వ్యాసాలు

తల్లి పేరుతో ఒక మొక్క ‘తండ్రి’ పేరుతో మొత్తం అడవి!

మోడీ ప్రభుత్వం ఒకవైపు 'జై శ్రీరాం' అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత 'ఒక చెట్టు-తల్లి పేరుతో' ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్‌దేవ్‌ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు. ఏడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లోశాంతి చర్చలు

ఏ రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి) అధికారంలో ఉన్నా వర్గ పోరాటానికి సంబంధించి సామ్రాజ్యవాద ` భూస్వామ్య (అర్ధ వలస ` అర్ధ భూస్వామ్య) దళారీ రాజ్యానికి విప్లవోద్యమం పట్ల ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ఆయా సందర్భాలకు ఎత్తుగడలు ఉంటాయి. 2004లో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి మావోయిస్ట్టు పార్టీ ప్రతిపాదించిన ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి చర్చలకు పిలిచింది కానీ పీపుల్స్‌వార్‌తో చేసిన చర్చల ప్రతిపాదనను అది ఎం.సి.సి. వంటి మరో సాయుధ విప్లవ పార్టీతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి చర్చలకు వచ్చిందనే ఎరుక కలగగానే రెండవ విడత చర్చల వాగ్దానాన్ని
వ్యాసాలు

విప‌త్తు అంచులో మాన‌వాళి

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ , నీటి ఆవిరి  సమతుల్యంగా ఉండాలి.  ఈ సమతుల్యత జల  వలయం సాధారణ వర్షపాతం, జంతువుల  మొక్కల జీవిత చక్రాలకు సహాయపతాయి.   పర్యావరణ సమతుల్యం వన్యప్రాణి మరియు వ్యవసాయానికి  మానవుని అభివృద్ధికి సహాయపడుతుంది.  కాలుష్య కారకాలను  వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం  అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం.  వ్యవసాయ గృహ నిర్మాణం అటవీ నిర్మూలనకు దారితీ స్తున్నాయి.
వ్యాసాలు

Windows to the Revolution

‘Viyyukka’, a word in Gondi language meaning morning star, is an anthology of stories written in Telugu by Maoist women revolutionaries over the past four decades. Some of these women were martyred in the cause of the revolution, while some are still continuing in it. Some were part of the movement for some years and were then either arrested or had come out of it due to various reasons. This
వ్యాసాలు

మరణించిన  ‘మావోయిస్ట్’ మాట్లాడుతున్నాడు: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా చర్యల తర్వాత పరిణామాలు

బస్తర్ పరిణామాలపై అక్కడి నుండి వచ్చిన ప్రత్యేక సిరీస్‌లో ఇది మొదటి భాగం. బీజాపూర్‌లో మావోయిస్టుల సమావేశంపై తెల్లవారుజామున జరిగిన ఆకస్మిక దాడి ప్రభావం  గ్రామాల మీద  ఎలా ఉన్నదో  ఈ కథనం వివరిస్తుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ అడవుల లోతట్టు ప్రాంతంలోని  స్థానిక ఆదివాసీ సముదాయాల  నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్ర స్థాయి యుద్ధంలో వున్నారు.  ఈ సంవత్సరం ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఈ సంఖ్య 2009 సంవత్సరం మినహా గతంలో వచ్చిన వార్షిక
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన
ఓపన్ పేజ్

అవతలి వాళ్ల అంచనాలూ తెలుసుకోవాలి

ఫాసిజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఎట్లా పని చేస్తున్నది? దేనికి ఫాసిజం ఇంతగా బలపడిరది? ఈ సమస్య ఇప్పటికిప్పుడే వచ్చిందా? దాన్ని ఏ ఒక్క కోణంలోనో ఎదుర్కొని ఓడించగలమా ? అనే ప్రశ్నలకు ప్రగతిశీల, లౌకిక శక్తుల మధ్య ఏకాభిప్రాయ సమాధానాలు లేవు. ఎప్పటికైనా వస్తాయా?  నిజానికి ఇది అవగాహన సమస్యనా? లేక ఆచరణ సమస్యనా? ఆలోచించాలి. ఫాసిస్టు వ్యతిరేక ఆచరణకు సిద్ధం కావడంలో ఉన్న తేడాలు కూడా దీనికి కారణం కావచ్చు. వీటన్నిటికీ తోడు ఫాసిజం  గురించి ప్రజలకు  ఎట్లా చెప్పాలి? వాళ్లను ఎట్లా ఫాసిస్టు ప్రభావం నుంచి బైటికి తీసుకరావాలి? ప్రజాస్వామిక ఉద్యమంలో భాగం
వ్యాసాలు

ఆంధ్రప్రదేశ్  ఎన్నికలు: ముందు నుయ్యి, వెనుక గొయ్యి

మేం ఎం.ఏ చదువుతున్నరోజుల్లో  మా ప్రొఫెసర్ ఒకాయన తరచుగా “There is nothing to choose between two fools” అనేవారు. ఎవరిని గురించో ఇప్పుడు జ్ఞాపకం లేదనుకోండి. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు  “There is nothing to choose among these cheaters” అని జగన్, పవన్, బాబు, బిజెపి ల  గురించి అనాల్సిరావడం ఒక విషాదమoదామా? లేక ఈ బూటకపు ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా వేరే ప్రత్యామ్నాయాలు లేవని సరిపుచ్చుకుందామా? మొన్నటివరకు జగన్ ప్రత్యక్ష మద్దతు తీసుకుంటూ, అతనికి   పరోక్ష మద్దతునిస్తూ, అతన్ని అరెస్టుల నుండి కాపాడుతూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు అకస్మాత్తుగా తెలుగుదేశంతో జత
వ్యాసాలు

రావణ కాష్టం – సోముని డప్పు

కా. నర్సన్న  స్మృతిలో... నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్‌. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు - సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న
సాహిత్యం వ్యాసాలు

ఏది సంస్కృతి?

(చలసాని ప్రసాద్‌ 5,6 జనవరి 2008 గుంటూరులో జరిగిన విరసం మహా సభల ప్రసంగ పాఠం పునర్ముద్రణ - వసంతమేఘం టీం) సంస్కృతి అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి? కులానికి, సంస్కృతికి సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు వసంతకాలపు సరస్సులో పద్మాలలాగా నా మనస్సులో వున్నాయి. ఎంత సందేహ పూరితమైన అభిప్రాయాలున్నాయో అంత సమాచారము ఉన్నది, అన్ని ఆలోచనలూ ఉన్నాయి. ఇవన్ని ఈ సందర్భంలో మీతో పంచుకొని ఒక చిన్న ప్రయత్నమే ఇది. సంస్కృతి అనగానే సంఘపరివార్‌ గుర్తుకు వస్తుంది. బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు జాతీయ సంస్కృతిని, సాంస్కృతిక జాతీయ వాదమని చెపుతుంటాడు. అందులో జాతీయవాదమనేది ఒక ప్రత్యేకమైన అంశం.