కవిత్వం

ఒకే పాదంతో నడుద్దాం రండి

నా ప్రశ్నల బాణం నీ మనోభావాన్ని గాయపరిస్తే నీ జవాబు ఈటెను నా మెదట్లో దించిపారేయ్ ఆలోచన అరుగు మీద ఇద్దరం పొట్లాడుకుందాం చర్చల బీళ్ళను సంఘర్షణల నాగళ్ళతో దున్నిపారేద్దాం కొత్తగా మొలకెత్తిన దారులగుండా ఒకే పాదంతో నడుద్దాం రండి మెట్ల కుల కట్టడాల్లో పై మెట్టు మినహా కింది మెట్లన్నీ మనవే మనువు నిన్నూ నన్నూ వైరి గుర్రాలను చేసి తన రథానికి కట్టుకొని రథయాత్ర చేస్తున్నాడు మిత్రమా రాయి రాయి రాజుకొని రగిలి వెలిగినప్పటినుండే కదా చరిత్ర ప్రారంభమైంది రండి మన మెదళ్ళను జ్ఞానం ఆకురాయి మీద సానపెడుదాం నువ్వు, చీకటి గర్భగుడిలో ఆలోచనలని శిలావిగ్రహాన్ని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు మూడు

1. మృతకాలం-అమృతకాలం అమృతకాలం వచ్చిందహో ఆవుకు ! ఆలోచించినా ఆశాభంగం కౌగిలించుకో కౌగిలించుకో ఆహా. మనిషికంటావా మృతకాలమే. ఆకలితో ఉపాధి లేమితో బాదలతో కన్నీళ్ళతో కరోనా కార్మికచావువో కారోనా ఆకలిచావువో పోపో చప్పట్లు కొట్టుకుంటో దీపాలు వెలిగించుకుంటో అమృతకాలం వచ్చింది ఆవును కొగిలించుకో పోసిటివ్ ఎనిర్జీ వస్తుంది ఆహా మనిషికంటావా మృతకాలమే. పరిశీలకునివో పరిశోధకునివో శాస్త్రీయ సామాజిక వ్యాఖ్యతవో డబోల్కరో గౌరీ లంకేశో చంపబడితేనేం కాల్చబడితేనేం పొండి పొండి సత్యం ఉచ్చరిస్తూనే అమృతకాలం వచ్చింది ఆవును కౌగిలించుకో పాజిటివ్ ఎనర్జి వస్తుంది. ఆహా మనిషి కంటావా మృతకాలమే అపవిత్రమనో దళితనో ఎదురొచ్చాడనో ఎదురునిల్చాడనో పండు కోశాడనో నీల్లుతాగాడనో మీసాలు
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక
సంభాషణ సాహిత్యం

యుద్ధం మధ్య దండకారణ్య కథకుల సమావేశం

నా సన్నిహిత మితృడు కామ్రేడ్‌ చందూ దండకారణ్యంలో సాహితీ కార్యశాల నడుపుతున్నాం, విధిగా మీరు రావాలని నన్ను కోరాడు. డేట్‌ పంపాడు. వాస్తవంగా అ తేదీలలో నాకు అప్పటికే నిర్ణయమైపోయిన ఇతరత్ర పలు పనులున్నాయి. కానీ, ఏం చేయడం? నేనూ సాహితీ ప్రియుడినే! నాకూ వెళ్లాలనే వుంది. చందుకు దండకారణ్యంలో పాట రచనపై కార్యశాలలు నడిపిన అనుభవం వుంది. స్వతహాగా అనేక పాటలు రాశాడు. తాను పాడుతాడు, పాటపై అడుతాడు. కానీ, కథల కార్యశాల నడిపిన అనుభవం మాత్రం ఆయనకు లేదు. కథలు రాసిన అనుభవం కూడా లేదు. కథలు చదివింది కూడ తక్కువేననీ ఆయన నిర్మాహమాటంగానే తెలిపాడు.
కవిత్వం

విప్లవమే ఊపిరిగా

నాన్నా !నీ కమ్మని ,తియ్యని గొంతుప్రేమకు ప్రతి రూపమైన నీ మోముఆదివాసీ త ల్లుల నాన్నల పసిపాపలఅపార ప్రేమ వాత్స్యల్యంనిత్యం నన్ను నిమురుతాయి దోపిడీ అన్యాయం ఫై మాట్లాడకుంటేతిన్న బువ్వ స హించదనినేవు చెప్పిన మాటలునా మనసులో మెదులుతాయి ! కడుపు కట్టుకొని కష్టపడి సాదివిద్యా బుద్ధులు నేర్పిసమాజం జీవనం సంస్కృతినివర్గ దృష్టితో చూసేందు కు ప్రేరణనీ నీతి మాటలే ! కుళ్ళిన భూస్వామ్య సామ్రాజ్యవాద సంస్కృ తిసమాజాన్ని విష తుల్యం చే స్తూవ్యక్తి స్వార్థం, కేరిరిజం తోమానవ విలువలు ధ్వంసమైకుటుంబాలు చితిల మవుతున్న వేళ.. నాన్నావ్యక్తీ స్వార్థాన్ని ,అమ్మానాన్నలని విడిచినిస్వార్థంగా ప్రజలకోసందోపిడ సమాజాన్ని సమూలంగానిర్మూలించే సేద్యంలోదోపిడి పీడన
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.
హస్బెండ్ స్టిచ్ - 3 కథలు

ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు

ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ  .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు  , కూతుర్లు ., ఇంకా చాలా మంది  గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు  కొట్లాడుతూ,,అరుచుకుంటూ   బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి  ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు..        కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల 
కవిత్వం

ఎంపిక

నేనేమీసుడిగాలుల పిడి గుద్దులకుతుఫానుల రౌడీతనానికీచలించిపోయే గోడను కానుభూమి లోలోపలి పొరల్లోపాతుకు పోయిన రాయినీ కానుగుచ్చుకొన్న దుఃఖపుసూదుల చురుక్కుమనే పోట్లకుపట్టించుకోని తనపు నిర్లక్ష్యపు కత్తిగాట్లకువిలవిలలాడే సున్నితత్వాన్నిగుడ్డులో నుంచి అప్పుడే రెక్కలు విప్పుకొంటున్న సౌకుమార్యాన్నిప్రతి చిన్నదానికీ కరిగి కురిసే చినుకునునా రెక్కల్ని ముక్కల్ని చేసేహక్కు నీకెవరిచ్చారుఅమ్మ గర్భాంతరంలోఉమ్మనీటి తటాకం నుంచిబాహ్య ప్రపంచంలోకి రాగానేఅలా ఉండు ఇలా ఉండకుఈ విధి నిషేధ సూత్రాలే కదానా బ్రతుకు వ్యాకరణం నిండాఈ ప్రపంచపు సూర్యకిరణాల వర్షంలో తడవకుండానా దేహ పుష్పానికీ గాలిసోక కుండాకప్పేసిన ఈ నల్లని ముసుగేమిటి?అసలు నా కట్టుబొట్టుపైపరాయి పెత్తనమేమిటి?నా ఊపిరి మీద నా బట్టల మీదఒకరి ఆజ్ఞ లేమిటిన్యాయమూర్తులైనా పాలకులైనామీ నిర్ణయాలతో పనేమిటిఇక
కవిత్వం

కాల్చిన బూడిద కుప్ప కింద

సత్యం ** సత్యమిపుడు సంకెళ్ల కింద రక్తమోడుతూ ఉండవచ్చు జైల్లో అండా సెల్లో అనారోగ్యంతో కునారిల్లుతూ ఉండవచ్చు ముస్లిం మొహల్లాలలో మురికి వాడల్లో, ఒంటరి పొలాల్లో ఇరుకిరుకు బతుకుల్లో కప్పబడి ఉండవచ్చు అడవిలో గూడేల్లో కాల్చిన బూడిద కుప్ప కింద ఊపిరాడక గింజుకోవచ్చు.. ఇంద్రావతి అలల మీద శవమై తేలి యాడ వచ్చు కోర్టు మెట్ల మీద దిగాలుగా కూర్చుని దిక్కులు చూస్తుండవచ్చు అనేకానేక కమిషన్ల కింద, కేసుల కింద, తీర్పుల కింద శాంతి భద్రతల ఇనుప మూకుడుల కింద ఖండ ఖండాలుగా నరుకబడి ఉండవచ్చు దాన్ని సముద్రంలో ముంచండినిప్పుల్లో కాల్చండిఏడేడు నిలువు ల లోతునభూమి లోపల పాతిపెట్టండి
సమీక్షలు

రాజకీయార్థిక నవల ‘చంద్రవంక’

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.