సాహిత్యం కవిత్వం

కదిలే కాలం..

ఎప్పుడో ఏదో ఒకక్షణాన కమ్ముకున్న చీకట్లుతొలగిపోక మానవు రాబందుల రెక్కలలోచిక్కిన పావురాలుఆకాశంలో ఎగరక మానవు వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డమణికట్లు మరల పిడికిలెత్తిఅభివందనం చేయక మానవు ఓరిమితో ఎదురు చూడాలిసమయమింకా ముగిసి పోలేదుఅందరమూ మరొకసారికలుసుకొని కదిలే కాలమే ఇది!! (దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)
సాహిత్యం కవిత్వం కారా స్మృతిలో

కథల తాతయ్య

గదిలో ఒకచోట ఖాళీ నిండిందిఆ వాలుకుర్చీని అల్లుకునిపాలపండ్ల చెట్టొకటి వుండేదికుర్చీ ముందువెనుకలకొన్ని ఆలోచనలు గాలిలో పూసిబహు నెమ్మది మాటలుగా వీచేవిచెవియొగ్గి వినాలి మనంజీవితాన్ని దున్నిన అనుభవాల పంటసేద్యం నేర్చినవాడు చెప్పిన కథ                o0oఅతను గడుసరి, అతను మనసరినిత్య చదువరిగంపెడు ప్రేమ, ఒకింత కోపం మెండుగా మొండితనంకూడికతో అతనొక పిల్లల కోడిమొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.దొంగ ఏడుపుల్ని ఎండగట్టిఅసలు దుఃఖపడుతున్న వాళ్లచెక్కిళ్ళు తుడిచాడు                         o0oమక్కువతో చేరదీసిన అన్నిటిపైనాదిగులుపడే తాతతనం నిండినమనిషొకడుండేవాడు యిక్కడఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళకుశలమూ ఆడిగేవాడుపిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్నతొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడుయీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.                            o0oకనిపించడుగానీ అన్నీ గమనించేవాడుమన
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథలు ఎందువల్ల నిలుస్తాయి?

వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఒక
సాహిత్యం కారా స్మృతిలో

జీవిత దృక్పథమే కథా.. కథలనిలయమే… కారా మాస్టార్

కాళీపట్నం రామారావు గారు యీ లోకం నుంచి వెళ్ళిపోవటం.. మాష్టారు గార్ని వొక‌ జ్ఞాపకంగా మాట్లాడుకోవటం బాధగా గుండెల్ని మెలిపెడుతూనే వుంది.  మాష్టారి గారితో  వ్యక్తిగతంగా.. కధానుబంధంగా..  వున్న జ్ఞాపకాలను రచయితలు మాత్రమే కాదు. యెందరో పాఠకులూ పంచుకుంటున్నారు. పరిశోధకులు కథా నిలయం తమ పరిశోధనకి యెలా వుపయోగపడిందో  గుర్తుచేసుకుంటున్నారు.  మనం రాసిన వాటినే మనం దాచుకోలేని వారెందరో వున్న కాలంలో దాదాపు మనందరి కథలని  అక్కడ భద్రపరిచే పనిని కథపై, ముందు తరాలపై యిష్టంగా.. ప్రేమగా.. బాధ్యతగా.. గౌరవంతో వారు ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేశారు.  మనందరికీ తెలుసు వారు వుపాధ్యాయులని. పిల్లలకి శ్రద్ధ లెక్కలు చెపుతూ
సాహిత్యం కవిత్వం

కనుపాపల్లోనుండి

మా ఇంటిముందురోడ్డువారగా గులాబీ చెట్టుచెట్టు చిన్నదేగానిగుత్తులుగా పువ్వులుఅటుగా వెళుతున్న అందరినిపలకరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ చెట్టు పువ్వులపై పడిన కళ్లల్లో ఆశ్చర్యంపెదాలపై దరహాసం నడిచివెళుతుంది ఒక పువ్వు కోసుకోమంటారా!అటుగావెళుతున్న ఒక కేకఆపిలు విన్నప్పుడెల్లావినకుడాని మాటేదో విన్నటు చిరాకు వద్దులే అనిసున్నితంగా తిరస్కరించినప్పుడుఆకేకనిరాశగానిట్టూర్పుతోవెనుదిరిగి వెళ్లిపోతుంటేపువ్వులు ఊపిరి పీల్చుకుంటూఒక కృతజ్ఞతనునా మీదకు విసిరేసేవి ప్రకృతిని శ్వాసించనివికృతదేహాలుపువ్వుల ప్రమేయంలేకుండావాటిని తాకుతున్నపుడుకాళ్ళకింద నలిపేస్తున్నప్పుడునిరశిస్తాయినినదిస్తాయియుద్దాన్ని ప్రకటిస్తాయి పువ్వులు లేనితోటపువ్వులు లేనిఇల్లుమబ్బులుకమ్మిన ఆకాశమే పువ్వులుఆహ్లాదాన్నిస్తాయిపువ్వులుఆనందాన్నిస్తాయి పువ్వులువడలిపోయి రాలిపోతున్నప్పుడుఎన్నటికీకనిపించకుండాపోతున్న బిడ్డల్లా అనిపిస్తాయి ప్రకృతినిఅమితంగా ప్రేమించే సూర్యంచెట్టునిపువ్వుల్నితన మొబైల్ ఫోన్ కెమెరాలోజ్ఞాపకాలుగా దాచుకున్నప్పుడుచెట్టుచెలిమిచేసింది శృతి చెట్టుని దాటుకుంటూ లోనికివస్తున్నప్పుడుచెట్టే తనని పాలకరించిందో!శృతియే చెట్టుని పాలకరించిందో!ముందుఎవరిని ఎవరు పలకరించిపరిచయం చేసుకున్నారోగానిసూర్యం శృతి అమరులయ్యాకచెట్టుదుఃఖమయ్యిందికన్నీళ్ల
కథలు

అడవి నేర్పిన అమ్మతనం

(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత) మీనూ, నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను. ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను. నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల
సాహిత్యం కారా స్మృతిలో

సాహిత్యంలో ప్రాసంగికత: కారా ఉదాహరణ

కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు. కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల  ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో