సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది
సాహిత్యం వ్యాసాలు

అమ‌రక‌వి యోధుడి డైరీ..

( పాతికేళ్ళు నిండకుండానే  విప్ల‌వ క‌వి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో  సెప్టెంబర్ 3, 1992న అమ‌రుడ‌య్యాడు. ఆయ‌న ర‌చ‌న‌లు  "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో   నవంబర్ 1992 లో అచ్చ‌య్యాయి. ఇందులో ఆయ‌న డైరీ   కూడా భాగమైంది.    చేగువేరా , భగత్ సింగ్ డైరీల‌తో పోల్చ‌ద‌గిన‌ది ఇది. చిన్న‌వ‌య‌సులోనే  ఎంఎస్ ఆర్ త‌న  భావ‌నాశ‌క్తితో విప్ల‌వ క‌విత్వాన్ని అజ‌రామ‌రం చేశాడు. ఇప్ప‌డు మీరు చ‌దువబోయేది ఆయ‌న పుస్త‌కానికి ముందు  *క్షమాపణ కోరుతూ...*  అని అచ్చ‌యిన ఆయ‌న డైరీ ర‌చ‌న‌. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌... వ‌సంత‌మేఘం టీం)  క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు  మేల్కొన్నాను.
సాహిత్యం వ్యాసాలు

రాజ్యం సృజ‌నాత్మ‌క‌త‌కు వ్య‌తిరేకి

సవ్యసాచిదేవ్     కవి, రచయిత, విమర్శకుడు ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు. కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా
సాహిత్యం కథలు

నిన్న ఈవేళ

(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి
సాహిత్యం కవిత్వం

అంతే బాధలోంచి

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను గాయపడిన అనుభవాలలోంచికొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను కొంత ప్రయాణంలోనిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి కాలాన్ని ఎదురీదడమంటేమార్పులను అవగతం చేసుకోవటమే దారులు ఇరుకవుతున్నప్పుడుఆలోచనలు పదునెక్కాలి ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసిఅనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసిఅనేకానేకాలుగా దర్శించాలి చీమ బలం చూసికన్నులెగరేసిఆకాశాన్ని ఎత్తగలంఆకాశం పైకి ఎక్కగలం లక్ష్యం కుదుపుతున్నపుడురహ దారులు ఇట్టే చిగురిస్తాయి ఊహకు రూపం ఇవ్వడమంటేకొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే . ఇప్పుడు అంతే బాధలోంచి లేచితీరాలకి చేరిఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచిచినుకుల్లా కురిసిన ఒక నేను .
సాహిత్యం కవిత్వం

ఉదయం

అర్ధరాత్రి అమాసచీకట్లో ఓ జెండా దిగిందిఓ జెండా ఎగిరింది అలసిన మేనులుఆదమరచి గాఢ నిద్ర లోఅధికార మార్పిడి చిమ్మ చీకట్లో ఏళ్ళు గడుస్తున్నాఆ అధికారం కిందికి దిగలేదుకిందోడు పైకెక్క లేదు ఊరిస్తూ ఉడికిస్తూఫలాలు అందీ అందిస్తున్నట్లునటిస్తూ అధికారం అక్కడే బహు చక్కగా రాచరికం పోలేదురాజ్యాంగం పుటల్లోనేదోబూచులాడుతుందివర్గ వైషమ్యాల సృష్ఠి లో ఆరితేరిగద్దె పై రాబందుల వికట్టహాసం సమానత్వం ఓ పగటి కలఅది తీరని దాహంపదిహేను వస్తుందివీధి వీధి న ఓ జెండారెప రెప లాడుతుందిసాయంకాలం దించబడుతుంది సూరీడు మౌనంగా కొండల మాటున దిగుతుండుఇంకెన్ని ఉదయాలు ఉదయిస్తేనిజమైన స్వరాజ్యం ఉదయిస్తుందని మథన పడుతూచాల్లే పో పో అంటూచందమామ కసిరిందివెన్నెల కురిపిస్తుందేమో
కవిత్వం సాహిత్యం

దండాలు స్వామి

దక్షిణాన పుట్టినవివిక్త కొండల్లో ఏపుగా పెరిగినరాక్ ఫోర్ట్ ఒరిగిపోయిన చెట్టంత మనిషికన్నీళ్ళతో కావేరి నిండిపోయింది చదివిన వేదాంత శాస్త్రంగొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితేఝార్ఖండ్ క్షేత్రమయ్యింది వనాంచల్ ప్రతి మొక్కవంగి సలాం చేస్తుంది గజరాజులు గజగజ వణుకుతున్నాయిఅండగా నిలిచిన స్వామి లేడని తాను ముందుండి వేసిన ప్రతి అడుగుఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం హక్కులకై సంధించిన ప్రశ్నలేతన చావుకి కారణమౌతుంటేపుటల్లోని రాజ్యాంగ ప్రతులుపటపట రాల్చాయి చుక్కలు వణుకుతున్న చేతులుతాగలేని నీరు ఒలుకుతుంటేఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం పండు ముదుసలిపార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..అయినా ఆఖరి శ్వాస దాకాచెద‌ర‌ని ఆదివాసీ స్వ‌ప్నంఅమరుడా! దండం!!
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
సాహిత్యం కథలు

అధిపతి

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి. "మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు" యాంకర్ మొదలుపెట్టాడు."మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా