విప్లవ కళాకారుడు డప్పు చంద్రకు నివాళి
ప్రజా సంగీత వాయిద్యాల్లో ప్రముఖమైన డప్పుతో గుర్తింపు పొందిన జననాట్యమండలి కళాకారుడు చంద్ర మే 12న గుండెపోటుతో మరణించాడు. చంద్ర కుటుంబం దక్షిణాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ దాకా ప్రయాణించి తిరిగి స్వస్థలానికి వచ్చింది. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ఆయన చిన్నప్పుడే తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా నార్నెవారి పాలేనికి వచ్చారు. పెద్దగా చదువుకోని చంద్రకు పేదరికం జీవితాన్ని నేర్పించింది. ఆ జీవిత అవగాహన నుంచి ఆయనలో కళలు వికసించాయి. 1980లలో తన సాహిత్య కళా ప్రదర్శనలతో దేశాన్ని










