సాహిత్యం కవిత్వం

విత్తనం పుట్టక మానదు

నెత్తు రోడ్డుతున్న నేలపై విత్తనం పుట్టక మానదు. పదునెక్కిన నేలపైన వసంతమై చిగురిస్తుంది  ఒకట రెండ ఎన్నో నింగి నేల నిండ నిండు త్యాగం. పుట్టుక కోసం పురటి నొప్పుల దారి పురుడు పోసుకుంటున్నది కాలం కౌగిలిలో గింజకుంటున్న హృదయాలు చరిత్ర దారిలో చెదరి పోవు ఆకాశం హద్దు లేకుండ తూర్పు కిరణాలు   ప్రసరిస్తయ్ ఎర్రపూలవనంలో పిడికిళ్ళు బిగుసుకుంటయ్ త్యాగాల దారిలో...
సాహిత్యం వ్యాసాలు

రాష్ట్రబడ్జెట్-రాయలసీమ

గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం. పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక
సాహిత్యం కవిత్వం

తండ్రి తొవ్వ‌లో

మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥ పృథ్వంటు ఒక పేరు
సాహిత్యం వ్యాసాలు

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీ.సీ.ఈ.ఏ) సమావేశం ఉక్కు పరిశ్రమతోపాటు, దాని అనుబంధ సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా కార్పొరేట్‌ సంస్థ పోస్కో (పోహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. మరోవైపు భారత దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యుడు ఆదానీతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి. ఈ విషయాలేవి ఉక్కు పరిశ్రమ కార్మికులకు గానీ, గతంలో
సాహిత్యం కవిత్వం

అమరుని స్వప్నం

ఎంతటి నిషి ఈ వసంతాన్ని ఆవరించిననూ ఎంతటి కుంభవృష్టి ఈ వాసంతాన్ని ముంచిననూ ఎంతటి అనావృష్టి ఈ వసంతాన్ని వంచించిననూ వారు చుక్కలవలే వెలిగి జ్ఞానాన్ని వెలువర్చారు సూర్యునివలే గర్జించి శక్తిని చేకూర్చారు చినుకువలే స్పందించి వసంతానికి ఉపిరిపోసారు వారు ఉల్కాపాతం వలే ఊపిరినొదిలి ఈ పాలపుంతలో వారి జ్ఞాపకాలను ఆశయాలను వదిలిపోయారు అయితే మేమే శృష్టికర్తలమను గర్వంతో విర్రవీగే వాళ్ళకు వారి అమరత్వం తలచుకున్నా వెన్నులో వనుకే అందుకే స్థూపాన్ని ఆపాలనుకుంటారు సభలని అడ్డుకుంటారు పుస్తకాన్ని నిషేదిస్తారు
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
లోచూపు సాహిత్యం సమీక్షలు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
గల్పిక

‘బజరా’ గల్పికలు రెండు

1 సమభావం! “రేణుకని చంపేశారట...”“ఏ రేణుక?”“జి. రేణుక, మిడ్కో పేరుతో కథలు రాస్తుంది!”“ఆ... చూశాను, మనవాళ్ళంతా పోస్టులు పెడుతున్నారుగా?”“మెట్లమీద- అని యాంతాలజీ కూడా వచ్చింది!”“ఔనౌను, అందరూ అక్కడ ‘జోహార్లు’ చెపుతున్నారు, యిక్కడ ‘జేజేలు’ చెపుతున్నారు!”“జేజేలు యెవరికీ యెందుకూ?”“ఉగాది పురస్కారాలు పొందిన వాళ్ళకి, అదీ ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకుంటుంటే చెప్పరా జేజేలు...”“అదేంటి జోహార్లకి కారణమై భాగస్వాములైన వాళ్ళే శాలువాలు కప్పుతుంటే సిగ్గులేకండా జేజేలా?”“నీకు తెలీదబ్బా... మన రచయితలకు అన్నిటి మీద సమభావం వుంటుంది!”“....................................................?!?” 2 మిడ్కో! “మన రాజ్యం చీకటితో యెంత బావుందో కదా?!”“ఔను, కాని అదేమిటి యింత చీకటిలోనూ మచ్చలా ఆ వెలుగు?”“నిజమే, అది ఆ స్పార్క్... గ్లీమ్...
కథలు

మౌనం

సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని అతనికి అనిపిస్తోంది. కవల పిల్లలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో విలవిల్లాడుతున్నారు. ఒకరు పాప. మరొకరు బాబు. షబానా: "యాకూబ్, వీళ్ల శ్వాస ఇంకా బాగా లేనట్టుంది. మన దగ్గరి ఇంటి వైద్యం చేశాం. ఇంతకన్నా చేయగలిగింది ఏమీలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిదేమో." యాకూబ్: "నేను కూడా అదే అనుకుంటున్నా. వాళ్లను ఇక్కడ ఉంచితే ఏమైనా జరిగి పోతుందేమోనని భయం వేస్తోంది. మనం ఆలస్యం చేయకూడదు." షబానా: (పిల్లల్ని
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధం విరసం మీదేనా?

విప్లవ రచయితల‌ సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెల‌ల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాల‌కుల‌కు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్ప‌ని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల‌ తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు