బస్తర్ యుద్ధంలో అస్పష్ట విభజన రేఖ
2024లో ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల బలమైన కోట అయిన బస్తర్లో 287 మంది మావోయిస్టులను లేదా అంతకుముందు సంవత్సరం కంటే 10 రెట్లు ఎక్కువ మందిని తాము చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఫిబ్రవరి 9నాడు హత్య చేసిన 31 మందితో సహా 2025 ఫిబ్రవరి 10 వరకు కనీసం 80 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. మధ్య భారతదేశంలోని అడవులు, గ్రామాలలో యుద్ధం ఉధృతంగా జరుగుతోంది; దౌర్జన్యాలు, చట్టాతీత హత్యల ఆరోపణలు, ఆత్మీయుల మరణాలకు కావలసింది పరిహారం కాదనీ న్యాయం అనీ డిమాండ్ చేస్తున్న; తమ స్వంత గ్రామాలలోనే జరిగే హింస, మరణాలకు భయపడుతున్న ఆదివాసీలను వెతకడానికి మేం