కవిత్వం

విగ్రహం

నేలన మనుషులున్నంత కాలం విగ్రహాలెందుకు మనిషి మనిషి తో మాట్లాడనప్పుడే శిల్పాల సృష్ఠి మొదలు మట్టితో మమేకమైన జనంకు బొమ్మల లొల్లి పట్టదు రుధిరం చెమట చుక్కై నుదుటి నుండి రాలుతుంటే చెక్కబడిన రాయి ధ్యాస వుండదు నాలుగు వేళ్ళు లోనికి వెళ్లటమే గగనమై పోతున్న చేతులకు శిల్పానికి దండం పెట్టే తీరిక ఉండదు వంగి వంగి నాట్లు వేస్తుంటే వంగిపోతున్న నడుములు నిటారుగా ఉన్న విగ్రహం చేతిలోని వరి వెన్ను ను కాంచ లేవవు ఎవరు వచ్చి పొడిసేదేమీ లేదనే ఇంగిత జ్ఞానం సాయం కోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూడదు తన చుట్టూ ప్రకృతి ని
సాహిత్యం కవిత్వం

అమరుని స్వప్నం

ఎంతటి నిషి ఈ వసంతాన్ని ఆవరించిననూ ఎంతటి కుంభవృష్టి ఈ వాసంతాన్ని ముంచిననూ ఎంతటి అనావృష్టి ఈ వసంతాన్ని వంచించిననూ వారు చుక్కలవలే వెలిగి జ్ఞానాన్ని వెలువర్చారు సూర్యునివలే గర్జించి శక్తిని చేకూర్చారు చినుకువలే స్పందించి వసంతానికి ఉపిరిపోసారు వారు ఉల్కాపాతం వలే ఊపిరినొదిలి ఈ పాలపుంతలో వారి జ్ఞాపకాలను ఆశయాలను వదిలిపోయారు అయితే మేమే శృష్టికర్తలమను గర్వంతో విర్రవీగే వాళ్ళకు వారి అమరత్వం తలచుకున్నా వెన్నులో వనుకే అందుకే స్థూపాన్ని ఆపాలనుకుంటారు సభలని అడ్డుకుంటారు పుస్తకాన్ని నిషేదిస్తారు
కవిత్వం

నాగరికత గుండెలమీద చావుపాట

ఆక్సిజన్ అందకఇప్పటికే చాలానదులు చచ్చిపోయాయి అదేమిటోగానిమృతజలాలలోతేలియాడే తమశవాల్నిఎవరూ పట్టించుకోలేదు నదులగోసల్ని ఎవరైనా విన్నారాఊపిరాడకఎంతెంత నరకయాతన అనుభవించాయో తెల్సుకున్నారామనకు ప్రాణప్రదమైనమనకు బతుకునిచ్చిననదులిప్పుడుపారే శవాలు***మృతనదుల్లోశవాల్ని విడిచేస్తేచేసిన నేరాలు కొట్టకుపోతాయానదులమీదుగాతేలియాడే శవాల్లాగేనేరాలు సైతంకాలంనదిమీద తేలుతూ ఉంటాయ్ ఏదో ఒకరోజునఅన్ని నదులూఆక్సిజన్ అందకఊపిరాగి చచ్చిపోతాయిఆపుడా మృతనదుల మీదుగానాగరికతల అస్థిపంజరాలుతేలియాడుతూ పోయిచీకటి సముద్రంలో కల్సిపోతాయ్ నదులకుతామెప్పుడు చచ్చిపోతామో తెల్సుఆ వెంటే నాగరికత కూడా… (  జసింతా కెర్ కెట్టా (ఆదివాసి యువతి ) గారికవితకు       స్వేచ్ఛానువాదం......ఉదయమిత్ర )
కవిత్వం

చివరి పిచ్చుక

చివరిపిచ్చుక కొమ్మపై వాలింది బతుకునిచ్చిన లోకంలో తనకిదే ఆఖరి అరుపనిచుట్టూరా ధూళిమేఘంకమ్ముకుంది కూలుతున్న ఎత్తైన ఆశలగూళ్ళ కింద నవజాతాలుపిండాలు రూపం కోల్పోనాయి పిచ్చుక ఉహాగానంలో ఉంది నేను దేహాన్ని నిర్మిస్తే మీరా దేహంలో ఎముకలగూళ్ళు సృష్టించారు నేనొక ప్రకృతి రమణీయమిస్తే మీరందులో మృదంగాల్తో మృత్యుఘోషనుకానుకిచ్చారురెండహాల మధ్య రణమైతేరెండు తరాలకు సరిపడా గుండె సప్పుళ్ళు ఈ దినమే అంకితమివ్వడమేననియోచిస్తోంది కాలమై నిలిచి...!పిచ్చుక మళ్ళీ ఊహాగానం చేస్తుంది మనిషి యంత్రాలలోకం నుంచి ఆదిమలోకంలోకి పయనించాలని..!ఆయుధాలొదిలేసీప్రాణుల్తో మమేకమై ప్రకృతితో కంఠం కదిలించాలని ఊహాగానం చేస్తోందింకా.
కవిత్వం

ఇది‌ తల్లుల దేశం

ఆ తండ్రి పోరాట వారసత్వంఆమె ముని వేళ్ళ గుండావారి దేహమంతా ప్రవహిస్తూఈ దేశ భవిష్యత్ చిత్రపటాన్నిదేదీప్యమానంగా చిత్రిస్తోంది తను కన్నది వాళ్ళిద్దరినేవారు నిర్మించిందివేలాది విముక్తి సైన్యాన్ని బిడ్డల కోసంనెత్తుటి ధారలావర్షించిన తల్లి ప్రేమఒకవైపు నేల తల్లి విముక్తిసాధనలో వారున్నారన్నభరోసా మరోవైపుతనను నిటారుగానిబ్బరంగా నిలబెడుతూవచ్చాయి ఒకరు ఒరిగినాతనందించినజెండా ఎత్తుకున్నమరో బిడ్డచూపులకు కానరాకపోయినాఆ రెపరెపల వెచ్చని గాలితన నూరేళ్ళ శ్వాసయింది అమ్మలెప్పుడూ అంతెఒక కంట్లో సూరీణ్ణిమరో కంట వెన్నెలనీవిరబూయిస్తారు అమ్మలంతేతమ పచ్చని కొంగుతోదేశానికి తల్లులవుతారువీరుల‌ గొంతులోచనుబాలధారలవుతారు అమ్మలకు మరోమారునమస్కరిద్దాం (వీరమాత మల్లోజుల మధురమ్మకు వినమ్ర జోహార్లతో)
కవిత్వం

పోరుపతాక హోరును నేను..!!

కాలు మోపిన చోటల్లాఎద ఎండిన నదినైపగుళ్లిచ్చినప్రతిఫలనాల్ని దారి పొడుగునావొలక బోస్తూ..కన్నీళ్లతోకడుపు నింపుకున్నదాన్ని . శత్రు శతఘ్నులమోతల నడుమపుట్టుకతోనేకన్న తల్లినీ.. కడుపు చేత బట్టుకుతిరుగుడులో..తరాల తరుముడులో..సొంత ఇంటినీ..ఊరినీ..నేలనీ…జారవిడుచుకున్నదాన్ని..శకలాలు శకలాలుగాకుప్ప కూలుతున్నస్వప్నాల పెడ్డలకింద గుక్కపట్టిన శోకాలచివరి ఊపిరి తీసేచిన్నారి కళ్ళ అంచునరాజుకుంటున్నరాజిలేని గాజానో… హద్దుల నెరుగనినెత్తుటి హోళీలోకనికరమెరుగనికసాయి దాడులబూడిద గుట్టలు వారసమిచ్చివొరిగిన తల్లులసడలని పిడికిలిసత్తువ సావనిహమస్ శ్వాసనో… ఫిరంగి మోతలషహీదు బాటలత్యాగ తోరణాల్తయారు అన్నలిబియానో…లెబనాన్ నో… ఎవర్నైతే నేంఎప్పుడూ సడలనిఎక్కుపెట్టినఅక్కల పిడికిటిఆయుధాన్నేను… ద్విజాతుల దగాస్వజాతుల పగాలోకమంతా ఏకమైనానోరుమూయుడేశరణమన్నయుద్ధనీతుల బోధలల్లీబుజ్జగింపుల బురదదొక్కిగుండె మంటలుఆర్ప జూసినా.. నిప్పుకణికలహక్కు కుంపటిపోరు సెగనైసెంట్రి గాస్తా.. పుడమి నుదుటపొద్దుపొడుపుతిలకమయ్యీకలలు నిజమైగెలుపు గీతపురాగమయ్యీనడచివొస్తా… ఔనునాదైనచారెడు నేలకోసం..చావెరుగని నీడకోసం.. ద్రోహాల దోస్తానాలనెత్తుటి
కవిత్వం

