కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ కవితలు రెండు

1 రాజకీయ రాముడు వేట చూపులతో బోర విరుచుకొని ధనస్సు బాణాలతో నడి బజార్లో నిలబడ్డ రాముడి మెడలో భయం దండ పడింది అనుమాన భూతద్దాలు వచ్చాయి కలాల్ని చూస్తే గౌరీ లంకేష్ కనపడుతుంది గలాల్నిచూస్తే గోవిందు పన్సారే కల్బురిగి కనపడు తున్నారుమంటలు గాలుల్ల కవులు రచయితలు కలిస్తే పొట్టలు చీల్చిన తలలు తెగిన నరికిన తొడల రక్తింద్రియాలు కారుతూ వచ్చిన మండుతున్న అక్షరాలు మాట్లాడినట్టు అనిపిస్తుంది నడిచి నడిచి వలస ఆకలి కరోనా సాకై గంగలో గుంపులు గుంపులుగా జలచరాలు తినగా మిగిలిన ప్రవాహ శవాలు అక్షరాలై మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈశాన్య ఢిల్లీ వీధుల్లోంచి పారిన హిందూ
ఎరుకల కథలు

అన్నం పెట్టినోల్లని ..

పలమనేరులో  ఆరేడు కళ్యాణమండపాలున్నాయి.అన్నీ కొత్త పేటలోనే వున్నాయి. పాతపేటలో ఒకప్పుడు ఒక చిన్న సత్రం వుండేది, కానీ ఏవో గొడవలు, కోర్టు కేసుల వల్ల అది మూతబడింది. ఇప్పుడిక ఎవరిదైనా పెండ్లి అంటే కొత్తపేటకు వెళ్లాల్సిందే. నాలుగో నెంబరు జాతీయ రహదారి  దాటాల్సిందే. వంటమాస్టర్ ఎరుకల కపాలిని కలవాలంటే మాత్రం ఎవరైనా  పాతపేటలోని ఎస్టీ కాలనీకి రావాల్సిందే.!  కపాలి వుండేది ఎస్టీ కాలనీలోనే. ఆ మనిషి కోసం పెద్ద పెద్దోళ్ళు రోడ్డు దాటి, వీధులు దాటి ఎస్టీ కాలనీలోకి వస్తారు. మేం ఒకప్పుడు వాళ్ళ ఇండ్లల్లోకి పోలేని వాళ్ళమే అయినా,  ఇప్పుడు మా జాతోడు చేసే వంటలు అందరూ
ఆర్థికం

ఆర్థిక వృద్ధి  –  అసమాతనలు

దేశంలో ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉందని, దేశం ప్రగతి పథంలో దూసుకోపోతోందని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప వాస్తవం కాదని పలు అంతర్జాతీయ నివేదికలు ఘోషిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం తగ్గుతూ ఉన్నదని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని    మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నది. వాస్తవానికి దేశంలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారు, ధనికులు మరింతగా పెరుగుతున్నారు. ఈ అంతరం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. భారత దేశ ఆదాయం, సంపదను విశ్లేషిస్తూ మొత్తం పన్నుల వ్యవస్థను పునర్వవస్థీకరించి ధనిక కుటుంబాల నికర
కరపత్రాలు

రాయలసీమకు ఏం చేస్తారో చెప్పండి, ఓట్ల కోసం వచ్చే  వైసీపీని, టీడీపీ కూటమిని నిలదీయండి

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలకు ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని అంటారు. కానీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు రాయలసీమ సమస్యలు ఇప్పటికీ గుర్తుకు రాలేదు. ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైసీపీగాని, అంతక ముందు ఐదేళ్లు రాష్ట్రాన్ని ఏలి, మళ్లీ అధికారం కావాలనుకుంటున్న టీడీపీగాని ఫలానా రాయలసీమ ఫలానా సమస్యను పరిష్కరిస్తామని నిర్దిష్టంగా  మాట్లాడటం లేదు. రాయలసీమకు ఏ వాగ్దానమూ చేయకుండానే సీట్లు సంపాదించుకోవచ్చని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ అనుకుంటున్నాయి. ఉచితాలు, పింఛన్లు తప్ప రాయలసీమకు అతి ముఖ్యమైన నీటిపారుదల రంగం గురించి మాట్లాడటం లేదు. కరువుబారినపడి వేలాది గ్రామాలు వలస పోతున్న సీమ పల్లెల
కవిత్వం

కలగనటం తప్పు కాదుకదా!?

నన్ను పదేపదే వెంటాడుతున్నఒక అస్పష్ట పీడ కల-పోయినవారం కూడా ఇలాంటి కలేమొన్నగాక అటుమొన్న కూడా ఇలాగేనిన్నమాత్రం కొంత స్పష్టంగానే-అలౌకిక వ్యవస్థను నిలదీసి ప్రశ్నిస్తున్నందుకుబొమ్మ ముసలి ఒకటి నా కాలును నోటకరిచినడి సముద్రంలోకి లాక్కుపోయితెలియాడుతున్న రాళ్ళవంతెనపై విల్లును నిలువుగా పట్టుకున్ననామాలమనిషిని, తన బృందాన్ని చూపించినన్ను వాళ్ళకి సాగిలపడమని ఆదేశిస్తున్నట్టు-యాభైయ్యారు అంగుళాల ఛాతీతోకపట విశ్వగురువొకాయనమేధాజీవులందరినీ ఒకచోట చేర్చిఈ నేలను సస్యశ్యామలం చేస్తున్న జీవనదులన్నిటినీ తనలోకే ప్రవహించేట్లుగాప్రణాళికలు సిద్ధం చేయమనిఆదేశిస్తున్నట్లు-‘అదెలా సాధ్యం!జీవనదులు పంటచేలల్లోకి ప్రవహించాలి గానినీలోకి ప్రవహింపజేయడంకుదరదు గాక కుదరదు’ అనాలి అని అనుకుంటున్నఒక బుద్ధిజీవి మనసులోని మాటపెదవి దాటకుండానేప్రభుభక్తులు ఎట్లా పసిగట్టారోగానిఅతడి మెదడులోనిఆలోచనా తరంగాలను ఏ.ఐ. తో నిర్వీర్యం చేసినట్లు-అనేకమంది శంభూకులు,అనేకమంది
కవిత్వం

పాదాల పాదులున్నాయ్! జాగ్రత్త!!

మనంసమూహంకన్ను తెరిచినప్పుడువాడుస"మూక" ఊకైకంట్లో నలుసయ్యిండులౌకికం తెలియని నాల్కమనువు నోటితోలౌకిక విలువల వెలుగుల మీద చీకటి ఉమ్మేసిందిమెదడుసభ్యత్వ రుసుం చెల్లించికాషాయ వనంలో కండ్లు తెరిచినవాడుజ్ఞాన పుష్పం ఎలా అవుతాడు?లోచనా లోతుల్లోకి ఎందుకు తొంగి చూస్తాడు?వాడికి మనిషి కాదు మతం మృత కళేబరం ప్రధానంరాముడి పాదుకా చక్రాలుమనువుఅధర్మ రథానికి తగిలించుకొనిమతం రోడ్డు మీదుగాజనం బుర్రల్లోకి నడిపిస్తాడు వాడుమొరిగే మురుగు మోరీ నోరెళ్ళబెట్టిపండ్ల శూలాలతో కొరుకుతాడు వాడుజ్ఞానం గంగలో కలిపిశీలం చిలుక్కొయ్యలకు తగిలించిఏకతకు కాషాయం సుత్తెతో బీటలు పెట్టిఅంద భారత విద్యార్థి పరివారంసనాతన గోదాట్లో శవమై తేలుతుందిస్వైర విహారవెర్రి శునకమైవిద్యారణ్యంలోనువ్వివ్వాల వెంటబడొచ్చునిన్న ఇక్కడఅంజన్నా... లింగన్నా...నరేషులూ... అనేకులునడిచిన అడుగులున్నాయివారి పాదాల పాదులున్నాయ్!జాగ్రత్త!!
కవిత్వం

వాగ్దానం

మనుషులు పుడతారు చనిపోతారుతల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడానికి స్త్రీ పురుషుల కలయిక కారణం అయితేమరణానికి కారణాలు అనేకంసహజమరణాలు అసహజ మరణాలుఈ రెంటికీ మధ్యన జరిగిపోయే మరణాల సంగతేంటి ?వాటికీ ఈ రాజ్యం పెట్టిన పేరు ఎన్ కౌంటర్ఎన్ కౌంటర్ అంటే ప్రజలకు నమ్మకం అది ఏకపక్ష మరణ శాసనమని ఎక్కడో ఓ తల్లికి గర్భశోకం మిగిల్చారని!ఓ తండ్రి కల లను కాటిపాలు చేసారని!ఓ కొంపను నిలువునా కూల్చారని!ఓ ఊరును వాళ్ళకాడు చేసారని !మరణం మనుషులను దుఃఖంలో ముంచడం సహజమే !ఈ కింది నాలుగు పదాల వెతుకులట సంఘర్షణ లో నా... కనులు వర్షించి,ఈ కాగితం తడవడం నాకు తెలువకుండానే
కవిత్వం

యుద్ద భయం

వానికి యుద్దమంటే భయంఅందునా..అడవిలో యుద్ధమంటే అణువణువునా భయమే!అందుకేవాడుఅందరిని కుప్పేసుకొనిమంతానాలాడిఅడవిలోకి అడుగు పెట్టాలనిఅడుగులో అడుగేయడానికివెనకడుగు వేస్తాడుపిరికి గుండె దుండగీడు!అడవిలో ఆకులను చూసినాబాకులని భయపడుతాడుఎండు కట్టెను చూసినాఏకే రైఫిలనుకుని ఎగిసిపడతాడుఅడవిలో అగ్గిరవ్వలను లెక్కగట్టిఆర్పాలని ఆకాశమార్గాన మాటువేస్తాడువాడకున్న ధైర్యమంతా రాజ్యమే!చట్టమూ, సైన్యమూ భుజాన వేసుకొనిఅభివృద్ధి పాట పాడుకుంటూఅడవిబిడ్డలను ఆదమరపించికాటు వేయచూస్తాడువాడికితెలుసు... 'జనతనసర్కారు' ఎదుటతన సర్కారు తలదించుకోవాలని!జనరాజ్యం విస్తరిస్తేవాడిరాజ్యం అదృశ్యమవుతుందని తెలుసు.
stories

She is My Daughter

“My daughter…that’s my daughter…Oh God, that’s my daughter…Sukki…” From among the women looking at the dead bodies, Bhime fell on top of one of the bodies and started weeping. She would be about 50 years old. Everyone looked at her amazed. Then Adime came up and sat down beside her and said, “It’s not sukki, it’s kosi”. Adime was Bhime’s neighbour, of approximately the same age. “No, no, it’s my