సాహిత్యం వ్యాసాలు

రాష్ట్రబడ్జెట్-రాయలసీమ

గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం. పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక
సాహిత్యం వ్యాసాలు

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీ.సీ.ఈ.ఏ) సమావేశం ఉక్కు పరిశ్రమతోపాటు, దాని అనుబంధ సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా కార్పొరేట్‌ సంస్థ పోస్కో (పోహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. మరోవైపు భారత దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యుడు ఆదానీతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి. ఈ విషయాలేవి ఉక్కు పరిశ్రమ కార్మికులకు గానీ, గతంలో
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధం విరసం మీదేనా?

విప్లవ రచయితల‌ సంఘాన్ని చట్టవ్యతిరేక సంస్థగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2005 ఆగస్టు 17న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి విరసాన్ని నిషేధించింది. న్యాయ విచారణ కమిటీ ముందు ప్రభుత్వం తన వాదనల్లో ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయింది. మూడు నెల‌ల్లో నిషేధ ఉత్తర్వు వీగిపోయింది. పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అవే ఆరోపణలు. అదే పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌. అప్పుడూ ఇప్పుడూ నిరంకుశ అధికారం తప్ప పాల‌కుల‌కు మరేదీ అనుకూలించలేదు. విప్లవ రచయితల కాల్ప‌ని శక్తిని, సిద్ధాంత అవగాహనను చట్టపరిధిలోకి తీసికెళ్లగల‌ తెంపరితనం ఒక్కటే వాళ్ల దగ్గర ఉన్నది. బహుశా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒకటికి రెండు సార్లు
సాహిత్యం అంతర్జాతీయ చిత్ర సమీక్ష

చివరి ఆరు రోజులు!

1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ  “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”.  ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు. ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్  దృష్టి
సాహిత్యం కథలు

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
సాహిత్యం వ్యాసాలు

ప్రతి విపత్తూ పెట్టుబడికి వరమే

ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య,  వారి సంపదను లెక్కించడం లో    ఫోర్బ్స్ సంస్థ  అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో,  వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక  దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్  నివేదికను
సాహిత్యం కవిత్వం

ఇక్కడి నీడలు నీడల్లా వుండవు

మా దేహపు నీడలోనూమా ఊపిరిపాట వినిపిస్తుంది మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణమా కడుపులోకి ఎలా దూకిందోమా దేహపు నీడలోనూ కనిపిస్తుంది స్థూపాల నీడలన్నీ కలగలిసినేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయిమా దేహపు నీడలోనూఅదే త్యాగాల రంగు దట్టమైన చీకటిలోనూనిద్ర పట్టని రాత్రిలోనూనేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయిమా నీడలు మా కింద నుండి పారుతుంటాయిగుండెలు పగిలిఅచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్నమరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికిమా నీడలు పారటం నేర్చుకున్నాయి చిమ్మ చీకటిలోనూమా నీడలన్నీ సజీవమేనీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలుపిడికిళ్లుగా మారుతుంటాయిపిడికిళ్లుగా పాడుతుంటాయి ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండిఇక్కడి
సాహిత్యం కవిత్వం

పరాకాష్ట

చేతులకు సంకెళ్ళువేసినరాతను గీతనుఆపలేవుకాల్లకు సంకెళ్ళువేసినమా ఆటను అడ్డుకోలేవునోటికి సంకెళ్ళువేసినపాటను మాటనుప్రశ్నను ఆపలేవుఅక్షరం పై ఆంక్షలుశబ్ధం పై నిషేదంకదిలిక పై నిర్భందంమెదలిక పై నిఘాఅప్రకటిత చీకటిపాలనకు పరాకాష్టఇక మౌనం మండాల్సిందేశబ్ధం విస్ఫోటం చెందాల్సిందే
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
సాహిత్యం వ్యాసాలు

నిషేధాన్ని ఇలా చూద్దాం!

నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు,