వ్యాసాలు

కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన

మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
వ్యాసాలు

ఆదివాసులను పరిహసించే  ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’  

బిర్సా ముండా ఊరు ఉలిహతు (ఖుంటి) నుంచి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 నవంబర్ 15న ప్రారంభించారు.  ఇది ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం అని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇది 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ యాత్ర. కార్యక్రమానికి బీజేపీ రంగు పులిమేందుకు ప్రభుత్వ అధికారులకు రథ బాధ్యులు అని పెట్టిన పేరును, ప్రజల నిరసనతో నోడల్ అధికారిగా మార్చారు. మోడీ ప్రతిష్టను మెరిపించడానికి చేస్తున్న ఈ యాత్ర డబ్బు వృధా తప్ప మరొకటి కాదని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకంగా ఉందని జార్ఖండ్‌లోని అనేక ప్రజా సంస్థలు, సామాజిక
వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా
వ్యాసాలు

తిజిమాలి మా ఆత్మ

“మేము తిజ్‌రాజా పిల్లలం, మా తిజిమాలిని తవ్వడానికి ఎలా అనుమతిస్తాం? తిజిమాలి మా ఆత్మ, ఆత్మ లేకుండా ఎలా జీవించగలం? వాగులను మాత్రమే కాదు మా గుర్తింపును కూడా నాశనం చేసే గనుల తవ్వకానికి ఎలా అనుమతినిస్తాం? మేము మా మాలి కొండ కోసం, మా అడవుల కోసం, అన్ని విధాలుగా పోరాడుతామే కానీ మా ఆత్మను వేదాంత కంపెనీ తవ్వడాన్ని ఒప్పుకోం.” అక్టోబర్ 16న ఒడిశాలోని రాయగడ, సుంగర్ పంచాయతీ, కాశీపూర్ బ్లాక్‌లో జరిగే బహిరంగ విచారణకు ముందు రోజు రాత్రి తిజిమాలి పర్వత ప్రాంతంలోని బంతేజీ గ్రామానికి చెందిన మహిళలు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలని ఏకగ్రీవంగా
వ్యాసాలు

పాలస్తీనా గర్జన ప్రతిధ్వనించాలి

అక్టోబర్ 7వ తేదీన ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో ఒక ప్రతిఘటనా వెల్లువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజాన్ని  ఆసరా చేసుకుని ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం ముందుకు వస్తున్న సమయంలో, దానిక వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో దాన్ని గత ఏడాది సామ్రాజ్యవాద అంతర్గత సంఘర్షణ తీవ్రతరం చేసింది. ఈ మధ్యలో సామ్రాజ్యవాదుల మధ్య సంక్షోభం సాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ లో జియోనిస్టుల ఆక్రమణకు వ్యతిరేకంగా వారి అస్తిత్వానికి వీర పాలస్తీనా ప్రజలు అగ్గిరాజేశారు. హమాస్ (ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమం ), పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్
వ్యాసాలు

ఇరవై ఐదేళ్ల విప్లవాచరణ

( నవంబర్ 24 న కృష్ణా జిల్లా కోడూరు మండలం నారేవారి పాలెంలో జరిగిన కామ్రేడ్  గౌతమ్ సంస్మరణ సభలో  ఆవిష్కరించిన *సమాజ శిల్పి* పుస్తకానికి రాసిన ముందు మాట) కామ్రేడ్ గౌతమ్ ను 2006 నవంబర్ 23న పోలీసులు దొంగ ఎదురు కాల్పుల్లో హత్యచేశారు. 24న తెల్లారికల్లా పత్రికల్లో ఈ విషాద వార్త వచ్చింది. మేము కొద్దిమందిమి రాత్రికి బయల్దేరాలి అనుకున్నాము. అప్పటికే గౌతం కుటుంబ సభ్యులు విజయవాడలో పౌరహక్కుల సంఘం నాయకులను కలిశారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకోడానికి గౌతమ్ కుటుంబ సభ్యులతోపాటు మీరెవరైనా వెళతారా? అని లాయర్ ఆంజనేయులుగారు అడిగారు. మేము రావడానికి లేటు
వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ
వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
వ్యాసాలు

ప్రసంగించాడని అరెస్ట్ చేశారు

2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను