సాహిత్యం వ్యాసాలు

ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు -ఒక సమీక్ష  

                                           రచయిత్రి నిత్య రాసిన "ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు "పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని "మహిళా మార్గం "పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు "ప్రజా రచయిత ప్రేమ్ చంద్ "అన్న పేరుతో ముందు మాట రాస్తూ "భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ "అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సాహిత్యం కాలమ్స్ నా క‌థ‌తో నేను

కథతో నేను

పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి. ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
సాహిత్యం కవిత్వం

తునకలు మా ప్రాణం

మా పోలేరమ్మ కాడనరికిన దున్నపోలేరమ్మ తినదని ఎరుకేపోగులు వేసిదండేలపై వేలాడే ఎర్ర గులాబీలువాటికి ముల్లుండవ్ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటేవాడంతా ఘుమఘుమమీకేం నొప్పిదున్న మీది కాదునరికింది మీరు కాదుసాకింది సవర తీసింది మీరు కాదు కట్ట మైసమ్మ కాడఒక్క వేటుకి యాటనేసినంయాతలన్నీ బోవాలనిమా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాంబాగా అర్థమైతది ఆమెకీ మాకూవూర్లన్నీ జన సందోహం తోచెర్లన్నీ అలుగులు దుంకుతాయనితెగిన యాటల కుప్పలుమా పొట్టలు నింపు అదేందోమా గంగమ్మ తల్లి కీమా మల్లన్న కీమా కాటమయ్యకిమా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతంజంతు మాంసమే ఇష్టంమాకూ అదే ఇష్టంసిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండుమా అయ్య
సాహిత్యం కవిత్వం

చిత్రవధ

చిత్రవధ చేస్తావనుకోలేదుకన్నీళ్లు నడిచి వస్తున్న చరితను కొన్ని రంగు పూసిన పాత్రలుఇంకొంచెం సరిగమలుకొన్ని భౌగోళిక దృశ్యాలుకథే కదా!కాకుంటేకళ్ళు మూసుకొని కళ కన్నావు విషాదం మంచు కురవడం ఎలా తెలుస్తుంది ఒక దేవాలయం ఒక మసీదు ఒక గురుద్వారా ఒక ఆరామం బతుకు వెతుక్కుంటూ భయం రహదారి నడపడం దాల్ సరస్సు దుఃఖమే !ఈ దేహావయవం అన్నందుకే కదా !ఇక్కడ పారిన నెత్తుటికి మతం లేదువయసు లేదు కాశ్మీరీయత తప్ప !నీ తెర అస్పృశ్య౼రెక్కాడితే డొక్కాడని నెత్తుటి వాసనమన ముక్కుపుటాల్లోకి చొరబడుతుంది ఈనేల ఇష్టపడిన పేర్లన్నీ ఈ మట్టిలోనే దాక్కున్నాయి మానభంగాలు మౌనభంగాలు ఎన్ని అర్ధరాత్రులు మౌనం మోశాయి రాలిన కలలన్నీ హిందువులు ముస్లిములు బౌద్ధులు సిక్కులు మరణానికి మతం లేదు కాశ్మీరీయత తప్ప !కళ్ళల్ల చెవులల్లసృజనాత్మక విషం పోసినీ మతం కోరిక తీర్చావుకన్నీళ్ళకు
సాహిత్యం కవిత్వం

మనుగడ కోసం – జీవిక కోసం

వారాంతపు సంతలలో మండుతున్న ధరలు అడవులలో, వూళ్లల్లో పెరుగుతున్న ఖాకీల దాడులు. బతుకు గ్యారంటీ లేని జీవితాలలో బతుకు పోరులో ముందున్నది మా తరతరాల ఆత్మరక్షణాయుధం. ఇక వెనుకున్నది జీవిక కోసం పెనుగులాటలో సగటు ఆదివాసీ సంఘర్శన ఫలం. సమాధాన్, ప్రహార్ లు రాజ్య బీభత్సానికి పేర్లేవైతేనేం! మనుగడ కోసం మా పోరాటం. జీలుగు వద్ద తేఢాలేదు. మండుతున్న ఎండల్లో రాలిపడే  పూవుల కోసం పిల్లా-జెల్లా; ఆడ-మగా అడవంతా మా గాలింపే ఆకలి తీర్చుకోవడానికి అంబలి, సేద తీర్చుకోవడానికి నీరుతో పాటు ఉత్సాహాన్ని, శక్తినిచ్చే సంప్రదాయ సేవనం – జీలుగు కల్లు జెండర్ తేడాలేమీ లేకుండా సమష్టిగా డొప్పల్లో
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్
సాహిత్యం కొత్త పుస్తకం

వాలని మబ్బులు- వానమెతుకులు

రాయ‌ల‌సీమ రైతు క‌థ‌లు సంక‌ల‌నానికి శ్రీ‌నివాస‌మూర్తి రాసిన ముందుమాట‌ నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి 'అమ్ముకునే' పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే "అరటిపండ్లేయ్!" అంటూ బస్సును  చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం
కథలు

నా కథల్లో నేనుంటాను

తెలంగాణ నేల  మీద నేను పుట్టి అడుగులు వేసే సమయానికి ఈ మట్టి మీద  ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. రైతుకూలి ఉద్యమాలు, కమ్యూనిష్టు పోరాటాలు, నక్సలైట్ ఉద్యమం, బతుకుదెరువులేక ఎడారి దేశాలకు, ముంబై, షోలాపూర్, సూరత్, బీవండి వంటి వస్త్ర పరిశ్రమ కేంద్రాలకు నేత కార్మికుల వలసలు ఇలా తెలంగాణ నేలంతా తనలో తాను తొక్కులాడుకుంటున్న కాలం. అలాంటి గడ్డుకాలంలో జన్మించి సర్కారు బడిలో చేరి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని ఇన్నాళ్ళకు నావైన కథలేవో కొన్ని రాసుకొని వాటిని ‘పుంజీతం’ పేర ఒక పుస్తకంగా తీసుకు వచ్చాను. ఈ ప్రయాణమంతా ఎన్నో గతుకులతో కూడినది.