అంతర్జాతీయ చిత్ర సమీక్ష సాహిత్యం

హృదయాల్ని కలవరపరిచే ‘ఒసామా’

ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జపాన్ దేశాల సంయుక్త ఆధ్వర్వంలో ఫార్సీ భాషలో, ఇంగ్లీష్ ఉపశీర్షికలతో వచ్చిన హృదయాల్నికలవరపరిచే మర్చిపోలేని చిత్రం“ఒసామా”. ఈ  చిత్రదర్శకుడు “సిద్దిక్ బార్మాక్”. దీని నీడివి 84 నిమిషాలు. ఇతివృత్తం: బాలికల, మహిళల అణచివేత అమానుషంగా అమలవుతున్నఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి ఒక బాలిక, ఆకలి బాధ భరించలేక బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబన్ పాలనలోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలన చిత్ర సారాంశం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల
కథలు “మెట్రో జైలు” కథలు సాహిత్యం

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప
సాహిత్యం కవిత్వం

భానుడి చూపు

ఎవరు రాసారీ పద్యాన్ని,ఉద్యమంలాంటి ఉదయాన్ని?!వెలుతురు లాంటి నినాదాన్ని?!చీకటికి తెర దించి కాంతికి పట్టం కట్టినపదాల కెరటాల కవన సముద్రాన్ని!? ఎవరు రాసారీ పద్యాన్నిదువాల ఒడిలోంచి నిదుర లేచినజాబిల్లి తోబుట్టువుని!?తిమిరం కుబుసాన్ని విడిచితళతళాడుతూ తెల్లారిన కాలాన్ని!? ఎవరు రాస్తారు వెన్నెల సిరా నిండినగాలి కలంతోకొండలపై నుంచి జారే నిశ్శబ్దపు జలపాతాలని?! అరణ్యంలో తాండాలోతంగెడు పూల పురుడు వాసననిపీల్చుకుని మత్తగిల్లే మధువుకు ప్రియమైన భ్రమరాలనీ!? ఎవరు రాస్తారు పద్యాలనీప్రాణ త్యాగానికి సిధ్ధపడితుపాకీ భుజాన వేలాడదీసుకొనిఅరణ్యం మీంచి లోకం మీదికివిప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపుని!?
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ
సాహిత్యం కవిత్వం

చెరగని నేను

అవును నేనెవరిని అందరి లాగే నేను ఐనా నేనంటే గిట్టదు  నా ముస్తాబు నా ఇష్టం రకరకాల రంగుల్లో నాకు నచ్చిన రంగు తొడుక్కుంటా నాలోని భావాలు నలుగురిలో పంచాలనుకుని రూపు దిద్దుకుని జనంలోకి వస్తా నా ఆశయాలు వేరు నా ఆదర్శాలు వేరు అందరూ పాటించాలనే నియమం లేదు కొరడా పట్టుకుని ఝుళిపించనూ లేదు నా మానాన నేను కమ్మలతో కూర్పు నన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటే తప్పా?! నా లోని ఒక్కో తెర ఒక్కో కఠోర వాస్తవ దర్పణం చరిత్ర నేటి తరానికవసరం నన్ను స్వీకరిస్తారో త్యజిస్తారో జనం ఇష్టం నన్ను బైటికి రాకుండా చేసే
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమర్శలో చారిత్రక పాత్ర

మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రత్యేకత దాని సిద్ధాంతంలో ఉంది. సాహిత్యంలో ఉండే భావాలకు చరిత్ర ఉంటుంది. దాన్ని సామాజిక చరిత్రలో భాగంగా చూడాలి. అప్పుడే అ రచన ఏ కాలంలో ఏ అర్ధం పలికిందీ వివరించడానికి వీలవుతుంది. సాహిత్యానికి ఉండే అర్థాలు చెప్పడం సాహిత్య విమర్శ కర్తవ్యాల్లో ప్రధానమైనది. ఒక రచనకు అ అర్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఎలా మారుతూ వచ్చాయి? అనే ప్రశ్నలకు జవాబు నేపథ్యంలోని సామాజిక చారిత్రక స్థితిగతుల మార్పుల్లో వెతకాలి. ఇది మార్క్సిస్టు  సాహిత్య విమర్శలో కీలకం. _ చారిత్రక భౌతికవాద పద్ధతిని సాహిత్య రచనకు సక్రమంగా అన్నయిస్తేనే ఈ పని సాధ్యమవుతుంది. ఈ
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

చదువు!

‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని
సాహిత్యం కథావరణం కాలమ్స్

దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి
సాహిత్యం వ్యాసాలు

డిజిటల్ పాఠాలు పేద విద్యార్థులకు చేర్చడంలో పాలకులు విఫలం

అంతర్జాతీయ కరోనా విపత్తు వలన గత ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యభోదన ప్రత్యక్ష తరగతిగది విధానంలో కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో జరుపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే తరగతుల భోదన ఉంటుందని విద్యశాఖ స్పష్టం చేసింది. అయితే రూపంలో డిజిటల్ విద్యభోదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సారంలో డిజిటల్ తరగతులు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది నేడు మనందరి ముందున్నట్టి ప్రశ్న. వేల సంవత్సరములుగా మన దేశంలోని శోశితజనసమూహౕలపై జరుగుతున్న సామాజిక,ఆర్థిక అణచివేత వలన నేడు మెజారిటీ ప్రజలు డిజిటలైజేషన్ ఫలితాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. తరగతిగదిలో ప్రత్యక్ష భోదనకు స్కూల్ బిల్డింగ్, టీచరు, బెంచీలు,