అనువాదం

బస్తర్ యుద్ధంలో అస్పష్ట  విభజన రేఖ

2024లో ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల బలమైన కోట అయిన బస్తర్‌లో 287 మంది మావోయిస్టులను లేదా అంతకుముందు సంవత్సరం కంటే 10 రెట్లు ఎక్కువ మందిని తాము చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఫిబ్రవరి 9నాడు హత్య చేసిన 31 మందితో సహా 2025 ఫిబ్రవరి 10 వరకు కనీసం 80 మంది మావోయిస్టులను కాల్చి చంపారు. మధ్య భారతదేశంలోని అడవులు, గ్రామాలలో యుద్ధం ఉధృతంగా జరుగుతోంది; దౌర్జన్యాలు, చట్టాతీత హత్యల ఆరోపణలు, ఆత్మీయుల మరణాలకు కావలసింది పరిహారం కాదనీ న్యాయం అనీ డిమాండ్ చేస్తున్న; తమ స్వంత గ్రామాలలోనే జరిగే హింస, మరణాలకు భయపడుతున్న ఆదివాసీలను వెతకడానికి మేం
అనువాదం

ఇస్లామోఫోబియా ఎందుకు?

2024 జూలై లో, ఇంగ్లండ్‌లోని అనేక నగరాల్లో అల్లర్లు, దాడులు జరిగాయి. దీనికి ప్రధాన కారణం తప్పుడు వార్తలు, ప్రజల్లో ఉన్న వలస వ్యతిరేక భావాలు. అల్లర్ల బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలు. మసీదులు, వలసదారులు నివసించే ప్రదేశాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల తర్వాత, భవిష్యత్తులో ఇటువంటి హింసను నిరోధించే లక్ష్యంతో ఇంగ్లాండులోని 'ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్' ఒక నివేదికను విడుదల చేసింది. "ముస్లింలు కత్తి చూపించి ఇస్లాంను వ్యాప్తి చేశారు" అని చెప్పడాన్ని నిషేధించాలని నివేదిక పేర్కొంది. ఈ విశ్వాసం ఇస్లామోఫోబియాకు మూలమైన విషయాలలో ఒకటి. అనేక ఇతర అపోహలు, దురభిప్రాయాలు ప్రజల మనస్సులలో లోతుగా