సాహిత్యం కారా స్మృతిలో

జీవిత దృక్పథమే కథా.. కథలనిలయమే… కారా మాస్టార్

కాళీపట్నం రామారావు గారు యీ లోకం నుంచి వెళ్ళిపోవటం.. మాష్టారు గార్ని వొక‌ జ్ఞాపకంగా మాట్లాడుకోవటం బాధగా గుండెల్ని మెలిపెడుతూనే వుంది.  మాష్టారి గారితో  వ్యక్తిగతంగా.. కధానుబంధంగా..  వున్న జ్ఞాపకాలను రచయితలు మాత్రమే కాదు. యెందరో పాఠకులూ పంచుకుంటున్నారు. పరిశోధకులు కథా నిలయం తమ పరిశోధనకి యెలా వుపయోగపడిందో  గుర్తుచేసుకుంటున్నారు.  మనం రాసిన వాటినే మనం దాచుకోలేని వారెందరో వున్న కాలంలో దాదాపు మనందరి కథలని  అక్కడ భద్రపరిచే పనిని కథపై, ముందు తరాలపై యిష్టంగా.. ప్రేమగా.. బాధ్యతగా.. గౌరవంతో వారు ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేశారు.  మనందరికీ తెలుసు వారు వుపాధ్యాయులని. పిల్లలకి శ్రద్ధ లెక్కలు చెపుతూ
సాహిత్యం కారా స్మృతిలో

సాహిత్యంలో ప్రాసంగికత: కారా ఉదాహరణ

కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు. కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల  ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం
వ్యాసాలు

ఆ త‌ల్లుల త్యాగాలు గుర్తున్నాయా?

చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాల‌న ఇది. దేశ‌ద్రోహుల‌, లొంగుబాటుదారుల  వికృత ,  ప్రజావ్యతిరేక  జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహ‌నీయులని, త్యాగమూర్తులని, ఆద‌ర్శనీయులని    బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి.  “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో,   ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్ర‌భుభ‌క్తిని మించిన దేశ‌భ‌క్తి లేని కాలం ఇది.  ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని క‌న్న త‌ల్లుల‌ను, వారికుటుంబాలను ప‌దే ప‌దే గుర్తు చేయాల్సిన అవ‌స‌రం
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
వ్యాసాలు

క‌రోనా కాలంలో పోలీసు కాల్పులు

స‌కెండ్ వేవ్ లోనూ క్యాంపుల ఏర్పాటు, ఎన్‌కౌంట‌ర్లు,  స్తూపాల కూల్చివేత  ప్రపంచమంతా  కరోనాతో యుద్ధం చేస్తున్న కాలం ఇది. మనిషి తనకు తాను బందీగా మారుతున్న కాలం. బతకాలంటే బందీగా ఉండాల్సిన సమయం. ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయలేక అంతా మనుషులు మీద నెట్టేసి ఊరుకున్నాయి. ప్రాణ అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్ కూడా అందివ్వ‌కుండా ప్ర‌జ‌ల  నిర్లక్ష్యం కారణంగానే కరోనా  ఉధృత‌మైందని  అంతా ప్రజల మీదికే తోసేశాయి.. ఈ విష‌యంలో చేతులెత్తేసిన ప్రభుత్వాలు పోరాట ప్రజలపై  అణిచివేత‌కు త‌న ర‌హ‌స్య హ‌స్తాల‌ను కూడా ఎప్ప‌టి కంటే దుర్మార్గంగా వాడుతున్నాయి. ముఖ్యంగా స‌క‌ల ప్రాకృతిక సంప‌ద‌ల‌ నిలయమైన దండకారణ్యంలో పాల‌క దాడులు  నానాటికి
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు