వ్యాసాలు


చట్ట బద్ధ పాలన అడిగినందుకే సాయన్న జైలుపాలు

కొల్లూరి సాయన్న ... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సుందరగిరి గ్రామంలో దళిత రైతు కుటుంబం లో పుట్టాడు. న్యాయశాస్త్ర విద్యార్ధిగా విద్యా రంగ సమస్యలపై పని చేశాడు. చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరేలా, తెలంగాణా గ్రామీణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం , ఆదివాసీ ప్రజల కోసం పని చేయాలని ఐదేళ్ల క్రితం నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్త సాయన్న. నిత్య అధ్యయనంతో వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన పెంచుకుని వివిధ జిల్లాలకు తన పనిని విస్తరించుకుని తెలంగాణా రైతాంగ సమితి నాయకుడుగా ఎదిగాడు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా,
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
వ్యాసాలు

ఎట్టకేలకు కప్పన్‌కు బెయిల్‌

40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా,
వ్యాసాలు

మరో హిందుత్వ విషసర్పం 63 పేజీల కల్పిత రహస్య దస్తావేజు

భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ  శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
వ్యాసాలు

జనశక్తి నాయకులు కామ్రేడ్ కూర రాజన్న అరెస్టు – కోర్టు వాయిదాలు- అనారోగ్యం  

ఆగస్టు 1, 2022న మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఓ ఇంటి వద్ద సిపిఐ (ఎం- ఎల్‌) జనశక్తి నాయకులు కామేడ్‌ కూర రాజన్నను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారన్న విషయం విధితమే. ఈ అరెస్టు విప్లవ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించారు. అలాగే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కామ్రేడ్‌ కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 17న రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలందరు రాజన్న అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తూ, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని
వ్యాసాలు

కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే "కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు" (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి
వ్యాసాలు

కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ
వ్యాసాలు

రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి

కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ అమర్ రహే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడిన జాతీయ విప్లవకారులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ ఒకరు. ఆయన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలసి జైలులో అమరణ నిరహార దీక్షకు పూనుకొని 63 రోజుల తరువాత అసువులు బాసాడు. అంతర్జాతీయంగా మార్చ్ 18ని రాజకీయ ఖైదీల దినంగా పాటించడం మూడవ ఇంటర్నేషనల్ ప్రకటించిన విషయం విదితమే. ఆ పరంపరను కొనసాగిస్తూనే వారి త్యాగాల సృతిలో ఖైదీల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 13ను పోరాట దినంగా పాటించడం పరిపాటైంది. భారతదేశ విప్లవోద్యమంలో తమ ఆశయాల సాధనకై