వ్యాసాలు

రావణ కాష్టం – సోముని డప్పు

కా. నర్సన్న  స్మృతిలో... నర్సన్న గురించి రాయడమంటే దిగంబర కవులలో చెరబండరాజు గురించి రాయడం. అల్వాల్‌లో ఆరోజుల్లో మిలిటరీ సప్లయ్‌లలో పనిచేసిన కేరళకు చెందిన కుట్టి అనే విప్లవ సంస్కృతిలో ఆసక్తి ఉన్న వ్యక్తి గురించి రాయడం. అల్వాల్‌కు పెంపకం వచ్చిన బి. నర్సింగరావు గురించి రాయడం. వీళ్లను ఒక చోటకు తెచ్చిన కె.ఎస్‌. గురించి రాయడం. వీరిలో నాకు తెలిసిన నర్సన్నకు అటు నర్సింగరావుతో, ఇటు చెరబండరాజుతో ఉన్న పరిచయాలు, స్నేహాలు - సంబంధాలు. వీళ్లంతా నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమంతో ప్రభావితమయిన వాళ్లు. వీళ్లలో నర్సింగరావు దిగంబర కవులతో కూడా ప్రభావితమయిన వాడు. నెహ్రూ భావజాలం ఉన్న
వ్యాసాలు అనువాదాలు

స్టాన్‌స్వామి తొలిప్రేమ

"ఆదివాసీల్లో గల సమానత్వం,సమిష్టిభావం,నిర్ణయాత్మకశక్తి  చూసినాంక నాలో కొత్త చైతన్యం పొడసూపింది. "...స్టాన్ స్వామి..గత డెబ్బయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో,నిరంతరం ఆదివాసీలహక్కులకోసంపోరాడిన స్టాన్లీసాస్ లోర్దుస్వామి(స్టాన్ స్వామి)నిఅక్టోబరు 8,నాడు అరెస్టుచేయడం మధ్యభారతాన్ని కుదిపేసిందిఆయన ఎనభై నాలుగేళ్ళ వృద్ధుడు.పైగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడ్తున్నాడు..అట్లాంటి మనిషిని మావోయిస్టు సభ్యుడనీ,భీమా- కోరేగావ్ కేసులో నిందితుడనీ తీవ్ర నేరాలుమోపి జైలుకు పంపించారు(ఆయన కస్టడీ లో ఉన్న తొమ్మిది నెలల కాలం ఒక్క సారి గూడ ఇంటరాగేట్ చేయలేదు..)ఇదంతా ఆయన సన్నిహితులకు దారుణ మనిపించ వొచ్చు..ఇంతకూ స్టాన్లీస్వామి మంత్రమేమిటి?వేలాది మందిని ప్రభావితం జేసిన ఆయన వ్యక్తి త్వ సూత్రమేమిటి?  ఆయన కుల మత ప్రాంతాల కతీతంగా న్యాయం
వ్యాసాలు

‘మనోధర్మపరాగం’- పాఠకుడి నోట్స్

మా నాయనమ్మ పేరు వంగళాంబ. వాళ్ళ నాన్న పాలఘాట్ రామనాథఅయ్యర్. తమిళుడు. తెలుగు, తమిళనాడులు మదరాసు ప్రెసిడెన్సీగా వున్నప్పుడు కర్నూలు జిల్లాలో డోన్‌ అనబడే ద్రోణాచలం గ్రామానికి వచ్చి గడియారాల మరమ్మత్తు షాపు పెట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకు ఇక్కడి తెలుగు సంబంధాలే చేశాడు. పేదరికం వల్లనో ఏమో మా నాయనమ్మ మా తాతకు (జేనాన/జేజబ్బ) రెండవభార్యగా వచ్చింది. (ఆయన మొదటి భార్య పురిటిలో చనిపోయింది)కూతుళ్ళ పెళ్లిళ్లు అయిపోయాక ఆ కుటుంబం మదరాసుకు తరలిపోయింది. ఆ తరువాత నాయనమ్మకు పుట్టింటితో ఏ సంబంధాలూ లేకపోయాయి.ఎప్పుడైనా మూడు,నాలగేళ్లకోసారి ఆమె అక్క వచ్చి వారం రోజులుండేది.చెల్లెలు అసలు వచ్చేదేకాదు. అంతులేని ఇంటిబరువు, కుటుంబ
వ్యాసాలు సాహిత్యం

ఆధునిక తెలుగు కవిత్వంలో భాష

రంగనాథాచార్యుల అభిప్రాయాలు ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్‌) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య
సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష
సాహిత్యం వ్యాసాలు

కాకోరి నుండి నక్సల్బరి దాకా ….

ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని
సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం
సాహిత్యం వ్యాసాలు

మునికాంతపల్లి కతలు

పాఠకుడి నోట్సు ప్రవేశిక:నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై "రొయ్యలు"),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ 'జీవితమే ఒక నాటక రంగం') కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది. అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా... దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ. ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా? మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
సాహిత్యం కారా స్మృతిలో

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర