ఆదివాసీ యువ నేత అరెస్టు
ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తూ, ఛత్తీస్గఢ్లోని బస్తర్లోని ఖనిజ సంపన్న ప్రాంతానికి చెందిన ఆదివాసీ హక్కుల కార్యకర్త రఘు మిడియామిని ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)ను ఉపయోగించి అరెస్టు చేసింది. గోండ్ ఆదివాసీ సమాజానికి చెందిన 23 ఏళ్ల రఘుని నిన్న (ఫిబ్రవరి 27) సాయంత్రం అదుపులోకి తీసుకున్న తర్వాత ఈరోజు ఎన్ఐఎ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి, జగదల్పూర్ జైలుకు పంపారు. రఘు నిషేధిత ఫ్రంట్ సంస్థకు అగ్ర నాయకుడు అని, ఈ సంస్థకు నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధం ఉందని ఎన్ఐఎ ఆరోపిస్తోంది. తమ మాతృభూమిని భారత రాజ్యం కార్పొరేటీకరణ,