ఒక ఎండా కాలపు దాహం    

ఈ వేసవి కాలందోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూగొంతులోని తడిని ఎగరేసుకుపోతూఎండను రాల్చుకుంటుంది .ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలుపిల్లలు మూగిన ఐస్ క్రీం బండిబాధ్యత రెక్కల్ని విప్పుతుంది .కన్నీటి దుఃఖాల్నిలోలోపల ఆరేసుకుంటుంది .ఇంటి  లోపల ఉతికిన వస్త్రాల్ని చూస్తే చాలు బయట ఎండలోవయసు భారాన్ని లెక్కచేయనిఇస్తిరి పెట్టి ముసలివాడుబొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు .ఎండ పేలిపోతున్నబండి కదలదు .శ్వాస ఆగిపోతున్నబతుకు పోరాటం ఆగదు .చూపులు తిప్పుకునినీటి టబ్బు వైపు చూస్తే చాలు గడపలో నీటి కోసం కాకులుఊగుతుంటాయి.నీట మునుగుతుంటాయి . ఒక ఎండా కాలం నీటి స్పర్శ కోసంగొంతులు మధన పడుతుంటాయి .నా చుట్టూ ఎండను తీసిగొడుగులా  కాసిఒక్కో గొంతులో నీటినిపోసిస్వచ్ఛంగా  స్వేచ్ఛగాపక్షిలా బతకాలనుంటుంది .ఒక ఎండాకాలపు దాహంమనిషిని కాల్చకుంటే ఎంతబావుణ్ణు.చినుకునై కురిస్తే ఇంకెంత బావుణ్ణు . ===========================
కవిత్వం

కవితా పరాగం

తేనె ఫలం1.ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లోపడ్డ నీ పాద ముద్ర లోఒలికిన నా చూపు లోసగం చీకటిసగం వెలుతురు ఇప్పుడు..2.ఎంత తీరైన నడకఇసుక పై రంగవల్లి అల్లినట్టుఏ తోట్రుపాటు లేదురంగు జాతీయత పట్టింపు లేనిఆలింగనపు మహత్తుపాదాన్ని నేల ముద్దాడుతుందిమాటని పెదవి విహంగం చేస్తుందిభాష కు భవబంధాలు తెలియవుపరిస్థితులతో సంబంధం లేని పయనం నీదిమన్ను దేహంగా పొందిన నదిలాంటిది నీ ప్రయాణంఎడారి స్థితికి వాన మీదావానకి ఎడారి మీదా మమకారం పెంచిఒకే రకమైన ప్రేమ ను పంచిప్రేమ తెలియని ప్రాంతాల్లోనీ కనుచూపును చిలకరించినవ్వుల్ని మొలిపించేసేద్యం నీ పధంవెలుతరూ చీకటి విత్తులుగా నాటిమానవత్వపు పంట పండించడంనీ వృత్తి3.ఎడారి తిన్నెల మీంచి మట్టి వేణువు
కవిత్వం

అమరుని తల్లి

ఇంతకీ…ఈ ఆపదను తట్టుకోమనే ఓదార్పు మాటలు చెప్పడానికి ఆ తల్లికి అక్కడ ఎవరూ లేరు.నీ సానుభూతంటావా.. ఆమెకి అవసరమే లేదు.నీ మాటలంటే ఆమెకి లెక్కే లేదు.అసలు ఆమె ఎవరనుకుంటున్నావు?ఆమె అమరుని తల్లి !ఒకటి,రెండు,మూడు,నాలుగు ,ఐదేసి చుక్కలు.. చుక్కలుగా కపటంతో రాలిపోయే నీ మొసలి కన్నీళ్లనే… ఆమె తన తెగువతో ఆశ్చర్య పరుస్తుంది..నిలవరిస్తుంది!మూగ ప్రేక్షకుల దొంగ సానుభూతి ఆమెకెందుకు ? కౄరంగా చంపబడిన తన కొడుకులు మిగిల్చిన ఖాళీని..నీ అల్పమైన సహనుభూతితో పూడ్చలేవు.కొడుకుల మరణ దుఃఖాన్ని గుక్కిళ్లు గా మింగెయ్యమని.. మౌనంగా ఉండమని ఆమెకి చెప్పే అర్హత నీకు లేదు గాక లేదు !ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..?నీ
కవిత్వం

రఫాత్ అలరీర్ కోసం

మనమంతా మరణించాల్సిందే నేనంగీకరిస్తాను కానీ ఎవ్వరూ ఒక భవనం నుంచి మరొక భవనానికి, శిథిలం కావడానికో, మాంసధూళి కావడానికో పరుగెత్తరాదు ఏ తల్లీ తన పిల్లలకు వీడ్కోలు గాలిలో రాసే పరిస్థితి రాకూడదు మృత్యువు కాసేపు నుదిటి పై నిలిచి పోవాలి ఆకులపై దట్టమైన మంచువలె అప్పుడు మనం దుఃఖించాలి కరుగుతున్న మంచుబిందువులు నేలపై రాలుతున్నట్లుగా అర్థాంతరంగా, ఆకస్మికంగా, అమానవీయంగా మృత్యువు ఇంతటి కూృరమైన శత్రువు కాకూడదు నేను నీ కోసం ఒక పతంగి తయారు చేస్తాను ఆ రోజు మనల్ని మనం విముక్తం చేసుకుంటాం ఆ రోజు మనం స్వాతంత్య్రయాన్ని పొందుతాం అయితే నేను పతంగిని కఫన్