వ్యాసాలు

కథలవనం ఎండిపోయింది..

ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని
వ్యాసాలు అనువాదాలు

కోవిడ్ 19 విపత్తుని ఎదుర్కోవడంలో క్యూబా సహకారం

‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు
వ్యాసాలు అనువాదాలు

పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్‌ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని
సాహిత్యం వ్యాసాలు

మయన్మార్‌లో సైనికకుట్ర – తదనంతర పరిణామాలు

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందు మిలిటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని జనవరి 31న తెల్లవారుజామున హస్తగతం చేసుకుంది. ఆగ్నేసియాలోని నిరుపేద దేశమైన మయన్మార్‌ మరోసారి సైనిక పాలనలోకి పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత సైన్యాధిపతి మిన్‌ అంగ్‌ హేలింగ్‌ అధికారం చేపట్టాడు. అయిదు కోట్ల జనాభా కలిగిన మయన్మార్‌లో సైనిక కుట్రలు కొత్తేమీ కాదు. 1948లో స్వాతంత్ర్యం సాధించిన తరువాత మొదటి పద్నాలుగేళ్లు ప్రజాస్వామ్య పాలన కింద ఉన్న మయన్మార్‌లో 1962లో సైన్యం ఒక్కసారిగా తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారం తమ చేతుల్లోంచి