ అవగాహన లోపంఎవడు జవాబుదారీచంపూ డబ్బులు ఇయ్యికథా కమామిషుప్రశ్న నీ చంపూ లేదాజైళ్లలో నింపుకర్కశ రాజ్యంమత్తు లో జోగుతున్న జనంమీ వంతూ
కథావరణం సాహిత్యం కాలమ్స్

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన
సాహిత్యం కవిత్వం

హత్యలు కాని హత్యలు

ఇంటిమనిషిని కోల్పోయిన నొప్పిలా ఉంది సలుపు చేప ముల్లు గొంతులో దిగితేదవఖానకు పరుగెట్టొచ్చు తూట వెన్నులో దిగితేకుప్పకూలడం తప్ప దారేది తెలియకుండా జరిగినదే కావచ్చుమీ తుపాకులకు గందపు వాసన తప్పకన్నీటి వాసన తెలియదు కడుపుకోతకు గురైన ఇండ్లలోకిమనుషులుగా వెళ్ళి చూడండిగుమ్మాల్లో మనుషులకు బదులుగాదుఃఖాలు గుండెలు బాదుకుంటూఉంటాయి మీకు తెలియకుండా జరిగినదే కావచ్చుజరిగింది ఆస్తినష్టం కాదుప్రాణనష్టం కూలింది కూలీలుకుటుంబాన్ని కాపు కాసే మట్టిగోడలు సాయమందించి చేతులు దులుపుకున్నాకొన్ని ప్రేమలబాకీ ఎవరు తీరుస్తారు కలచివేసే వార్త ఈ రోజు వరకేఅన్ని సర్దుకపోతాయిప్రజలూ మరచిపోతారు రాని తండ్రి కొరకు ...ఓ బిడ్డ ఇంకా తలుపు వద్దబొమ్మను నిద్రపుచ్చుతూ ఎదురుచూస్తోంది ఏ షా దిగివస్తాడుబిడ్డను
సాహిత్యం కవిత్వం

అత‌ను పాల‌పుంత‌

తెల్వకుండానే  పుట్టుక పొలిమేరల్లో చుట్టుకున్న  నాగుపామును ఒల్చేసి చావుదాకా రక్తమాంసల సైద్ధాంతిక నిర్మాణమై చిగుళ్లువేసి వర్గపోరాటమై వెల్గుజిమ్మిన ఒక నూతన మానవుడు ఎర్రదండై అడవి మెడలో ఒదిగి పోయాడు ఒక యుద్ధం లోంచి ఆవిరి లా ఎగిరి వచ్చి బీడుపడిన నేలను జనసంద్రం చేసిన శాంతి మేఘము భూమి యుద్ధ కేంద్ర మైనంత కాలం వొక వాస్తవికత మూసుకున్న తలుపుల మీద చర్చలు నాటిపోయాడు వొక ఆధిపత్య రక్త పాతాన్ని దొర్లించిన సాయుధ విశాల ప్రవాహం లో వాగులు వంకలు పిల్లకాల్వలు  యుద్ధవ్యాపనమౌతున్న అడవి మైదానానికి తుపాకులవంతెనతడు మట్టి మనిషిని కౌగిలించుకొని కాలం ఈ పిడికెడు మట్టే ఉద్యమాలపుట్ట
సాహిత్యం వ్యాసాలు

ఏది సంస్కృతి?

(చలసాని ప్రసాద్‌ 5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం పునర్ముద్రణ - వసంతమేఘం టీం) సంస్కృతి అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి? కులానికి, సంస్కృతికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు వసంతకాలపు సరస్సులో పద్మాలలాగా నా మనస్సులో వున్నాయి. ఎంత సందేహ పూరితమైన అభిప్రాయాలున్నాయో అంత సమాచారము ఉన్నది, అన్ని ఆలోచనలూ ఉన్నాయి. ఇవన్ని ఈ సందర్భంలో మీతో పంచుకొని ఒక చిన్న ప్రయత్నమే ఇది. సంస్కృతి అనగానే సంఘపరివార్‌ గుర్తుకు వస్తుంది. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు జాతీయ సంస్కృతిని, సాంస్కృతిక జాతీయ వాదమని చెపుతుంటాడు. అందులో జాతీయవాదమనేది ఒక ప్రత్యేకమైన అంశం.