సాహిత్యం కొత్త పుస్తకం

ఒంటరి గానం కాదు. సామూహిక గీతం.

ఏ బిందువు దగ్గర మొదలు పెట్టాలో తెలిస్తే చివరాఖరి వాక్యమేదో స్పష్టమౌతుంది. ఆరంభం, కొనసాగింపు తేలికయిన విషయం కాదు. విరసం ఆరంభం కూడా ఆలా జరగలేదు. నిరసన, ఆగ్రహ ప్రకటన ద్వారా మాత్రమే విప్లవ రచయితల సంఘం ఏర్పడలేదు. ఒక నిర్మాణం వెనుక అచంచల విశ్వాసం, నిమగ్నత మాతమ్రే సరిపోదు. ప్రజల నుండి ప్రజలకు ప్రవహించే సన్నటి నీటిధార అనేక దాహార్తులను తీర్చుతూ, అనేక ఖాళీలను పూరిస్తూ సాగవలసి ఉంటుంది. ఈ నడకలో కొన్ని ఖాళీలు కొత్తగా కనబడవచ్చు. దేనికయినా అన్వేషణే ముఖ్యం. విరసం యాభై ఏళ్ల సందర్భంగా పర్‌స్పెక్టివ్‌ ప్రచురణగా ‘50 ఏళ్ల విరసం పయనం ప్రభావం’
సాహిత్యం కొత్త పుస్తకం

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసుపెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది. వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో
సాహిత్యం కొత్త పుస్తకం

విధ్వంస, నిర్మాణాల కొత్త ప్రపంచపు కథలు

ఇవి ఈ తరం విప్లవ కథలు. సరిగ్గా ఇప్పటి మనందరి జీవితానుభవంతో సరిపోలే కథలు. మన అనుభవ పరిధికి ఆవల ఉన్న వాస్తవికతలోకి మనల్ని నడిపించే కథలు. అదే ఈ కథల ప్రత్యేకత. ఇందులో పదకొండు కథలే ఉన్నాయి. ఇవన్నీ విప్లవ దృక్పథ వైశాల్యాన్ని చూపిస్తాయి. ‘కొన్ని రంగులు ఒక కల’ అనే కథతో పావని కథా రచనలోకి అడుగుపెట్టింది. విరసం నిర్వహిస్తున్న కథల వర్క్‌షాపులు కథకుల కలయికకు, అభిప్రాయాల కలబోతకే పరిమితం కాకుండా కొత్త కథల, కథకుల తయారీ కేంద్రాలనడానికి ఒక ఉదాహరణ పావని. సాహిత్యం, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలపట్ల ఇష్టంతో పావని సాహిత్యోద్యమంలోకి వచ్చింది. తన
సాహిత్యం కొత్త పుస్తకం

ఒక పల్లెటూరి పిల్ల ప్రయాణం

గత పది సంవత్సరాలుగా కథలు రాస్తున్న పావని తన కథల సంకలనానికి ముందు మాట రాసివ్వమని అడిగింది. పావని వయస్సు రీత్యా మా చిన్నమ్మాయి తోటిది. విరసం సభల్లో, కథల వర్క్‌ షాపుల్లో ఇప్పటి యువతరపు ప్రతినిధిగా పరిచయం. వాళ్ల తాతది మధ్యతరగతి పై కులపు వ్యవసాయ కుటుంబం. కడప జిల్లాలోని పులివెందుల. గిట్టుబాటు కాని వ్యవసాయ గ్రామాల్లో ఊపిరిసలపనివ్వని భూస్వామిక ముఠా తగాదాలు, 1947లో అధికారమార్పిడి జరిగిన తర్వాత పల్లెల్లోకి అందివచ్చిన పాఠశాలలు, పావని తండ్రి చదువుకుని ఉద్యోగస్తుడిగా ప్రొద్దుటూరుకు మారారు. అప్పటికే పల్లెలనొదిలి పట్నాలలో స్థిరపడ్డ కుటుంబానికి చెందిన పావని అమ్మగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అంటే
సాహిత్యం కొత్త పుస్తకం

లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు. ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు
సాహిత్యం కొత్త పుస్తకం

ఇసుకపర్రల్లో చెరిగిపోతోన్న పాదముద్రలు

నీ మూలం యెక్కడనది నవ్విందికాగజ్ దిఖావోనది నడక ఆపిందివెనక్కి పోనది అదృశ్యమైంది మనిషి కూడా నదిలా ప్రవాహశీలే . పుట్టిన చోట మనుషులు యెవరూ పాతుకుపోయి వుండరు. పొట్ట చేతబట్టుకుని పక్షుల్లా పలుదెసలకు పయనిస్తారు.  వలసపోతారు (అందరం అమ్మ కడుపునుంచి భూమ్మీదకి వలస వచ్చినవాళ్ళమే. కాకుంటే సామ్రాజ్య విస్తరణవాదుల ఆధిపత్య వలసలు వేరు; శ్రమజీవుల పొట్టకూటి వలసలు వేరు). అలా బెంగాల్ నుంచి అస్సామ్ బ్రహ్మపుత్ర పరివాహ ప్రాంతాలకు బ్రిటిష్ పాలకులు రవాణా చేస్తే కూలీలుగా వలస వచ్చిన ముస్లింలు  మియాలు. మేం మియాలం కాదు అసోమియాలం అంటారు వాళ్ళు( నేను చారువా (ఇసక మేటవాసి) ని కాను,
సాహిత్యం కొత్త పుస్తకం

వాలని మబ్బులు- వానమెతుకులు

రాయ‌ల‌సీమ రైతు క‌థ‌లు సంక‌ల‌నానికి శ్రీ‌నివాస‌మూర్తి రాసిన ముందుమాట‌ నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి 'అమ్ముకునే' పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే "అరటిపండ్లేయ్!" అంటూ బస్సును  చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి