వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి
వ్యాసాలు

దండకారణ్య ఉల్‌గులాన్‌కు జేజేలు

ఉల్‌గులాన్‌ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్‌గులాన్‌. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో  దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది,  తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే
వ్యాసాలు

అప్పర్ భద్ర సరే.. రాయలసీమ ప్రాజెక్టుల మాటేమిటి ?

అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై నేడు ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తెలియజేస్తున్న నిరసనలు “తానాడలేక మద్దెలవోడు అన్నట్లు” అనే  సామెతను గుర్తుకు తెస్తున్నాయి.  కె సి కాలువకు  కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకొనేoదుకై  గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రయత్నించకపోగా, 2015 లోనే దానికి వివరమైన ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను ఆ నాటి కృష్ణా బోర్డ్ కు సమర్పించినా, డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర జల కమీషన్ కు తెలిపిన ప్రబుద్ధులు    మన అధికారులు. అంతేకాదు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగానైనా 2019 మార్చి లో   గుండ్రేవులకు చంద్రబాబు నిధులు కేటాయించారు. అయితే రద్దుల జగనన్న దాన్ని తుంగలో తొక్కాడు. దానిపై  స్పoదించిన
వ్యాసాలు

‘బస్తర్‌లో ఆదివాసీ మహిళలకు స్వేచ్ఛ లేదు’- సోనీ సోరీ

భారతదేశం మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో చాలా కాలంగా ఖనిజాల దోపిడీ విపరీతంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. పెట్టుబడిదారులకు ఈ దోపిడీని సుసాధ్యం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశమంతటికన్నా అత్యధిక సంఖ్యలో అర్ధ సైనిక బలగాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన ఈ సైనిక బలగాలు ప్రభుత్వ విధానం ప్రకారం ఆదివాసీల ధైర్యాన్ని దెబ్బతీయడానికి మహిళలపై లైంగిక దాడులు చేస్తాయి. బస్తర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా స్వయంగా శారీరక రాజ్య హింసను భరించింది. మహిళా దినోత్సవం
వ్యాసాలు

ఫాసిజం గురించి ఎన్నికల పార్టీలకు తెలుసా ?

గత సంవత్సరం ఒక--ఆన్ లైన్ పత్రికలో - ఆర్ ఎస్ ఎస్ ప్రారంభానికి ముందు మూంజే ఇటలీ పర్యటన, అక్కడి నుండి వచ్చి నాగపూర్ వెళ్ళి హెడ్గెవార్ ను కలవడం గురించి రాశారు. ఇండియాలో ఆర్ ఎస్ ఎస్ మూలాల పైన  ఇర్ఫాన్ హబీబ్ లేదా షంసుల్ ఇస్లాం వంటి వారి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. బీజేపీ రాజకీయ నాయకులు తరుచుగా తమది సైద్ధాంతిక సంస్థ అనీ చెప్పుకుంటూ ఉంటారు . ఆర్ ఎస్ ఎస్ దాని అనుబంధ సంస్థలు సంపూర్ణ ఆధిపత్యంతో పురోగమిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు రాజకీయాలను, దాని ఫాసిస్టు సైద్ధాంతిక
వ్యాసాలు

పాట పాడితే నోటీస్‌

‘యిళ్ల నుంచి వెళ్లగొట్టడంపై పాట పాడినందుకు యూపీ పోలీసు నోటీసు యివ్వడం సరైనదా కాదా అని ప్రజలు నిర్ణయించాలని కోరుకుంటున్నాను’ - నేహా సింగ్‌ రాథోడ్‌ ఉత్తర ప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత వెనుక ఉన్న రాజకీయాలు బుల్డోజర్‌ సంస్కృతిగా దేశవ్యాప్త ప్రచారమైంది. అలాంటి ఒక ఘటనపై భోజ్‌పురి ప్రసిద్ధ జానపద గాయని నేహా సింగ్‌ రాథోడ్‌ (24సం)కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆమె రాజకీయ స్పృహతో జానపద పాటలు పాడే  గాయని.             ఫిబ్రవరి 15న కాన్పూర్‌ (రూరల్)లోని మదౌలీ గ్రామంలో ఆక్రమణల వ్యతిరేక చర్యలో 44 ఏళ్ల ప్రమీలా దీక్షిత్‌,  19 ఏళ్ల ఆమె కుమార్తె సజీవ
వ్యాసాలు

ఫాసిజానికి వ్యతిరేకంగా స్టాలిన్

ఫాసిజం పుట్టుకను అర్థం చేసుకోవాలంటే ముందు పెట్టుబడిదారీ విధానం ఏ దశల గుండా ప్రయాణించినదీ తెలుసుకోవాలి.   పెట్టుబడిదారీ విధానానికి రెండు దశలున్నాయి:  స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ  అయిన గుత్త పెట్టుబడిదారీ విధానం. స్వేచ్ఛా పోటీ ఉన్న పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా పోటీ పడుతూ ఉత్పత్తి చేస్తుంటారు. ఈ పోటీలో కొంతమంది వెనుకబడిపోతారు, కొంతమంది నాశనమైపోతారు. మరికొంతమంది క్రమంగా సంపదలను కూడబెట్టి గుత్త పెట్టుబడిదారులుగా ఎదుగుతారు. ఈ విధంగా పెట్టుబడిదారీ విధానం క్రమంగా అభివృద్ధి చెందుతూ తన అత్యున్నత దశ అయిన సామ్రాజ్యవాద దశను చేరుకుంటుంది.20వ
వ్యాసాలు

ప్రజలపై యుద్ధం – రిపబ్లిక్‌ తన పిల్లలను తానే చంపుకుంటున్నది

రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, దాన్ని విలువలేని దానిగా మార్చివేస్తూ రాజ్యాంగాన్ని విశ్వసించని వాళ్ళని మాత్రం నేరస్తులుగా పరిగణించే స్థితికి ప్రజాస్వామిక వ్యవస్థ దిగజారిపోయింది. రాజ్యాంగం గురించి ప్రజల్లి మాట్లాడకుండా చేయడమే కాదు, మాట్లాడిన వాళ్ళందరిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తూ అవసరం అనుకుంటూ అర్బన్‌ నక్సల్‌గా ప్రకటించే సంస్కృతి కొనసాగుతుంది. ప్రజా పోరటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్ని కేవలం చట్టాల వరకే పరిమితం అయ్యాయి. ఆచరణ అంతా పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవస్థ నడవాలనే స్థితిలో నేరస్తులే దొరలుగా కీర్తించబడుతున్నారు. న్యాయం కోసం నిలబడ్డవారు నక్సలైట్‌గా ముద్రవేసుకోబడి కాల్చివేయబడుతున్నారు. ప్రజా
వ్యాసాలు

రాజకీయార్థిక విధానం-బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం

బ్రాహ్మణీయ హిందూత్వ పుట్టుకకు అర్థభూస్వామ్య అర్థవలస సామాజిక ఆర్థిక వ్యవస్థే పునాది. పెటీబూర్జువా ఫాసిజం కన్నా బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం భిన్నమైనది. ఇది కులవ్యవస్థను నూతన రూపంలో బలోపేతం చేసే భూస్వామ్యతరహా ఫాసిజం. హిందూత్వ అంటే, రూపంలోనూ సారంలోనూ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని కలిగి ఉండే హిందూమతంలో ఏకరూపతను సాధించడం. భారత సమాజంలోని ప్రత్యక్ష, పరోక్ష వైరుధ్యాల ఫలితంగా ఏర్పడిన భౌతిక పునాదే పై కేంద్రీకరణను ఉత్పన్నం చేస్తుంది. సామాజిక నిర్మితిని సామాజిక, ఆర్థిక సంబంధాల రూపవ్యక్తీకరణే హిందూ సామాజిక నిర్మాణం. కాబట్టి హిందూత్వ ఫాసిజపు పుట్టుకను, పెరుగుదలను అర్థం చేసుకోవాలంటే దాన్ని సృష్టించిన భౌతిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
వ్యాసాలు

స్టాలిన్-  ఫాసిస్టు వ్యతిరేక అవగాహన

ఫాసిజం అనే పదం దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగి వున్నది. ఈ పార్టీని మొదటగా ముసోలిని ఇటలీలో ప్రారంభించాడు. హిట్లర్ జర్మనీలో ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకారిగా పరిణమించిన రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారు. వీరి కూటమిని ఓడించేందుకు ప్రపంచమంతా ఒకటయింది , ఆ మహా కూటమిలో ప్రత్యర్థి వ్యవస్థలైన సోవియెట్ వ్యవస్థ,పెట్టుబడిదారీ వ్యవస్థ తాత్కాలికంగానైనా ఒక్కటయినాయి. ఆ ఐక్యసంఘటన ఏర్పడకపోతే ప్రపంచం ఏమైపోయేదో ఆలోచించలేము. పెట్టుబడిదారీ దేశాల వైపునుండి ఆలోచిస్తే ఆ కూటమే వారిని వినాశనం నుండి రక్షించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ ప్రజలదే అసమాన త్యాగం. ప్రారంభంలో హిట్లర్