వ్యాసాలు

ఏడు నెలల మహత్తర సిల్‌గేర్ పోరాటం

డిసెంబర్ మాసం, చలి కాలం రాత్రి 10 గంటల సమయం. సిల్‌గేర్ గ్రామం…. చింత చెట్టు కింద మండుతున్న నెగళ్ళ  చుట్టూ దాదాపు 30 మంది యువతి, యువకుల బృందం కూచుని వుంది. మంటల నుంచి వచ్చే వెలుతురు చీకటిని చీలుస్తూ, చెట్ల నీడల్లో మెరుస్తోంది.  ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఇలా సమావేశం జరగడం చాలా అసాధారణమైన విషయం. భద్రతా బలగాలు,  మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న దారుణ, సుదీర్ఘ పోరాటానికి కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్‌లోని అడవికి నడిబొడ్డున వున్న సిల్‌గేర్ అనేక మంది అమాయకులు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న యుద్ధ భూమి. సాధారణంగా
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

విప్లవ సాహిత్య విమర్శకు విలువైన చేర్పు

నాగేశ్వరాచారి మూడు దశాబ్దాలకు పైనే పరిచయం, స్నేహం. గద్వాల నుంచి మొదలుపెట్టి కర్నూలు, హైదరాబాద్, అనంతపురం దాకా రాష్ట్రంలో ఎన్నెన్నోచోట్ల సాహిత్య సమావేశాల్లో కలుస్తూనే ఉన్నాం. అడపాదడపా తన రచనలు అరుణతార లోనో, మరొక పత్రికలోనో చూస్తూనే ఉన్నాను. కాని తనలో ఇంత నిశితమైన ఆలోచనాపరుడైన సాహిత్య విమర్శకుడు ఉన్నాడని ఈ పుస్తకంలోని దాదాపు ముప్పై వ్యాసాలు ఒక్కచోట చదివినప్పుడే తెలిసింది. విద్యార్థి ఉద్యమం ద్వారా సామాజిక ఆలోచనాచరణలోకి ప్రవేశించడం, విశ్వవిద్యాలయ విద్యలో తెలుగు భాషా సాహిత్యాలలో సుశిక్షితుడు కావడం, అధ్యాపక వృత్తిలో నిరంతర అధ్యయనానికీ, జ్ఞాన వితరణకూ అవకాశం రావడం, అనంతపురం వంటి సంక్షుభిత వాతావరణంలో విప్లవ
వ్యాసాలు

సంఘటితం అవుతున్న బస్తర్ ఆదివాసీ పోరాటాలు

“గత సంవత్సరం, కొంతమంది జిల్లా రిజర్వ్ గార్డులు గ్రామానికి వచ్చి నన్ను పట్టుకుని, నక్సలైట్లు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని వేధించడం మొదలుపెట్టారు. రెండు రోజుల పాటు అడవిలో తిప్పారు. చాలాసార్లు శారీరకంగా హింసించి, చివరకు అడవిలో వదిలేశారు, ”అని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతా బలగాల ఆరోపణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న స్మిత (పేరు మార్చబడింది) అన్నారు. గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న భద్రతా బలగాల శిబిరాలకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ జిల్లాల్లో నిరసనలు చేస్తున్న వేలాది మంది గ్రామస్తుల్లో స్మిత ఒకరు. స్మిత గ్రామంలో మాదిరిగానే, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, సుక్మా, తదితర జిల్లాల్లోని గ్రామాల్లో భద్రతా దళాల
సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి
వ్యాసాలు ఓపెన్ పేజీ

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
సాహిత్యం వ్యాసాలు

వ‌ర్గ పోరాట ఆచ‌ర‌ణ‌లో సంస్కృతి

(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం - వ‌సంత‌మేఘం  టీం)  మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ
సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
వ్యాసాలు

వ్యక్తిగత గోప్యతకు తూట్లు

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగియక ముందే మరో వివాదస్పద అంశం కొత్తగా ముందుకొస్తున్నది. ఇప్పుడు “వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు(పిడిపిబి) 2021” పేరుతో మరో వివాదం ముంచుకొచ్చింది. వ్యక్తిగత గోప్యతను మానవ హక్కుగా గుర్తించే అంతర్జాతీయ ఒప్పందంపై 1948లోనే భారత్‌ సంతకం చేసింది. ఏడు దశాబ్ధాలు గడిచినా ఆమేరకు పటిష్ట చట్టాన్ని రూపొందించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. వ్యక్తిగత గోప్యతను పరిరక్షించడానికి 128 దేశాలు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చాయి. వ్యక్తుల వివరాలు అంగడి సరకులు కాకూడదంటే దేశీయంగా అందుకు తగిన ఏర్పాట్లు అత్యవసరమని అత్యున్నత న్యాయస్థానం లోగడే
వ్యాసాలు

విప‌త్తు అంచులో మాన‌వాళి

పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక, సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ , నీటి ఆవిరి  సమతుల్యంగా ఉండాలి.  ఈ సమతుల్యత జల  వలయం సాధారణ వర్షపాతం, జంతువుల  మొక్కల జీవిత చక్రాలకు సహాయపతాయి.   పర్యావరణ సమతుల్యం వన్యప్రాణి మరియు వ్యవసాయానికి  మానవుని అభివృద్ధికి సహాయపడుతుంది.  కాలుష్య కారకాలను  వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం  అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం.  వ్యవసాయ గృహ నిర్మాణం అటవీ నిర్మూలనకు దారితీ స్తున్నాయి.
సాహిత్యం వ్యాసాలు

విప్ల‌వ మాన‌వుడు

విప్లవకారులు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధపడడం వల్ల బయట సమాజానికి అజ్ఞాతంలో ఉండి పనిచేసే విప్లవకారులు ఎలా ఉంటారు అనే విషయం అర్థం అయింది. విప్లవకారుల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన కామ్రేడ్‌ ఆర్కే బయట ఉన్న ఆ కొద్ది రోజుల్లోనూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపపజేశాడని చెప్పవచ్చు. మీడియా ప్రతినిధులు ఆయనను అనేక విషయాల మీద ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ప్రతి క్షణం తాను ప్రజల తరుఫున మాట్లాడడానికి వచ్చాననే విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడారని అనిపించింది. ఇంగ్లీషు పత్రికల విలేఖరులు అడిగిన ప్రశ్నలను అనువాదం చేయించుకొని మళ్ళీ తెలుగులోనే జవాబులు చెప్పేవారు. దానివల్ల సామాన్య ప్రజలు కూడా ఆయన