వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల
వ్యాసాలు

స్మృతి చిహ్నాలతో మన ప్రయాణం – రాజ్యం నిర్భంధం.

ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి
వ్యాసాలు

భద్రతా బలగాలు వైమానిక  బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?

ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు
వ్యాసాలు

మనువాదం వర్సెస్ డార్విన్ జీవపరిణామ వాదం

(ఈ వ్యాస రచయితల్లో ఒకరైన కోట ఆనంద్ ను  ఏప్రిల్  28  తెల్లవారుజామున  3.00 గంటలకు  పోలీసులు అక్రమంగా  అరెస్ట్ చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీ లో పరిశోధన విద్యార్థి గా విద్యారంగ సమస్యలపై , సామాజిక సమస్యలపై వివిధ దిన, మాస పత్రికలలో   రచనలు చేశారు. వసంత మేఘంలో కూడా ఆనంద్ వ్యాసాలు అచ్చయ్యాయి . అరెస్టుకు ముందు ఆయన ఆవుల నాగరాజుతో కలిసి ఈ వ్యాసం రాశారు ) దేశంలో నేడు విద్య ప్రవేటీకరణ, విద్య కాషాయీకరణ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయి. భాజపా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా ప్రవేటీకరణను తీవ్రం చేయడానికి పూనుకున్నది.  రెండవసారి
వ్యాసాలు

‘స్టాలిన్‌యుగం’లో ఇండియా

రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్‌ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్‌ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్‌.రాయ్‌ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్‌ హ్యూమనిస్ట్‌పార్టీ పెట్టి వేరుపడ్డాడు.  అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్‌ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్‌ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు
వ్యాసాలు

ఎన్‌కౌంటర్‌లలో న్యాయ వ్యవస్థ జోక్యం

ఉమేష్ పాల్ హత్య నిందితుడు, మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుండి తన ప్రాణ రక్షణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వీకరించడానికి గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తరువాత ఆ రాష్ట్ర పోలీసులే  అతని కొడుకును ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు, ఆ తర్వాత అతనితో పాటు అతని సోదరుడిని పోలీసు కస్టడీలో వుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై విచారణకు విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు
వ్యాసాలు

మోడీ అమ్ములపొదిలో మరోస్పైవేర్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం  పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్‌ కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్‌ స్పైవేర్‌ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ
వ్యాసాలు

నాణేనికి ఒకవైపు

వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు  నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ   న్యాయ స్థానం,పోలీసులు ఒక  సాకు మాత్రమే.                                                    2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ
వ్యాసాలు

నిరంతర శ్రామికవర్గ పోరాట స్ఫూర్తే మేడే

పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమిస్తూ ఉండేవారు. ఆనాడు శ్రమ జీవులపై పనిభారమే కాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేది. వారు రోజూ 16 గంటలు శ్రమించేవారు. కొంత మంది పెట్టుబడి దారులు కార్మికులచేత రోజూ 20 గంటలు కూడా పని చేయించేవారు. పారిశ్రామికాధిపతులు శ్రమజీవులకు అతి తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఆనాడు ఫ్యాక్టరీలలో శ్రామికులకు ఎటువంటి భద్రతగానీ, సౌకర్యాలుకానీ ఉండేవి కావు. ఫ్యాక్టరీలలో గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ ఉండేది కాదు. అందుచేత తరచుగావారు ప్రమాదాలకు గురై మరణిస్తుండేవారు. కార్మికులు
వ్యాసాలు సంభాషణ

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి