వ్యాసాలు

హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం.  ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,
కవిత్వం

 మౌమిత ఆలం కవిత్వం

1.స్నేహితుడా..నేను నీ శత్రువుని నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ సజీవంగా ఉండే నీ మాటలను స్పృశించడంలో విఫలమవుతున్నాను. మీ భూమి నుండి నేను సంవత్సరాలుగా పావుకున్న పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను ఈ మాటలు నాకు మిగిల్చాయి. నీ పదజాలంలో నే చొప్పించిన నల్లటి పదాలు పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి. నేను లైటు ఆపేస్తే అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి. సమాధానాల కోసం నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి. నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను, ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని ఇతరుల మీదకు తోస్తాడు. గొంతు
కవిత్వం

పదేళ్ల పచ్చి గాయం

ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి వచ్చిన పిల్లాడి లంచ్ బాక్స్ అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు అంతా తత్తరపాటు అప్పటికి విన్న ఆమెకది పగటి కలే కావచ్చు ముఖ పరిచయమే లేని నాకు మాత్రం ఎండిన నాలుకపై తెప్పరిల్లే చిన్న వాన చినుకు అతగాడికి కాగితాలకందని శిక్ష వెయ్యాలని తీర్పరి చెరకుగడ పిప్పిగా పాఠాన్ని నములుతూ పోతుంటాడు శూన్యం కుమ్మరించిన నేలపై ఒకరి కళ్లను మరొకరు ఫొటోగ్రాఫ్ చేస్తూ
సంభాషణ

సమ్మక్క జాతర – తమ్ముని యాది

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ...  మా వూరికి దక్షిణ శివారులో పాలాగు ఒడ్డున  సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నది. నేను నా భార్య, ఇద్దరు పిల్లలు, అవ్వ-నాన్న కలిసి జాతరకు  ఎల్లినం .  వన దేవతలకు మొక్కులు చెల్లించి ఒక కోన్ని కోసి అక్కన్నే చెట్లల్ల వండుకున్నం. రాత్రి 8 గంటలు అయితంది.. పల్లెం లో అన్నం కూర పెట్టుకుని తింటున్న.  పిండారపోసినట్టు తెల్లని వెన్నెల  కురుస్తంది. స్టీల్ పల్లెం పై ఆ వెన్నెల  పడి మెరుస్తంది. ఈ టైంలో తమ్ముడు  ఏమి చేస్తున్నట్లు? ఎక్కడ వున్నట్లు? ఒక్క సారిగా మనసు తమ్ముని మీదికి పోయింది. కోర
stories

Gift

My darling boy!! How are you? I am conversing with you in this fashion after a long time …… Unfortunately, we cannot meet. So, you must be thinking that you are entitled to at least a letter from me. But, what can I do? There is too much of work pressure! I decided to write a letter to you today as it is your birthday. You must have celebrated your
కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు
కవిత్వం

దేని గురించి మాట్లాడగలను

ఈ రోజు దేని గురించి మాట్లాడగలను మరణాల గురించి తప్ప పాలస్తీనాలో పసికందుల మరణాల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను దండకారణ్యం గురించి తప్ప ఆకాశం నుండి నేలతల్లి ఒడిలోని ఆదివాసీ పసిపాపలపై జరుగుతున్న బాంబు దాడుల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను బుల్డోజర్ దాడుల గురించి తప్ప మసీదుల కింద తవ్వుతూ కొత్తగా లేని ఆనవాళ్ళేవో దొరికాయని కూల్చి వేసే కుట్రల గురించి తప్ప ఈ రోజు దేని గురించి మాట్లాడగలను రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోరితే కాల్పులు జరుపుతున్న వాడి నైజాన్ని గురించి తప్ప
వ్యాసాలు

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి ఉందని  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అనింది. అంటే పదేళ్లపాటు ప్రజాస్వామ్యంపట్ల ఖాతరు లేని బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఒకటికి రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిందని అర్థం. ప్రజాస్వామ్యం ధ్వంసమైపోయి కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే మిగిలింది.  దాని ద్వారా ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వచ్చిన పార్టీ భారతదేశాన్ని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని మరే పార్టీకంటే ఎక్కువ కాలం పాలించింది. బిజెపిని మినహాయిస్తే మరే పార్టీకంటే ఎక్కువ దుర్మార్గాలకు, ప్రజా వ్యతిరేకత చర్యలకు పాల్పడిన గతం కాంగ్రెస్‌కు ఉన్నది. అలాంటి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సి
కవిత్వం

సరోజ్‌దత్తా కవితలు

1969 ఏప్రిల్‌ 22న లెనిన్‌ శతజయంతి రోజు ఏర్పడిన సిపిఐఎంఎల్‌ కు సరోజ్‌దత్తా సాంస్కృతిక సేనాని. ఈ మార్చి 11న ఆయన 110వ జయంతి. సిద్ధార్థ శంకర్‌రే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను 1971 ఆగస్టు 4`5 తెల్లవారకుండానే కిడ్నాప్‌ చేసి కలకత్తా, షహీద్‌మినార్‌ మైదానంలో ఒక మూలన కాల్చి చంపిది. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన బ్రాహ్మణీయ ఫాసిస్టు వ్యతిరేక కవితలు మూడు వసంతమేఘం పాఠకుల కోసం... 1. యవ్వనం నేను చండాలుడ్ని జీవితానికి అస్పృశ్యుడ్ని ఈ శ్మశానవాటిక నుంచి జీవితాలు తమ ముగింపు చూసే చోటి నుంచి నేను చితిమంటల బూడిద నుంచి బొగ్గులు
వ్యాసాలు

మన  రైతాంగ భవితవ్యం WTO దయా దాక్షిణ్యాల్లో

విధ్వంసం  విధ్వంసం నుండి కాదు విధ్వంసం లేకుండా నిర్వహించడం సాధ్యం కాని వ్యాపార ఒప్పందాల నుండి ఉద్భవిస్తుంది. -బెర్టోల్ట్ బ్రెచ్ట్ గత 20 ఏళ్లలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడు రైతు వ్యతిరేక దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ధర్నాలో  700 మంది రైతులు అమరులయ్యారు. నవంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరపై పటిష్టమైన చట్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాడు. పేద రైతుల కోసం, దేశాభివృద్ధి కోసం ఈ చట్టాలను రూపొందించామని, కానీ వాటి