సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,
సమీక్షలు

మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం

హుస్సేన్‌ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “'తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ 'అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్‌ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్‌ విప్లవోద్యమలో   వచ్చిన సాహిత్యాగానికి   ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక
సమీక్షలు

చరిత్ర పుటల్లోకి ..పోరాట దారి మలుపే ‘తిరుగబడు’ కవిత్వం

'తిరుగబడు' కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు  తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. " ఇలా వచ్చి అలా వెళ్లిన 'తిరుగబడు కవులు...' " శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది. దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని  కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది. దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను  పదునైన మాటల్లో వర్ణించారు. కాని
సమీక్షలు

రైతు ఆత్మహత్యల  బాధాతప్త  నవల

గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ
సమీక్షలు

దాచేస్తే దాగని యుద్ధం 

ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి.  ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు   నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి.    రాజ వంశీకులకు    ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక
సమీక్షలు

ఊరి మీదికి మరులుగొలిపే కథలు

చిన్నప్పుడు ఎమ్నూరు (ఎమ్మిగనూరు) అంటే నాకు రెండే కొండగుర్తులు. మా వూరి మిందనుంచి పొయ్యే ఎంజి (మాచాని గంగప్ప ట్రాన్స్పోర్ట్ సర్వీస్) బస్సు. అప్పట్లో నీటుగా వుండి  స్వీడు...గా పోయే బస్సని బో పేరు దానికి. చార్జిగాని గవుర్మెంటు బస్సు కాడికి రోంత తక్కువ. ఆ బస్సు వచ్చే తాలికి పెద్దింత మంది జమైతాండ్రి , ఆలీశం అయినా ఆ బస్సు కోసరమే ఎదురు చూస్తాండ్రి . రెండోది ప్రతీ ఎండాకాలం సెలవులకి మా రోజ పెద్దమ్మ కాడికి పోతే కర్నూలులో వెరైటీ, శ్రీరామా, ఆనంద్ టాకీసుల దారిలో, రాజ్ విహార్ సెంటర్లో రోడ్డు మింద బట్టల షాపుబైట 
సమీక్షలు

జీవిత కథలు

ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత
సమీక్షలు

చీకటి రోజుల్లో గానాలుండవా…..

 1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ శ్రీరామ్‌ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది. నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు,
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
సమీక్షలు

బహిరంగ ప్రకటనే రాజ్య ధిక్కారం

రాజకీయ, నైతిక, మత, కళా సాహిత్య రంగాలలో ఆనాటికి ప్రబలంగా వుండిన అభి ప్రాయాలను ధిక్కరించేదెవరు? తన అత్మను తాకట్టు పెట్టని వాడే ధిక్కారి కాగలడు.                                                                                                - జార్జి ఆర్వెల్    అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా  బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో  కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి.  నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు