వ్యాసాలు

భారత రాజ్యాంగం – వైరుధ్యాల పుట్ట

(ఈ వ్యాసాన్ని ప్రొ. శేషయ్యగారు 2004లో రాశారు. రాజ్యాంగవాదం మీద వస్తున్న అభ్యంతరాలును పరిశీలించడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది. పౌరహక్కుల ఉద్యమకారుడిగా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా ఆయన రాజ్యాంగాన్ని  చారిత్రకంగా, విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురించిన ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం`1లో ఈ వ్యాసం పునర్ముద్రణ అయింది` వసంతమేఘం టీం) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్చు వివరిస్తూ ‘ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు, రైతులకు, పెటీ బూర్జువాల సామాజిక బానిసత్వాన్ని కొనసాగిస్తూనే, వారు రాజకీయ అధికారం పొందడానికి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మరో వైపు
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
వ్యాసాలు

క‌రోనా కాలంలో పోలీసు కాల్పులు

స‌కెండ్ వేవ్ లోనూ క్యాంపుల ఏర్పాటు, ఎన్‌కౌంట‌ర్లు,  స్తూపాల కూల్చివేత  ప్రపంచమంతా  కరోనాతో యుద్ధం చేస్తున్న కాలం ఇది. మనిషి తనకు తాను బందీగా మారుతున్న కాలం. బతకాలంటే బందీగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయలేక అంతా మనుషులు మీద నెట్టేసి ఊరుకున్నాయి. ప్రాణ అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ కూడా అందివ్వ‌కుండా ప్ర‌జ‌ల  నిర్లక్ష్యం కారణంగానే కరోనా  ఉధృత‌మైందని  అంతా ప్రజల మీదికే తోసేశాయి.. ఈ విష‌యంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలు పోరాట ప్రజలపై  అణిచివేత‌కు త‌న ర‌హ‌స్య హ‌స్తాల‌ను కూడా ఎప్ప‌టి కంటే దుర్మార్గంగా వాడుతున్నాయి. ముఖ్యంగా స‌క‌ల ప్రాకృతిక సంప‌ద‌ల‌ నిలయమైన దండకారణ్యంలో పాల‌క దాడులు  నానాటికి
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు
వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప
వ్యాసాలు

ఉమ్మడి వారసత్వ ప్రదేశాలు – మతపరమైన ఎజెండాలు

1992 డిసెంబరు 6న భారతదేశంలోని వారసత్వ ప్రదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈ దాడి రాజ్యమూ దాని బలగాల సమక్షంలో జరిగింది. రాముడి విగ్రహాలను బయటకు తీసి తాత్కాలిక ఆలయంలో ఉంచారు. ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. కానీ అందులో మరో రాముడి విగ్రహం ఉంటుంది. లౌకిక  దేశానికి చెందిన ప్రధాని ఆలయ ప్రారంభోత్సవం పేరుతో భారత్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లోనూ ఆసక్తిని పెంచుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున దీపావళిని జరుపుకోవాలని, తమ నగరం లేదా గ్రామంలోని దేవాలయాలలో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘ్ పరివార్ సభ్యులందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర ఎజెండాను
కారా స్మృతిలో సంభాషణ

అవుట్ బరస్ట్!

ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది. మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు