వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ
వ్యాసాలు

నిండైన ఆలోచనాపరుడు రామ్మోహన్‌సార్‌

పాణి           రామ్మోహన్‌ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు.  తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ   ప్రపంచ కల్లోలాలపై  వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది.             మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన  ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో
వ్యాసాలు

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసమే యుద్ధం

ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
వ్యాసాలు

భారత రాజ్యాంగం వైరుధ్యాల పుట్ట

(రాజ్యాంగంపై  అనేక వైపుల నుంచి చ‌ర్చ జరుగుతున్న‌ది.  దీనికి అమ‌రుడు ప్రొ. శేష‌య్య‌గారు రాసిన ఈ వ్యాసం  త‌ప్ప‌క దోహ‌దం చేస్తుంది.  చారిత్ర‌కంగా రాజ్యాంగం రూపొందిన తీరును ఈ వ్యాసంలో ఆయ‌న వివ‌రించారు.  మ‌న సామాజిక ప‌రివ‌ర్త‌న‌లో రాజ్యాంగానికి ఉండ‌వ‌ల‌సిన పాత్ర‌ను ఎత్తిప‌డుతూనే ఆందులో ఎన్నెన్ని వైరుధ్యాలు ఉన్న‌దీ విశ్లేషించారు.  రాజ్యాంగ ప‌రిశోధ‌కుడిగా, న్యాయ‌శాస్త్ర ఆచార్యుడిగా, పౌర హ‌క్కుల ఉద్య‌మ నాయ‌కుడిగా ఆయ‌న ప‌రిశీల‌న‌లు  ఇప్ప‌డు జ‌రుగుతున్న చ‌ర్చ‌కు  కొత్త కోణాలు ఆవిష్క‌రిస్తాయ‌ని పున‌ర్ముద్రిస్తున్నాం.. వ‌సంత‌మేఘం టీ) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్క్స్ వివరిస్తూ *ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు,
వ్యాసాలు

మేధావి, సృజనశీలి కామ్రేడ్ మిళింద్

18 నవంబర్‌ 2021 మహారాష్ట్రలోని గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు జిల్లా గడ్‌చిరోలీలోని ధనోరా తాలూకా గ్యారపత్తి పోలీసు స్టేషన్‌ పరిధిలోకల మర్దిటోల అడవిలో 10 గంటలకు పైగా జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్‌ దీపక్‌ (మిలింద్‌ బాబూరావ్‌ తేల్తుంట్లే) సహ 27 మంది కామ్రేడ్స్ అమరులైనారు. శతృవుతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరయోధులకు వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు చెపుదాం. చెరిగిపోని అమరుల జ్ఞావకాలలో మునిగిన వారి బంధుమితృలంతా ఈ విషాదకర సమయంలో నిబ్బరంగా నిలువాలనీ
వ్యాసాలు

చట్టాల ద్వారా ప్రజాస్వామ్యం పై దాడి

భూస్వామ్య సమాజం నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ నడపడానికి చట్టాల నిర్మాణం జరిగింది. కానీ దీంతో పాటు పాలకులు తమ అధికారాన్ని నిలుపుకోడానికి చట్టాలను  ఉపయోగించుకున్నారనేది కూడా వాస్తవం. భారత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ యుఏపిఏ చట్టం సందర్భంలో  ‘అనేక సార్లు చట్టం స్వయంగా చట్టాన్నే అవహేళన చేస్తుంది’ అని అన్నారు. యుఏపిఏ, దేశద్రోహ చట్టాల సందర్భంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ కూడా ‘భారత పౌరుడు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలంటే ఈ చట్టాల్ని మార్చాల్సిన అవసరం వుంది’ అని అన్నారు. దేశంలోని అనేక మంది మేధావులు, రాజ్యాంగ పండితులు,
వ్యాసాలు

రెండు ఇంజన్ల ప్రభుత్వ ఆర్ధిక స్థితి లో మోడీ-యోగీ ప్రభుత్వం 

 ‘అందరి వెంట, అందరి అభివృద్ధి’ అనే నినాదంతో తన రాజకీయాధికారాన్ని ప్రారంభించిన బిజెపి ప్రభుత్వం గత అయిదు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికి చేర్చింది అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తలసరి ఆదాయం: 2020లో ఉత్తరప్రదేశ్  మొత్తం జనాభా దాదాపు 23కోట్లు వుంది. ఆదాయ వార్షిక సంవత్సరం 2011-12లో  2015-16, 2016-17లలో దాదాపు 12 శాతం వుండిన స్థిరమైన విలువ అభివృద్ధి రేటు సగటు 4శాతానికి పడిపోయింది. మొదటి రెండు సంవత్సరాలలో 8 నుంచి 10 శాతం వుండిన తలసరి ఆదాయం పడిపోయి 4 శాతం అయింది. ఆ తరువాత 2.4 నుంచి 4.4 మధ్య
వ్యాసాలు

ఆదిత్యనాథ్ ప్రభుత్వ రిపోర్టు కార్డ్

ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో
వ్యాసాలు

బోనులో మోడీ సర్కార్‌

పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి సుప్రీంకోర్టుకు సైతం చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' ''ది బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్‌ మోస్టు పవర్‌ఫుల్‌ సైబర్‌ వెపన్‌'' అనే టైటిల్‌తో బాంబు పేల్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు జనవరి 28న సునామీలా మోడీ ఫ్రభుత్వంపై పడింది. మోడీ సర్కార్‌ నిజ స్వరూపం బయటపడి కన్నంలో దొంగలా పట్టుబడినట్టైంది. ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజలపై నిఘా పెట్టేందుకు పెగాసస్‌ను మోడీ సర్కార్‌ కొనుగోలు 2017లో చేసింది. పెగాసస్‌ కోసం ఎన్‌ఎస్‌వోతో