వ్యాసాలు

Who is Amit Shah to Decide How Telangana Should Be?!

Union Home Minister Amit Shah came to Nizamabad on Sunday to unveil D. Srinivas's statue and announce Turmeric Board. But during his public meeting, he made inappropriate references to the Naxalites and to Telangana. He issued direct warnings to the Telangana government, specifically naming Chief Minister Revanth Reddy. The time when people could simply ask whether it is proper to make political statements or issue crude threats during an official
వ్యాసాలు

నేర్చుకోవలసిన పాఠం

(ఇటీవల విడుదలైన కామ్రేడ్ కె ఎస్ *కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర*కు రాసిన ముందు మాట ) నక్సల్బరీని తిరిగి నిర్మించుకునే క్రమంలో క్యాడర్‌కు కె.ఎస్‌.చెప్పిన పాఠాలివి. ఆనాటికుండిన సాంకేతికతను ఉపయోగించుకుని లోచర్ల పెద్దారెడ్డి కె.పస్‌. చెప్పిన పాఠాన్ని అక్షరీకరించారు. ఈ పాఠం రెండు భాగాలుగా వెలువడనుంది. దాదాపు ఎనభైయవ దశకం ప్రారంభంలో కొత్తగా పార్టీ నిర్మాణంలోకి వచ్చిన వారికి చెప్పిన పాఠమైనా ఇవ్వాల్టికీ దీని ప్రాసంగికత వుంది. కమ్యూనిస్టు పార్టీలు కృశ్చేవ్‌ శాంతి మంత్రాన్ని పఠిస్తూ వర్గ పోరాటాన్ని మరచిపోయి, రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఎరుకను మరచి ఆర్థిక పోరాటాలకు పరిమితమైన కాలంలో నక్సల్బరీ ఉద్యమం ఆరంభమైంది. అనేక
వ్యాసాలు

జనతన రాజ్యంలో కా . గౌతమ్

(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో  ఉండగానే కామ్రేడ్‌ గౌతం కనిపించాడు. ఆయన విప్లవోద్యమంలో సీనియర్‌ నాయకుడు. నేను అక్కడికి వస్తానని ఆయనకు ముందే తెలుసు. నన్నెంతో ఎరిగినవాడివలె ఆలింగనం చేసుకొని నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు. అందులో ఎన్నో పరామర్శలు. నా ప్రయాణంలో పార్టీ నాయకులు ఎవరెవరు కలుస్తారో నాకెలాంటి ఊహ కూడా లేదు. అయితే నేను విని ఉన్న వాళ్లెందరినో కలవాలనే ఆశ ఉండేది. అయితే ఇన్ని రోజుల్లో అలాంటివారేమైనా కలుస్తారా? అని నేను కామ్రేడ్‌ ఇడిమెను ప్రత్యేకించి
వ్యాసాలు

ఆపరేషన్ కర్రెగుట్టలు – సఫలమా? విఫలమా?

2025 మే 14నసి‌ఆర్‌పి‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఏప్రిల్ 21 నుండి 21 రోజుల పాటు జరిపిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రధానంగా నెరవేర్చామనీ, అమిత్ షా ప్రకటించినట్లు 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టించి తీరుతామని ప్రకటించారు. ఈ పత్రికా సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాను ఆహ్వానించారు. ఆ ప్రెస్ మీట్ లో పేర్కొన్న ముఖ్య అంశాలు: 1. ఆపరేషన్ కర్రెగుట్టలు విజయవంతమైంది. మొత్తంగా 31 మంది మావోయిస్టులను తుదముట్టించాము. 2. 450 ఐ‌ఈ‌డి లను నిర్వీర్యం చేశాము.
వ్యాసాలు

ఆదర్శమే అందం నిత్య నిర్వచనం  

స్త్రీ అంటే శరీరం కాదు అనుభవించే హృదయం, ఆలోచించే మెదడు ఉన్న మానవజీవి అని నమ్మే  వ్యక్తుల, సంస్థల తీవ్ర  నిరసనల మధ్య మరే ప్రజోపయోగ కార్యక్రమాలు లేవన్నట్లు తెలంగాణ ప్రభుత్వం  హైద్రాబాద్ లో ఈ ఏడాది మే7 నుండి  72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించ తల పెట్టింది. దీనిని తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టగల ఉత్సవంగా చూస్తూ 200కోట్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయింది. ఈ సందర్భంలో అందం గురించిన, శాస్త్రీయమైన , మానవీయమైన అవగహన కోసం  నిత్య వ్రాసిన “అందం - ఆదర్శం”  అనే కవితను పరిచయం చేయాలనిపించింది.  నిత్య కలం పేరు. తల్లిదండ్రులు పెట్టిన
వ్యాసాలు

హిమాలయోన్నత అమరత్వం నంబాళ కేశవరావుది.

పీడిత ప్రజలకు కలలు కూడా ఉండకపోవచ్చు. వాళ్లు అనుభవిస్తున్న అమానవీయమైన అణిచివేత, హింస, దోపిడీ నుంచి వాళ్లకు కన్నీళ్లు కార్చే సమయమూ, అవకాశమూ ఉండకపోవచ్చు. దోపిడీ సమాజం ఆ ప్రజల దేహాలను, మనసులను పిండి పిప్పి చేస్తుంటే వాళ్ల నెత్తురు చెమటయి కారడమో, చిత్రహింసలతో నెత్తురై కారడమో తప్ప ఎండిపోయిన కళ్ళల్లో నుంచి కూడా కన్నీళ్లు కారే అవకాశం లేకపోవచ్చు. గొంతులో తడి మిగిలితే కదా గాద్గదికంగా దుఃఖించడానికి. కానీ ఇవ్వాల్టి సమస్య కాదు. స్పార్టకస్‍ కాలానికి పీడితులైన, దోపిడీకి గురైన బానిసలకు మొదటిసారి తాము బానిసలుగా చూడబడుతున్న మనుషులమని తెలిసి వచ్చింది. ఆ తెలిసి రావడం కన్నా
వ్యాసాలు

ప్రజా యుద్ధ సేనాని 

తూచడానికి, కొలవడానికి కొందరు సిద్ధమవుతారు. గొంతులు పిక్కటిల్లేలా రోదించేవారు కచ్చితంగా చాలా మందే ఉంటారు. ఎందుకిలా జరుగుతున్నదో ఒకసారి తరచి చూసుకోమని మైత్రీ పూర్వక సూచనలిచ్చేవాళ్లూ ఉంటారు. బహుశా ఎంతో కొంత దు:ఖపుతడి సోకని వాళ్లెవరుంటారు?  అలాంటి సందర్భం మరి. ఎంత అద్భుత జీవితం! ఆయన చుట్టూ చేరి గభాల్న ఏదో ఒక మాట అనడం, రాయడం సాధ్యమయ్యేదేనా?   చనిపోయింది వ్యక్తిమాత్రుడు అయితే గుణగానం చేసి సర్ది చెప్పుకోవచ్చు  ఇది ముగింపు అయితే ఇంకేమీ లేదని నిరాశతో సరిపెట్టుకోవచ్చు. మావోయిస్టుపార్టీ కేంద్ర కార్యదర్శి అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశ ప్రజలు గడించిన   పోరాట అనుభవం. వాళ్ల ఆచరణలో
వ్యాసాలు

హింస – అహింస – ప్రతి హింస

"న్యాయమూ, ప్రేమ లేకుండా శాంతి ఎల్లప్పుడూ గొప్ప భ్రాంతి మాత్రమే”- బెల్జియన్ ఆర్చి బిషప్ హేల్దేర్ కెమరా •             (Without justice and love, peace will always be a great illusion)  హింస- అహింస- ప్రతి హింస లపై చర్చ ఈ నాటిది కాదు. అసలు హింస లేనిదేనాడు? దానికి ప్రతిగా హింసా భాధితుల ప్రతిహింస లేనిదేనాడు? రూపంలో చాలా మార్పులు జరిగివుండవచ్చు. పీడకుల హింస, పీడితుల ప్రతిఘటన- శ్రీ శ్రీ అన్నట్టు “ ఏదేశ చరిత్ర జూచినా ఏమున్నది గర్వకారణం ”.  మనదేశ చరిత్రలో ఇతిహాసాలు,పురాణాలన్నింటా హింసాత్మక సంఘటనలే? ఆయుధం లేని దేముడున్నాడా? అయితే,మనం
సాహిత్యం వ్యాసాలు

మనిషితనంపై విశ్వాసంతో

(ఇటీవల విడుదలైన బాల సుధాకర్ మౌళి కథా సంపుటికి రాసిన ముందుమాట) కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్  మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువల్ని  అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే  రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తి గొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది.  కథలో కవిత్వ చ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే
వ్యాసాలు

ఆపరేషన్ కగార్‌ను ఆపాలి; వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి

2025 ఏప్రిల్ 9 భారత రాజ్యమూ, తమ పార్టీ మధ్య శాంతి చర్చలు జరగాలని కోరుతూ సిపిఐ (మావోయిస్ట్) పార్టీ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసిందని 2025 ఏప్రిల్ 3 నాడు ది హిందూ వార్తా పత్రిక ప్రచురించింది. మావోయిస్టులు ముందుగా చొరవ తీసుకుని శాంతి చర్చలకు పిలుపునిచ్చినందుకు విప్లవకారులుగా, ప్రజానుకూల, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన వ్యక్తులుగా మనం అభినందించాలి. శాంతి చర్చలకు పిలుపునిచ్చింది ఆపరేషన్ కగార్ కింద “దహనం చేసిన భూమి విధానాన్ని” అనుసరించాలని ఎంచుకున్న భారత రాజ్యం కాదు, "యుద్ధం చేసే" పార్టీ అనే విషయాన్ని ఇది మన దృష్టికి తీసుకువస్తుంది. (1.