సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా
వ్యాసాలు

ప్రజా జీవితం వెల్లి విరియడానికే మా పోరాటం

(ప్ర‌జా జీవితం వెల్లివిరియ‌డ‌మ‌నే క‌వితాత్మ‌క వాక్యానికి ఆర్‌కె ఎంత విస్తృత రాజ‌కీయ  వ్యాఖ్యానం చేశాడో ఈ వ్యాసంలో చూడ‌వ‌చ్చు. జీవితాన్ని ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌, అస‌మ సాంఘిక సంబంధాలు ప‌ట్టి ఉంచిన తావుల‌న్నిటా విప్ల‌వం జ‌రగ‌ల‌వ‌సిందే అంటాడు ఆర్‌కె. కొంద‌ర‌నుకున్న‌ట్ల విప్ల‌వం  ఏదో ఒకానొక స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే ప‌రిపూర్తి కాదు. అదొక సింగిల్ పాయింట్ ప్రోగ్రాం కాదు. అది బ‌హుముఖీన‌మైన క‌ర్త‌వ్యం. ఈ విష‌యంలో విప్ల‌వకారుల అవ‌గాహ‌న‌ను ఇంత చిన్న వ్యాసంలో ఆర్‌కె రాశాడు. జీవితం వెల్లివిరిసేలా చేసుకోవ‌డం ఈ  రాజ్యం ద్వారా సాధ్యం కాద‌ని, ఈ రాజ్యాంగ ప‌రిధిలో అయ్యేప‌ని కాద‌ని చెప్ప‌డం ఆయ‌న అస‌లు ఉద్దేశం. ఇంత
వ్యాసాలు

నిషేధం ఎత్తివేత రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుంది

(2004 అక్టోబ‌ర్ 15 నుంచి19 దాకా అప్ప‌టి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, రెండు విప్ల‌వ పార్టీల‌కు మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగాయి. దానికి స‌న్నాహంగా తెలుగు స‌మాజాల్లో ఒక గొప్ప భావ సంఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ మొత్తానికి విప్ల‌వోద్య‌మం వైపు నుంచి కా. ఆర్‌కె నాయ‌క‌త్వం వ‌హించాడు.  శాంతి చ‌ర్చ‌ల  నేప‌థ్యంలో  2004 జూలై నుంచి న‌డిచిన *చ‌ర్చ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ స్పేస్* ప‌త్రిక బులెటిన్‌2(జూలై 25)లో ఆర్‌కె రాసిన వ్యాసం ఇది. పాఠ‌కుల కోసం పున‌ర్ముద్రిస్తున్నాం- వ‌సంత‌మేఘం టీం) ఈ వాదన కొందరికి ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగాను అనిపించవచ్చు. కాని, సామాజిక రుగ్మతలను, అసమానతలను, అన్యాయాలను రూపుమాపడంలో ప్రజలు ఎదుర్కొంటున్న
వ్యాసాలు

సంక్షేమ హౕస్టళ్ళు, గురుకులాల భ‌విత‌వ్యం?

కోవిడ్  సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రత్యక్ష విద్యబోధ‌న  ప్రారంభమైంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలత చెందిన కొంత మంది తల్లిదండ్రులు, వ్యక్తులు సెప్టెంబర్ 1 నుండి పాఠశాలల ప్రారంభం నిలిపివేయాలని పిల్ వేశారు. ఆగస్టు 31 నాడు అత్యవసరంగా హైకోర్టు బెంచ్ పాఠశాలల ప్రారంభంపై విచారణ జరిపి గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళను మినహాయించి మిగిలిన విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతినిచ్చింది.అదే సమయంలో గురుకులాలు,సంక్షేమ హౕస్టళ్ళలో కోవిడ్ నిబంధనలు అమలుపై, అక్కడి వసతుల కల్పన, కనీస సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురుకులాలో, సంక్షేమ హౕస్టళ్ళలోని విద్యార్థులు నివసించే గదులలో కోవిడ్ నిబంధనలు అమలుకు ఏమాత్రం అవకాశం
సాహిత్యం వ్యాసాలు

వివాదాస్పద వ్యక్తిత్వం

ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.   ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం
వ్యాసాలు సాహిత్యం

పంజరంతో ప‌క్షి యుద్ధం

ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. "  Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా  కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని  పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత
వ్యాసాలు

రాజును చంపడం ఎందుకు తప్పు?

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ పసిపాపను అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపిన రాజు రైలు పట్టాలపై శవమయ్యాడు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా, అతన్ని చంపేసి పట్టాలపై పడేశారా అన్న విషయంపై అనుమానాలున్నాయి కాని జనం న్యాయం జరిగిందని ఊపిరి పీల్చుకున్నారు. నిలువెల్లా గగుర్పాటు కలిగించిన సైదాబాద్ సంఘటనకు చలించని మనసు లేదు. ఎంత మంది తమ పిల్లలని పొదువుకొని గుండెలు గుబగుబలాడగా దుఃఖితులై ఉంటారో అందరూ ఆ పని చేసినవాడ్ని ఏం చేసినా పాపం లేదని అనుకొని ఉంటారు. అందరూ శపించినట్లుగానే రాజు దిక్కులేని చావు చచ్చిపోయాడు. న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా న్యాయం
సాహిత్యం వ్యాసాలు

పోడు భూముల స‌మ‌స్య‌కు ఇదీ ప‌రిష్కారం

ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ "షెడ్యూలు - వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు - సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ - పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
సాహిత్యం వ్యాసాలు

ప్లేటో కవిత్వ ద్వేషకుడా?

ప్లేటో కవిత్వాన్ని-కవులను వ్యతిరేకించేవాడని మనకు గ్రీకు సాహిత్యంతో కొద్దోగొప్పో పరిచయమున్నా తెలిసే ఉంటుంది. నిజానికి ప్లేటో గ్రీకు తాత్త్విక అభివృద్ధికి బీజాలు వేసాడని మనం చెప్పుకుంటాము. అయితే హెగెల్ వంటి ప్రముఖ తాత్త్వికుడు పారమనిడ్స్ అనే తాత్త్వికుడి   పారమార్ధిక చింతన తత్త్వం మాత్రమే తత్త్వశాస్త్రం అనే శాఖ అభివృద్ధికి మూలమైనదని వివరించారు. ఏమైనా పారమనిడ్స్   ఈ పారమార్ధిక చింతన   జడత్వ సారం అలాగే జెనో యొక్క గతితార్కిక ప్రయోగాన్ని ప్లేటో సమన్వయించి తన తత్త్వశాస్త్రపు పద్ధతిని అభివృద్ధి పరిచాడు(మరికొంత మంది తాత్త్వికుల తత్త్వాలని సైతం సమన్వయం చేసాడు). పారమనిడ్స్ గతిని-చలనాన్ని కేవలం భ్రమ అని ఈ విశ్వం అనాది-అనంతం